India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో వైద్యం పేరిట వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతి లేని క్లినిక్స్, అర్హత లేకున్నా చికిత్స చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. RMPలు, ANMలు చేస్తున అబార్షన్లతో ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్నగర్, భూత్పూర్, మిడ్డిల్ మండలాల్లో ఈ మధ్య జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్యశాఖ చోద్యం చూస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2023 ఏప్రిల్ 19 నాటి నుంచి ఇప్పటి వరకు 30,049 ఫోన్లు రికవరీ చేసినట్టు అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4,869, సైబరాబాద్ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్ యూనిట్లు ఉన్నాయన్నారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2023 ఏప్రిల్ 19 నాటి నుంచి ఇప్పటి వరకు 30,049 ఫోన్లు రికవరీ చేసినట్టు అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4,869, సైబరాబాద్ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్ యూనిట్లు ఉన్నాయన్నారు.
ఉట్నూర్ మండలంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. తన వినూత్న ఆలోచనలతో పేద, బడుగు బలహీన వర్గాలను ఆదుకునేలా అనేక సంక్షేమ పథకాలతో దేశాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయనను కొనియాడారు.
HYD ఉప్పల్ పరిధి బ్యాంక్ కాలనీలో <<13285941>>భార్య కమలను భర్త రమేశ్ హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. మార్కెటింగ్ జాబ్ చేసే రమేశ్కు కమలతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా భార్యపై అనుమానం పెంచుకున్న రమేశ్ అర్ధరాత్రి ఆమెతో గొడవకు దిగాడు. మాటామాట పెరిగి ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి చంపేశాడు. తన భార్యను తానే చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
HYD ఉప్పల్ పరిధి బ్యాంక్ కాలనీలో <<13285941>>భార్య కమలను భర్త రమేశ్ హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. మార్కెటింగ్ జాబ్ చేసే రమేశ్కు కమలతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా భార్యపై అనుమానం పెంచుకున్న రమేశ్ అర్ధరాత్రి ఆమెతో గొడవకు దిగాడు. మాటామాట పెరిగి ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి చంపేశాడు. తన భార్యను తానే చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.19,200 ధర, ఏసీ తేజ మిర్చి రూ.20,000 ధర పలికింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి రూ.18, 000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,700 ధర వచ్చింది. టమాటా రకం మిర్చి ఏసీ క్వింటాకు రూ.30 వేల ధర పలికింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు భారీగా పెరిగాయి.
పట్టణ ప్రాంతాల్లో సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై ఈరోజు HYDలో వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సరస్సుల రక్షణ, పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆరోగ్యకరమైన సరస్సులు అనేక పర్యావరణ ప్రయోజనాలను అందించడమే కాకుండా, అవి మన జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు.
పట్టణ ప్రాంతాల్లో సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై ఈరోజు HYDలో వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సరస్సుల రక్షణ, పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆరోగ్యకరమైన సరస్సులు అనేక పర్యావరణ ప్రయోజనాలను అందించడమే కాకుండా, అవి మన జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. ఈ నెల 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని మొత్తం 18,288 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.