Telangana

News May 7, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కారేపల్లిలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} నేలకొండపల్లి లో భూభారతీ పై అవగాహన కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} మధిర విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లి పట్టణ బంద్
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరా లో అంతరాయం

News May 7, 2025

ఖమ్మం జిల్లా వైపు.. MLC కల్వకుంట్ల కవిత చూపు?

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై MLC కల్వకుంట్ల కవిత ఫోకస్ పెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల 2రోజులు జిల్లాలో ఆమె పర్యటించి, నేతలకు.. కేసీఆర్‌కు మధ్య వారధిగా ఉంటానని భరోసానిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. నిజామాబాద్‌లో గ్రూపు తగాదాలతో ఆమె సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఖమ్మంను ఎంచుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.

News May 7, 2025

HYD‌లో ఎన్నిక.. BJP వైపు మళ్లిన ఒక్కరు!

image

HYD స్థానిక సంస్థల MLC కోటాలో ‘ఆ ఒక్క ఓటు’ ఆసక్తిని రేపుతోంది. 22 ఏళ్ల తర్వాత MIM మీద BJP పోటీ చేసింది. BRS పోలింగ్‌లో పాల్గొనలేదు. BJP 24, INC 14, MIM 50 మంది సభ్యులు ఓటేశారు. ఇందులో MIMకు 63 ఓట్లు పోలయ్యాయి. BJPకి 25 ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 24 మంది సభ్యుల సొంత ఓట్లకు అదనంగా మరో ఓటు పడింది. ఇంతకీ ఏ పార్టీ నుంచి మద్దతు వచ్చింది? BJPకి ఓటేసిన ఆ సభ్యుడు ఎవరు? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

News May 7, 2025

HYD‌లో ఎన్నిక.. BJP వైపు మళ్లిన ఒక్కరు!

image

HYD స్థానిక సంస్థల MLC కోటాలో ‘ఆ ఒక్క ఓటు’ ఆసక్తిని రేపుతోంది. 22 ఏళ్ల తర్వాత MIM మీద BJP పోటీ చేసింది. BRS పోలింగ్‌లో పాల్గొనలేదు. BJP 24, INC 14, MIM 50 మంది సభ్యులు ఓటేశారు. ఇందులో MIMకు 63 ఓట్లు పోలయ్యాయి. BJPకి 25 ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 24 మంది సభ్యుల సొంత ఓట్లకు అదనంగా మరో ఓటు పడింది. ఇంతకీ ఏ పార్టీ నుంచి మద్దతు వచ్చింది? BJPకి ఓటేసిన ఆ సభ్యుడు ఎవరు? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

News May 7, 2025

ఖమ్మం: రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని అనంతనగర్ గ్రామ శివారులో ఆగి ఉన్న టిప్పర్‌ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 7, 2025

ఏడుపాయల చెక్ డ్యాంలో మునిగి వ్యక్తి మృతి

image

ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సమీపంలో చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్‌కు చెందిన దేవరపాగ వీరస్వామి(40) శుక్రవారం ఓ విందు నిమిత్తం కుటుంబంతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు వెళ్లిన వీరస్వామి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతి చెందారు. దీంతో విందులో విషాదం నెలకొంది.

News May 7, 2025

ADB: ఇలా వెళ్తే కేసులు పెడతాం: DTO

image

ఆదిలాబాద్ లో శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రవాణా వాహనాలలో ప్రజలని పరిమితికి మించి తీసుకువెళ్తున్న 6 వాహనాలను సీజ్ చేశారు. ఈ క్రమంలో వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రజలకి అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. రవాణా అధికారి రవీందర్ మాట్లాడుతూ.. వాహన యజమానులు సరకు రవాణా వాహనాల్లో ప్రజలను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News May 7, 2025

MDK: సెలవుల్లో క్లాసులు నిర్వాహిస్తే చర్యలు: డీఈవో

image

మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ హెచ్చరించారు. ఈ విషయాన్ని అన్ని రకాల యజమాన్యాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు. జిల్లాలో జూన్ 11 వరకు అన్ని రకాల పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినట్లు వెల్లడించారు.

News May 7, 2025

బోధన్: డ్రంక్ అండ్ డ్రైవ్.. రెండు రోజుల జైలు

image

బోధన్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి బోధన్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనలను నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని ఎస్ఐ పేర్కొన్నారు.

News May 7, 2025

మోస్రా: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోస్రాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మోస్రాకు చెందిన కుమ్మరి గంగాధర్(45) రెండు రోజుల క్రితం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మహేశ్ కుమార్ చెప్పారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.