India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమించి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఖమ్మం రూరల్ మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన సంజయ్ అనే యువకుడు ప్రేమ పేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కొద్ది రోజుల క్రితం నిలదీయగా, అతను నిరాకరించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.
గంజాయి కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఏర్గట్ల SI మచ్చేందర్ రెడ్డి తెలిపారు. కమ్మర్పల్లికి చెందిన ఆరీఫ్ ఇంట్లో ఫంక్షన్కి HYDకి చెందిన అబ్దుల్ రెహమాన్, అజర్, శంషద్, సమీర్, వంశీవర్ధన్, సలీం పాషా హాజరయ్యారు. నిర్మల్కి చెందిన షాదుల్లా, అజారుద్దీన్ వద్ద గంజాయి కొని తాళ్లరాంపూర్ ఈతవనంలో గంజాయి తాగుతూ హంగామా చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసి 268 గ్రా. గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు SI వెల్లడించారు.
ప్రేమ పేరిట వశపరచుకొని, పెళ్లికి నిరాకరించిన ఓ వ్యక్తిపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాలు.. ఆత్మకూర్కు చెందిన రమేశ్ ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఈక్రమంలో శారీరక సంబంధం ఏర్పరచుకొని పెళ్లికి నిరాకరించడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
యువతి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాపట్లకు చెందిన యువతి HYDలో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె స్నానం చేస్తుండగా పొరుగింటి యువకుడు వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను ఆమెకు పంపి డబ్బు కావాలని బెదిరించగా రూ.40 వేలు పంపింది. కొన్ని రోజులకు మళ్లీ డబ్బు కావాలని అడగడంతో భయపడిన యువతి బాపట్లకు వెళుతూ బస్సులోనే పురుగు మందు తాగింది. తోటి ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
యువతి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాపట్లకు చెందిన యువతి HYDలో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె స్నానం చేస్తుండగా పొరుగింటి యువకుడు వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను ఆమెకు పంపి డబ్బు కావాలని బెదిరించగా రూ.40 వేలు పంపింది. కొన్ని రోజులకు మళ్లీ డబ్బు కావాలని అడగడంతో భయపడిన యువతి బాపట్లకు వెళుతూ బస్సులోనే పురుగు మందు తాగింది. తోటి ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు పొందుటకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ జుమ్లానాయక్ తెలిపారు. వచ్చే నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రాధాన్య క్రమంలో ట్రేడ్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. 14 ఏళ్ల వయసు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలన్నారు. అభ్యర్థులు వాడుకలో ఉన్న ఫోన్ నంబరును అందజేయాలన్నారు.
చిన్నంబాయి మండలం లక్ష్మీ పల్లికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాలో ఐదు నెలల కాలంలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు హత్యకు గురయ్యారని ఆయన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. జిల్లా మీడియా సెల్ కన్వీనర్ అశోక్ నిందితులను శిక్షించాలన్నారు.
గురుకుల నోటిఫికేషన్లో ఇచ్చిన 9210 ఖాళీలను నింపే సదుద్దేశంతో 2 నెలల క్రితం ప్రభుత్వం ఎంపికైన అభ్యర్ధులను గురుకుల సొసైటీలకు కేటాయిస్తూ అభ్యర్థులకు అలాట్మెంట్ ఆర్డర్స్ అందజేసి నిరుద్యోగుల జీవితాలలో ఆశలు చిగురించేలా చేసింది. ఇదే ఆర్డర్లో ప్లేస్ అఫ్ పోస్టింగ్ను విడిగా అందజేస్తామని చెప్పినప్పటికీ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఇప్పటివరకు అభ్యర్థులకు అందజేయలేదు. వందలాది మంది పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని ఎస్వీ ల్యాబ్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. రియాక్టర్ వద్ద లీకేజీ అవడంతో ప్లాంట్ ఇన్ఛార్జ్ నాగరాజు (34) మృతి చెందాడు పరిశ్రమలో పని చేస్తున్న మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక <<13298191>>రైల్వే కోర్ కారిడార్ <<>>ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.
Sorry, no posts matched your criteria.