India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీరామ నవమిని పురస్కరించుకుని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం చికెన్, మటన్, చేపలు తదితర మాంసం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ మహేశ్వర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మున్సిపాలిటీ హెచ్చరికలను బేఖాతరు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. SHARE IT
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నుంచి నెల రోజుల పాటు 30 సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, ఉరేగింపులు నిర్వహించడం నిషేధించినట్లు చెప్పారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా డీజే సౌండ్లను వినియోగించడంపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
కోర్టులలో నేరస్తులకు సరైన సమయంలో సరైన శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్క కోర్టు డ్యూటీ అధికారి పని చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్లో కోర్టు డ్యూటీ అధికారులు, లైసెన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదైన సందర్భం నుంచి కేసు పూర్తి అయ్యేవరకు ప్రతి ఒక్క అంశాన్ని కోర్టు డ్యూటీ అధికారులు పరిశీలించాలన్నారు.
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా పాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ అన్నారు. ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం మహబూబ్నగర్లో ముగిశాయి. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా కల్పించిన చట్టబద్ధ హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. అధికార మదంతో మతపిచ్చి పట్టి మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు.
పోటీ పరీక్షలలో అభ్యర్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటి సాధన దిశగా పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్, ఖమ్మం బైసాస్ రోడ్డులోని జలగం వెంగళరావు తెలంగాణ బిసీ స్టడీ సర్కిల్ను సందర్శించి, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. అభ్యర్థులకు కలెక్టర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. నాందేడ్ జిల్లాకు చెందిన నాందేవ్ ఆనందరావు జిల్లాలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. గత నెల 5న మాక్లూర్ మండలం మాదాపూర్లో పరశు దేవానందం ఇంట్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
చిన్నచింతకుంట మండలం దామగ్నపూర్ గ్రామంలో సన్న బియ్యం పథకాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బోయ బుజ్జమ్మ నివాసంలో అదే సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని స్థానిక నాయకులు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి కలిసి సహా పంక్తి భోజనం చేశారు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో భూనిర్వాసితులైన 112 మందికి ఉద్యోగ నియమాక పత్రాలు జెన్కో అందజేసింది. కాగా భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జెన్కో, ప్రభుత్వానికి జాబితా పంపించారు. ఈ విషయమై 112 మందికి ఉద్యోగ నియమాక పత్రాలు అందజేశారు. సబ్ కలెక్టర్ వల్లనే తమకు ఉద్యోగాలు వచ్చాయని భూ నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తూ మిర్యాలగూడలో ఆయనను సన్మానించారు.
Sorry, no posts matched your criteria.