Telangana

News May 22, 2024

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి మన HYDలో..!

image

నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో‌పై అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రతిపాదిత ఎల్బీనగర్ జంక్షన్ స్టేషన్, కూడలికి కుడి వైపు వస్తుందని, దీన్ని ప్రస్తుత ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు విశాలమైన స్కై వాక్‌తో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా స్కై వాక్‌‌లోనే సమతలంగా ఉండే వాకలేటర్ ( దీని పై నిల్చుంటే చాలు అదే తీసుకెళుతుంది) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

News May 22, 2024

OU: ఎంబీఏ (ఈవినింగ్) పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (ఈవినింగ్) కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈనెల 30లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో వచ్చే 6 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహిస్తామన్నారు.

News May 22, 2024

OU: ఎంబీఏ (ఈవినింగ్) పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (ఈవినింగ్) కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈనెల 30లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో వచ్చే 6 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహిస్తామన్నారు.

News May 22, 2024

విద్యార్థి సంఘాలతో ఓయూ కొత్త వీసీ MEETING

image

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఓయూ పరిపాలన భవనంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను విద్యార్థి నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

News May 22, 2024

గ్రేటర్ HYDలో నిలిచిన మోడల్ కారిడార్ల పనులు..!

image

గ్రేటర్ HYD నగరంలో మోడల్ కారిడార్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సౌకర్యవంతమైన రహదారులే లక్ష్యంగా GHMC ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఎల్బీనగర్, హబ్సిగూడ వంటి ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా కాలిబాట, సైకిల్ ట్రాక్, వీధి వ్యాపారులకు స్థలం, సర్వీసు రోడ్డు, మూడు లైన్ల ప్రధాన రహదారి, పచ్చదనంతో కూడిన విభాగిని ఉండేలా రూ.56.82 కోట్లతో 29 రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినా.. ఇప్పటి వరకు జరగలేదు.

News May 22, 2024

గ్రేటర్ HYDలో నిలిచిన మోడల్ కారిడార్ల పనులు..!

image

గ్రేటర్ HYD నగరంలో మోడల్ కారిడార్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సౌకర్యవంతమైన రహదారులే లక్ష్యంగా GHMC ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఎల్బీనగర్, హబ్సిగూడ వంటి ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా కాలిబాట, సైకిల్ ట్రాక్, వీధి వ్యాపారులకు స్థలం, సర్వీసు రోడ్డు, మూడు లైన్ల ప్రధాన రహదారి, పచ్చదనంతో కూడిన విభాగిని ఉండేలా రూ.56.82 కోట్లతో 29 రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినా.. ఇప్పటి వరకు జరగలేదు.

News May 22, 2024

REWIND: పాలమూరులో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజార్టీ సాధించింది. MBNR పార్లమెంట్ పరిధిలోని 7అసెంబ్లీ స్థానాల్లో, NGKL పరిధిలోని 5 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. BRS 2 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ ఖాతా తెరవలేదు. కాగా ప్రస్తుత ఓటింగ్ కలిసోస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే.. రాజకీయ సమీకరణాలు మారాయని BRS, BJP అంటున్నాయి. తుది ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. దీనిపై మీ కామెంట్

News May 22, 2024

ఓయూ కొత్త వీసీ MEETING

image

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఓయూ పరిపాలన భవనంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను విద్యార్థి నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

News May 22, 2024

ఓయూ కొత్త వీసీ MEETING

image

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఓయూ పరిపాలన భవనంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను విద్యార్థి నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

News May 22, 2024

KMR: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

KMR, BKNR రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్టు రైల్వే SI తావునాయక్ తెలిపారు. గుర్తుతెలియని రైలులో డోర్ వద్ద ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడన్నారు. మృతుడు 35 – 40 సం.ల మధ్య వయస్సు కలిగి తెల్లచొక్కా, నల్ల ప్యాంటు ధరించాడన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఎస్సై సూచించారు.