India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నగరం అపూర్వ కట్టడాలు, సంపదకు నెలవు. ఇక్కడి కట్టడాలపై చరిత్రకారులు రాసిన పుస్తకాలు అనేకం. పెద్దగా ప్యాచుర్యంలేని ఫతేమైదాన్ సమీపంలో ‘నౌబత్ పహాడ్’ గురించి తెలుసా? ఈ పేరు వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ‘నౌబత్’ అంటే డోలు, ‘పహాడ్’ అంటే గుట్ట. ప్రజలకు ఫర్మానాలు వినిపించడానికి ఈ కొండపైనే నగారాలు మోగించేవారు. డోలు కొడుతూ ఆజ్ఞలను వినిపించేవారు. అలా ఈ ప్రాంతానికి నౌబత్ పహాడ్ అనే పేరు వచ్చింది.

HYDలో ఎయిర్ క్వాలిటీ మరొకసారి తారస్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్క్వాలిటీ బుధవారం బడంగ్పేట్లో తెల్లవారుజామున 354కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటీస్, డస్ట్ అలర్జీ ఉన్నవారితో పాటు సామాన్యులు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతవారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఇవాళ భారీగా పెరిగింది.

రూ.30 వేల కోట్ల సేకరణపై HMDA దృష్టి సారించింది. రూ.20వేల కోట్లను బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. వీటితోపాటు HMDA పరిధిలోని భూములను వేలం వేసి మిగతా ఆదాయాన్ని సమకూర్చుకునేలా చూస్తున్నారు. నియోపోలిస్ వద్ద 70, బంజారాహిల్స్లో 8, కొండాపూర్ వద్ద 20 ఎకరాలు వేలానికి సిద్ధం చేశారు. వచ్చిన ఆదాయంతో HMDA పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

నల్గొండ మున్సిపాలిటీకి ఘనచరిత్రే ఉన్నది. నల్గొండను 1951లో 12 వార్డులతో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనాభా పెరగడం.. పట్టణం క్రమంగా విస్తరించడంతో 1987లో 24 వార్డులతో గ్రేడ్ 2గా.. 2005లో 36 వార్డులతో గ్రేడ్ 1గా అప్ గ్రేడ్ చేశారు. 2018లో గ్రేడ్ 1గా ఉన్న మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలో 2.5 లక్షల మేర జనాభా ఉన్నది.

జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో వరంగల్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ను 6 జిల్లాలుగా విభజించిందన్న విమర్శల నేపథ్యంలో, ప్రభుత్వం శాసనసభలో పునర్విభజన ప్రకటన చేయడం కొత్త చర్చకు దారితీసింది. వరంగల్-హనుమకొండ విలీనంపై స్పష్టత వస్తుందా? ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధులు ఎలా మారతాయి? అనే ఆసక్తి నెలకొంది. సరిహద్దులు మారకుండా చూసే అవకాశం ఉందో చూడాల్సి ఉంది.

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలులోకి రానుంది. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని బంకు యజమానులకు సూచించారు. ప్రాణ రక్షణ కోసం బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

HYD నుంచి ములుగు జిల్లాలో ఆసియాలోనే జరిగే అతిపెద్ద గిరిజనుల జాతరకు వెళ్లాలని ఉందా? ఉప్పల్ నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక బస్సులు ఉన్నాయి. ఉప్పల్- వరంగల్, హనుమకొండ అక్కడి నుంచి డైరెక్ట్గా మేడారం వెళ్లడానికి బస్సులు అందుబాటులో ఉన్నట్లు RTC అధికారులు తెలిపారు. వ్యక్తిగత వాహనాల్లో వెళ్తే WGL నుంచి పస్ర, అక్కడి నుంచి నార్లపూర్, మేడారం వెళ్లాలి. RTC బస్సులు గద్దెల సమీపానికి వెళ్తాయి.

సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య(23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే కళాశాలలో జనరల్ మెడిసిన్ చదువుతున్న HYD అల్వాల్కు చెందిన ప్రణయ్కి 2025 జులైలో లావణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి కులాన్ని అడ్డుగా చూపించి నిరాకరించాడు. దీంతో గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని లావణ్య సూసైడ్ చేసుకుంది. ప్రణయ్పై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

TGFD, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సింథటిక్, గాజు పూత ఉన్న మాంజాపై నిషేధం విధించింది. HYDలో స్పెషల్ డ్రైవ్ సాగుతోంది. ప్రజలకు మాంజా కనిపిస్తే వెంటనే 1800 4255364, 040- 23231440కు కాల్ చేయాలని కోరింది. మాంజా విక్రయిస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 51 ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు చేపడతామని HYD TGFD ట్వీట్ చేసింది.
# SHARE IT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మంలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, నాయకులను సమాయత్తం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతోంది. ఉదయం 10:30కు ఖమ్మం చేరుకుని రాపర్తినగర్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు కార్యకర్తలు, నాయకుల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం సర్పంచ్లకు సన్మానం, కార్యకర్తల సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.