Telangana

News May 23, 2024

NLG: నేడు సాగర్‌లో బుద్ధ జయంతి

image

నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో బుద్ధ జయంతి ఉత్సవాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలు నిర్వహించడానికి పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో బుద్ధవనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో బౌద్ధ బిక్షవులతో బుద్ధ పాదుకల వద్ద ప్రత్యేక పూజలతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు బుద్ధవనంలోకి ఉచిత ప్రవేశ సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News May 23, 2024

NZB: ఫలితాలకు ఇంకా 13 రోజులే

image

ఈ నెల 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆభ్యర్థులుగా పోటీ చేసిన వారే కాకుండా పార్టీల గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన నాయకులు సైతం ఎన్నికల రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సారి గెలుపుపై ప్రధాన పార్టీల నేతలు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఇంకా 13రోజులే ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మెదలైంది.

News May 23, 2024

HYD: ఆ తల్లి ఆరుగురికి జీవం పోసింది..!

image

HYDలో ఓ తల్లి మరణించినా.. అవయవ దానం ద్వారా ఆరుగురికి ప్రాణం పోశారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలానికి చెందిన జంపాల సుజాత అపస్మారక స్థితిలో ఇటీవల కింద పడిపోయారు. వెంటనే ఆమెను HYD మేడిపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా, తాజాగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల అంగీకారంతో సుజాత గుండె, నేత్రాలు, కాలేయం తీసుకుని ఆరుగురికి అమర్చి, ప్రాణం పోసినట్లు జీవన్ దాన్ బృందం తెలిపింది.

News May 23, 2024

HYD: ఆ తల్లి ఆరుగురికి జీవం పోసింది..!

image

HYDలో ఓ తల్లి మరణించినా.. అవయవ దానం ద్వారా ఆరుగురికి ప్రాణం పోశారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలానికి చెందిన జంపాల సుజాత అపస్మారక స్థితిలో ఇటీవల కింద పడిపోయారు. వెంటనే ఆమెను HYD మేడిపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా, తాజాగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల అంగీకారంతో సుజాత గుండె, నేత్రాలు, కాలేయం తీసుకుని ఆరుగురికి అమర్చి, ప్రాణం పోసినట్లు జీవన్ దాన్ బృందం తెలిపింది.

News May 23, 2024

HYDలో ఎక్కడ చూసినా ఆహార కల్తీనే..!

image

HYDలో ఇన్ని రోజులు చిన్న హోటళ్లలో ఆహారకల్తీని అధికారులు గుర్తించగా ఇప్పుడు పెద్ద వాటిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం సోమాజిగూడ క్రుతుంగ రెస్టారెంట్, రెస్ట్ ఓ బార్, KFCలో నాసిరకం, పాడైన ఆహారపదార్థాలు గుర్తించామని, వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపామని అధికారులు తెలిపారు. HYD, ఉమ్మడి RR పరిధిలోని పలు హోటళ్లలో బిర్యానీకి పాడైన, నిల్వ చేసిన చికెన్ వాడుతున్నారని అధికారులు గుర్తించారు. SHARE IT

News May 23, 2024

HYDలో ఎక్కడ చూసినా ఆహార కల్తీనే..!

image

HYDలో ఇన్ని రోజులు చిన్న హోటళ్లలో ఆహారకల్తీని అధికారులు గుర్తించగా ఇప్పుడు పెద్ద వాటిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం సోమాజిగూడ క్రుతుంగ రెస్టారెంట్, రెస్ట్ ఓ బార్, KFCలో నాసిరకం, పాడైన ఆహారపదార్థాలు గుర్తించామని, వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపామని అధికారులు తెలిపారు. HYD, ఉమ్మడి RR పరిధిలోని పలు హోటళ్లలో బిర్యానీకి పాడైన, నిల్వ చేసిన చికెన్ వాడుతున్నారని అధికారులు గుర్తించారు.
SHARE IT

News May 23, 2024

కరీంనగర్: రేపటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరంలో 10,073 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,907 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News May 23, 2024

పాలెంలో ఈనెల 24న విత్తన మేళా..!

image

నాగర్ కర్నూల్ జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24న విత్తనమేళా నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ సహాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ మల్లారెడ్డి బుధవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు పాల్గొని వివిధ పంటల సాగు పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించే సలహాలు సూచనలు పొందాలన్నారు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన రైతులు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.

News May 23, 2024

HYD: ఆ తల్లి ఆరుగురికి జీవం పోసింది

image

HYD నగరంలో ఓ తల్లి మరణించినా.. అవయవ దానం ద్వారా ఆరుగురికి ప్రాణం పోశారు. ఆలేరు మండలానికి చెందిన జంపాల సుజాత అపస్మారక స్థితిలో ఇటీవల కింద పడిపోయారు. వెంటనే ఆమెను HYD మేడిపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా, తాజాగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల అంగీకారంతో సుజాత గుండె, నేత్రాలు, కాలేయం తీసుకుని ఆరుగురికి అమర్చి, ప్రాణం పోసినట్లు జీవన్ దాన్ బృందం తెలిపింది.

News May 23, 2024

కడ్తాల్: ‘పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలి’

image

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి బుధవారం రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధి కోసం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు,వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలు సొంత నిధులతో నిర్మించామని వారు పేర్కొన్నారు. లక్ష్మీనరసింహారెడ్డి, చందర్ మధుసూదన్ రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.