India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో రైస్ మిల్లర్లతో 2023- 24 వానాకాలం, యాసంగి కస్టమ్ మిల్లింగ్ రైస్ పై సమీక్షించారు. 2023- 24 వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ ను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయపరిధిలో స్కిల్ కోర్స్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం తెలంగాణ యూనివర్సిటీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. అధికారిక వెబ్సైట్లో సమాచారం ఉందని వివరించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఏసీపీ ఉమామహేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహించి రూ. 3 కోట్ల ఆస్తులు, రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 40 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎస్సై నాగరాజును సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా గోపాలపూర్కు చెందిన మానసకు ఎస్సై నాగరాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని మంగళవారం కొమురవెల్లి PS ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. దీంతో ఈ ఘటనపై సిద్దిపేట సీపీ విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమవడంతో ఎస్సైని సస్పెండ్ చేశారు.
జిల్లాలోని తలమడుగు మండలం కోసాయి వద్ద గాలివాన కారణంగా చెట్లు రైలు పట్టాలపై పడిపోయాయి. దీంతో రాత్రి 7 గంటల వరకు ఆదిలాబాద్కు చేరుకోవాల్సిన ఇంటర్సిటీ రైలును మహారాష్ట్రలోని కిన్వట్ వద్ద నిలిపివేశారు. ఇదే రైలు ఆదిలాబాద్కు వచ్చి కృష్ణ ఎక్స్ప్రెస్గా 9 గంటలకు బయలుదేరాల్సి ఉంది. రైలు పట్టాలపై చెట్లు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు రైల్వేస్టేషన్లో పడిగాపులు కాస్తున్నారు.
రేవంత్ రెడ్డిది మాటల గారడీ ప్రభుత్వమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాము 30వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో ఎవరికీ తెలియదన్నారు. గాల్లో మాటలు చెప్పి కాగితాల మీద రాతలు చూపించి ప్రజలను మోసం చేయడం తప్ప నిరుద్యోగులకు చేసిందేమి లేదని ఆమె విమర్శించారు.
> WGL, HNK, NSPTలో MLC సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
> సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించిన పోలీసులు
> స్ట్రాంగ్ రూములను పరిశీలించిన HNK, WGL జిల్లాల కలెక్టర్లు
> జనగామలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం
> మేడిగడ్డను సందర్శించిన పూణే సైంటిస్ట్ బృందం
> WGL: రోడ్డు ప్రమాద బాధితున్ని ఆసుపత్రికి తరలించిన KTR
> జిల్లాలో 3 ప్రధాన పార్టీల విస్తృత ప్రచారం
> MGMను సందర్శించిన వరంగల్ జిల్లా కలెక్టర్
వివాహేతర సంబంధం వ్యవహారంలో కొమురవెల్లి ఎస్సై నాగరాజును సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళ్తే.. నాగరాజు వేరే మహిళలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో పాటు, నాగరాజు భార్య పీఎస్ ముందు మంగళవారం ధర్నా చేసినట్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. దీంతో ఈ ఘటనపై సిద్దిపేట సీపీ విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమవడంతో అతన్ని సస్పెండ్ చేశారు.
AP హైకోర్టు న్యాయమూర్తి పేరు చెప్పి మోసానికి పాల్పడుతున్న నిందితుడిని KPHB పోలీసులు అరెస్టు చేశారు. SI సుమన్ వివరాల ప్రకారం.. సందీప్ అనే వ్యక్తి KPHB పీఎస్ పరిధిలో దర్యాప్తులో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించి తాను న్యాయం చేస్తానంటూ బాధితుల నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఓ యాప్ ద్వారా న్యాయమూర్తిలాగ వాయిస్ మార్చి పోలీసులకు కాల్ చేశాడు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
AP హైకోర్టు న్యాయమూర్తి పేరు చెప్పి మోసానికి పాల్పడుతున్న నిందితుడిని KPHB పోలీసులు అరెస్టు చేశారు. SI సుమన్ వివరాల ప్రకారం.. సందీప్ అనే వ్యక్తి KPHB పీఎస్ పరిధిలో దర్యాప్తులో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించి తాను న్యాయం చేస్తానంటూ బాధితుల నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఓ యాప్ ద్వారా న్యాయమూర్తిలాగ వాయిస్ మార్చి పోలీసులకు కాల్ చేశాడు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.