Telangana

News May 22, 2024

ఖమ్మం: మార్ఫింగ్ పోటోలతో యువతికి వేధింపులు

image

ఇన్‌స్టాలో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారంటూ ఓ డిగ్రీ విద్యార్థిని సీపీ సునీత్ దత్‌కు ఫిర్యాదు చేసింది. గతంలోనూ చాలా సార్లు వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.  ఇన్‌స్టాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరింది. 

News May 22, 2024

కొమురవెల్లి ఠాణా ఎదుట ఎస్‌ఐ భార్య ఆందోళన

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి SI నాగరాజు తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని, అతడి మొదటి భార్య మానస కొమురవెల్లి పీఎస్ ఎదుట తల్లి, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. కరీంనగర్‌ జిల్లా గోపాలపురానికి చెందిన మానసకు ఎస్‌ఐ నాగరాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని మంగళవారం PS ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.

News May 22, 2024

కామారెడ్డిలో అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

image

అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు కామారెడ్డి SP సింధూశర్మ తెలిపారు. మంగళవారం పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజస్థాన్‌కు చెందిన కుమావత్ బుందారం, లక్ష్మణ్ రామ్‌లను పట్టుకున్నారు. పట్టణంలో ఈ నెల 2వ తేదీన సిగరేట్ గోదాంలో వారు చోరీ చేసినట్లు గుర్తించారు. వారి వద్ద రూ.15.50 లక్షల నగదుతో పాటు ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. మరో నింధితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

News May 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} వివిధ శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} మణుగూరు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన

News May 22, 2024

కొత్తగూడెం: రోడ్డుప్రమాదాల్లో ముగ్గురి మృతి

image

వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనలు కొత్తగూడెం జిల్లాలో జరిగాయి. దమ్మపేట పట్వారిగూడెం కూడలి వద్ద లారీ, బైక్‌ను ఢీకొట్టడంతో కుంజా నాగేంద్రబాబు, సోయం నాగేంద్రబాబు అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు కొన్ని గంటలకు ముందు పట్వారిగూడెంలో బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో పదహారేళ్ల బాలుడు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

News May 22, 2024

జనగామ: భార్య గొంతుపై తొక్కి.. ప్రాణం తీసిన భర్త

image

భార్యను <<13285941>>హత్య <<>>చేసిన ఘటన HYD ఉప్పల్‌ పరిధిలో జరిగింది. CI కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగంపల్లికి చెందిన రమేశ్‌కు సిద్దిపేటకు చెందిన కమలతో వివాహమైంది. వీరు బ్యాంకు కాలనీలో ఉంటున్నారు. రమేశ్‌కు వివాహేతర సంబంధం ఉందనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కమలపై రమేశ్ దాడి చేసే క్రమంలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. అనంతరం ఉప్పల్‌ PSలో లొంగిపోయాడు.

News May 22, 2024

UPDATE: మెట్‌పల్లిలో మహిళ హత్య

image

మెట్‌పల్లిలో ఓ మహిళ <<13286254>>హత్య<<>>కు గురైన విషయం విదితమే. పోలీసుల కథనం ప్రకారం.. మెట్‌పల్లికి చెందిన సింగం మమత (38) తన భర్తకు విడాకులు ఇచ్చి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అబ్దుల్ అప్సర్‌తో మమతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి మధ్య సోమవారం గొడవ జరిగింది. కోపంతో అప్సర్‌ మమతను గొంతునులిమి, కత్తితో పొడవడంతో చనిపోయినట్లు SI చిరంజీవి పేర్కొన్నారు.

News May 22, 2024

గాంధీ హాస్పిటల్ డీప్ ఫేక్ వీడియో X నుంచి తొలగింపు

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ గాంధీ హాస్పిటల్ పై Xలో పోస్ట్ చేసిన డీప్ ఫేక్ వీడియోను BRS USA ఎక్స్ ఖాతా నిర్వాహకుడు హరీశ్ రెడ్డి తొలగించారు. తనకు తెలియక పొరపాటున పాత వీడియోను పోస్ట్ చేశానని, అపాలజీ చెబుతూ.. మరో వీడియో పెట్టారు. గాంధీ సూపరింటెండెంట్ ఫిర్యాదుతో హరీశ్ రెడ్డిపై చిలకలగూడ PSలో IT, IPC 505 క్లాజ్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు SHO అనుదీప్ తెలిపారు.

News May 22, 2024

గాంధీ హాస్పిటల్ డీప్ ఫేక్ వీడియో X నుంచి తొలగింపు

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ గాంధీ హాస్పిటల్ పై Xలో పోస్ట్ చేసిన డీప్ ఫేక్ వీడియోను BRS USA ఎక్స్ ఖాతా నిర్వాహకుడు హరీశ్ రెడ్డి తొలగించారు. తనకు తెలియక పొరపాటున పాత వీడియోను పోస్ట్ చేశానని, అపాలజీ చెబుతూ.. మరో వీడియో పెట్టారు. గాంధీ సూపరింటెండెంట్ ఫిర్యాదుతో హరీశ్ రెడ్డిపై చిలకలగూడ PSలో IT, IPC 505 క్లాజ్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు SHO అనుదీప్ తెలిపారు.

News May 22, 2024

మిర్యాలగూడ బస్టాండ్‌లో డ్రైవర్‌పై మహిళల దాడి

image

బస్ ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైవర్‌పై మహిళలు చేయి చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి MLG ఆర్టీసీ బస్టాండ్లో చోటు చేసుకుంది. DVK డిపోకు చెందిన బస్ అంగడిపేట వద్ద ఆపలేదు. దీంతో అక్కడున్న మహిళలు మరొక బస్సులో MLG బస్టాండ్‌కు చేరుకున్న ఆనంతరం ముందుగా వచ్చిన బస్సు డ్రైవర్‌ను బస్ ఎందుకు ఆపలేదని చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై డ్రైవర్, మహిళలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. అనంతరం రాజీకొచ్చారు.