Telangana

News May 22, 2024

ADB: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ తీవ్రత తగ్గడంలేదు. దీంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. కొండాపూర్(మంచిర్యాల) 43.4, ఆసిఫాబాద్ 43.2,  చాప్రాల(ఆదిలాబాద్) 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News May 22, 2024

గద్వాల: తల్లి, కుమార్తె సూసైడ్

image

కుటుంబ కలహాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. ఈ ఘటన గద్వాల జిల్లా మనవపాడు మండలం ఏ-బుడిదపాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నరసింహులు భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ (16) భూతగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో సాయంత్రం ఇంట్లో పురుగు మందు తాగినట్లు సమాచారం. వరలక్ష్మి, అనురాధ చికిత్స అందేలోపే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 22, 2024

సూర్యాపేట: భార్యతో గొడవ.. ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకుని సూసైడ్

image

భార్యతో గొడవ పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మోతె మండలం ఊర్లుగొండ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొమరయ్య, రమా భార్యాభర్తలు. మే 15న భర్తతో గొడవ జరగ్గా పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంలో గ్రామశివారులో ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకుని కొమరయ్య సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి భార్య రమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదవేంద్ర రెడ్డి తెలిపారు.

News May 22, 2024

కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్‌ఐ భార్య ఆందోళన

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి SI నాగరాజు తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని అతడి మొదటి భార్య మానస కొమురవెల్లి పీఎస్ ఎదుట తల్లి, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. కరీంనగర్‌ జిల్లా గోపాలపురానికి చెందిన మానసకు ఎస్‌ఐ నాగరాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని మంగళవారం PS ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.

News May 22, 2024

వెల్దండ: రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

image

పత్తి విత్తనాలు కొనుగోలు చేయడానికి వెళ్లి రోడ్డు <<13291577>>ప్రమాదంలో <<>>చిక్కుకున్న రైతుల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆటోలో మొత్తం 12 మంది రైతులు జడ్చర్ల వెళ్లి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి వెల్దండ మండలం పడమటి తండాకు పయనమయ్యారు. మంగళవారం రాత్రి వెల్దండ గేటు వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను అతి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఏడుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

News May 22, 2024

100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

image

భవిష్యత్తు 2029- 30 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని ఇల్లెందు క్లబ్‌లో రామగుండం, బెల్లంపల్లి రీజినల్ జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాల అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న కాలంలో కొత్త గనుల ఏర్పాటు, గనుల విస్తరణపై చర్చించారు.

News May 22, 2024

ఖమ్మం: మార్ఫింగ్ పోటోలతో యువతికి వేధింపులు

image

ఇన్‌స్టాలో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారంటూ ఓ డిగ్రీ విద్యార్థిని సీపీ సునీత్ దత్‌కు ఫిర్యాదు చేసింది. గతంలోనూ చాలా సార్లు వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.  ఇన్‌స్టాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరింది. 

News May 22, 2024

కొమురవెల్లి ఠాణా ఎదుట ఎస్‌ఐ భార్య ఆందోళన

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి SI నాగరాజు తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని, అతడి మొదటి భార్య మానస కొమురవెల్లి పీఎస్ ఎదుట తల్లి, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. కరీంనగర్‌ జిల్లా గోపాలపురానికి చెందిన మానసకు ఎస్‌ఐ నాగరాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని మంగళవారం PS ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.

News May 22, 2024

కామారెడ్డిలో అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

image

అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు కామారెడ్డి SP సింధూశర్మ తెలిపారు. మంగళవారం పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజస్థాన్‌కు చెందిన కుమావత్ బుందారం, లక్ష్మణ్ రామ్‌లను పట్టుకున్నారు. పట్టణంలో ఈ నెల 2వ తేదీన సిగరేట్ గోదాంలో వారు చోరీ చేసినట్లు గుర్తించారు. వారి వద్ద రూ.15.50 లక్షల నగదుతో పాటు ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. మరో నింధితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

News May 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} వివిధ శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} మణుగూరు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన