Telangana

News May 23, 2024

HYD: టీ-వర్క్స్, టీ-హబ్‌కు సీఈవోల నియామకం

image

రాష్ట్ర ప్రభుత్వం టీ-వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, టీ-హబ్ సీఈవోగా సీతా పల్లచోళ్లను నియమించింది. ఈ మేరకు ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా టీ- వర్క్స్ అనేది ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రం.

News May 23, 2024

హైదరాబాద్‌లో విషాద ఘటన

image

HYDలో విషాద ఘటన జరిగింది. దుండిగల్ SIరాజేశ్ తెలిపిన వివరాలు..బిహార్‌కు చెందిన రాహుల్, ప్రీతి(24) దంపతులు HYD‌కు వలసొచ్చి బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటున్నారు. వీరికి కుమార్తె ఉంది. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా కూతురు చూస్తుండగానే ప్రీతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఏం చేసుకుందో తెలియని ఆ చిన్నారి చాలాసేపు అమ్మని చూస్తూ ఏడవగా స్థానికులు వచ్చి పోలీసులకు విషయం చెప్పారు.

News May 23, 2024

హైదరాబాద్‌లో విషాద ఘటన

image

HYDలో విషాద ఘటన జరిగింది. దుండిగల్ SIరాజేశ్ తెలిపిన వివరాలు..బిహార్‌కు చెందిన రాహుల్, ప్రీతి(24) దంపతులు HYD‌కు వలసొచ్చి బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటున్నారు. వీరికి కుమార్తె ఉంది. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా కూతురు చూస్తుండగానే ప్రీతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఏం చేసుకుందో తెలియని ఆ చిన్నారి చాలాసేపు అమ్మని చూస్తూ ఏడవగా స్థానికులు వచ్చి పోలీసులకు విషయం చెప్పారు.

News May 23, 2024

NLG: ‘నాన్ స్టాప్ బస్సులు ఆగుతాయి’

image

నార్కట్ పల్లి శివారులోని నల్గొండ బైపాస్‌లో నల్గొండ, మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే నాన్స్టాప్ బస్సులను నిలపడం కోసం ప్రత్యేక స్టాపులను ఏర్పాటు చేసినట్లు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. నార్కట్ పల్లి నుంచి హైదరాబాద్‌కు ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నుంచి నల్గొండ ఛార్జీ తీసుకుంటారని అన్నారు.

News May 23, 2024

MBNR: మహిళల మృతి కేసులో ఆటో డ్రైవర్ అరెస్ట్

image

కర్నూల్ మండలం చెరువులో పడి ఈనెల 19న మరణించిన ఇద్దరూ మహిళల మృతి కేసులో ఆటోడ్రైవర్ మహ్మద్ బాషాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులకు వివరాల ప్రకారం.. MBNR జిల్లాకు చెందిన జానకి, అరుణ వేశ్య వృత్తి కొనసాగుతూ కర్నూలు వచ్చేవారు. బాషా, జానకి మధ్య మనస్పర్థలతో బాషాను ఇతరులతో కొట్టించింది. కక్ష్య పెంచుకున్న భాష గార్గేయపురం చెరువులో జానకిని తోసేశాడు. కాపాడబోయిన అరుణ కూడా మరణించింది. 

News May 23, 2024

మెదక్: పెట్రోలు పోసి నిప్పంటించి హత్య

image

నర్సాపూర్‌లోని రాయరావు చెరువు ప్రాంతంలో రెండు <<13294262>>మృతదేహాలు <<>>బయపడిన విషయం తెలిసిందే. CI , SI ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎక్కడో ఇరువురి గొంతులకు ఉరి బిగించి హత్య చేశాక ఇక్కడికి తరలించి పెట్రోలు పోసి తగల బెట్టినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇరువురి మృతదేహాలపై దుస్తులు లేవు. వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

పంటల సాగుకు సిద్ధమవుతున్న ఖమ్మం జిల్లా రైతులు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి రోహిణి కార్తీ రానుంది. ఈ నేపథ్యంలో కార్తి వచ్చిన వెంటనే పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాలలో రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసి ఉంచారు. సకాలంలో వర్షాలు కురుస్తుండడం వల్ల రైతులు పెద్ద ఎత్తున మెట్ట పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.

News May 23, 2024

నెన్నెల వాసికి రూ.కోటి జీతంతో ఉద్యోగం

image

నెన్నెల మండలం గుడిపేటకు చెందిన మాలోతు తిరుపతి (28) ఏడాదికి రూ.కోటి జీతంతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన అమెరికాలోని జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో PHD పట్టా పొందారు. దీంతో బుధవారం ధర్డ్ వేవ్స్ సిస్టమ్ రీసెర్చ్ మేనేజర్‌గా ఏడాదికి రూ.కోటి జీతంతో ఉద్యోగం లభించింది. తిరుపతి తల్లిదండ్రులు రాంచందర్, శకుంతల నిరక్షరాస్యులు. వ్యవసాయం చేస్తూ వారి ఇద్దరు కుమారులను చదివించారు.

News May 23, 2024

తీన్మార్ మల్లన్న గెలుపు కోసం రంగంలోకి రేవంత్ రెడ్డి

image

ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. బుధవారం రాత్రి సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్), మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జీలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జీలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

News May 23, 2024

భూపాలపల్లి, ములుగు మీదుగా రైల్వే లైను 207.80 కి.మీ

image

రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.