Telangana

News September 27, 2024

డబ్బుల మూటలు సదిరెందుకే కాంగ్రెస్ హైడ్రా డ్రామాలు: DK అరుణ

image

అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బుల మూటలు చక్కబెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ హైడ్రా డ్రామాలు ఆడుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పాలన చేతకాక అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు, హైడ్రా పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, HYD అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

News September 27, 2024

హనుమకొండ క్రీడాకారుడిని సన్మానించిన సీఎం

image

ఇటీవల యూరప్‌లో జరిగిన చెస్ ఒలంపియాడ్‌లో బంగారు పతకం సాధించిన హనుమకొండ జిల్లాకు చెందిన ఏరిగేసి అర్జున్ కుమార్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచారని క్రీడాకారులను ఉద్దేశించి సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 27, 2024

వరంగల్ పోలీస్ కమీషనరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపుజీ జయంతి వేడుకలు

image

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పరిపాలన భవనం ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News September 27, 2024

బెల్లంపల్లి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

image

బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి సింగరేణి పాఠశాల క్రీడా మైదానంలో బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించినట్లు రాష్ట్ర బాల్ బ్యాట్మెంటన్ జాయింట్ సెక్రటరీ తిరుపతి తెలిపారు. పోటీలలో సింగరేణి ఎస్ఓ టు జీఎం కె.రాజమల్లు పాల్గొని మాట్లాడుతూ..రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తే సింగరేణి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఆటలలో గెలుపు, ఓటములు సమానంగా తీసుకోవాలన్నారు.

News September 27, 2024

BREAKING: సంగారెడ్డి: గీతం యూనివర్సిటీలో విద్యార్థిని SUICIDE

image

ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ద్వితీయ సంవత్సరం చదువుతున్న వర్ష (19) అనే విద్యార్థిని హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించగా గమనించిన విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 27, 2024

ధర్మపురిలో వెరైటీ లక్కీ డ్రా

image

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నరసింహ ఆన్‌లైన్ సెంటర్ యజమాని దసరా పండుగను పురస్కరించుకుని వెరైటీ లక్కీ డ్రా ఏర్పాటు చేశాడు. రూ.50 చెల్లించి టోకెన్ తీసుకోవాలని, లక్కీ డ్రా అక్టోబర్ 12న ఉ.9 గంటలకు తీయనున్నట్లు తెలిపారు. ఇందులో మొదటి బహుమతి మేకపోతు, రెండవ బహుమతి కింగ్‌ఫిషర్ బీర్ కాటన్, మూడో బహుమతి కోడిపుంజు అని ఐదు బహుమతులు ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

News September 27, 2024

నిజామాబాద్ నగరంలో హీరో రామ్, హీరోయిన్ పాయల్ సందడి

image

నిజామాబాద్ నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరో రామ్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హాజరయ్యారు. దీంతో షాపింగ్ మాల్ ప్రాంగణం యువతి యువకులతో నిండిపోయింది. నటులతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. అంతకుముందు ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. మావూరి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

News September 27, 2024

HNK: ‘మహనీయులకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం’

image

బాపూజీ లాంటి మహనీయులకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఎంపీ కావ్య పాల్గొన్నారు. బాపూజీ లాంటి నాయకులు చేసిన పోరాటాల నుండి ప్రతీ ఒక్కరూ స్ఫూర్తి పొందాలని సూచించారు.

News September 27, 2024

కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మస్థలం వాంకిడి

image

తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. 1952లో ఆసిఫాబాద్ నుంచి ఎన్నికై హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. 1971 వరకు శాసనసభ్యుడిగా కొనసాగాడు. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలు.

News September 27, 2024

ఇసుక విధానం అమలుకు చర్యలు: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఇసుక వాహనం’ విధానం ద్వారా గృహ వినియోగ అవసరాల కోసం సరైన ధరలకు ఇసుక అందించేందుకు జిల్లాలో ఇసుక విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ ట్లు తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. గృహ అవసరాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లయితే ట్రాక్టర్ల ద్వారా ఇసుక పొందొచ్చని వివరించారు. ఆన్లైన్లో ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై తహశీల్దార్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.