Telangana

News May 21, 2024

మెదక్ జిల్లాలో ముగ్గురి సూసైడ్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. మనోహరాబాద్‌కు చెందిన నాగరాజు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకోగా.. రాయపోల్‌కు చెందిన నర్సయ్య కడుపు నోప్పితో ఉరేసుకున్నాడు. ఇదే క్రమంలో కల్హేర్ మండలం నాగధర్‌కు చెందిన అశోక్ కుటుంబ కలహాలు, అనారోగ్యంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News May 21, 2024

MBNR: రైలు ఢీకొని యువకుడి మృతి

image

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన MBNR రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. HYDలోని చాంద్రాయణగుట్ట ఫుల్ బాగ్‌కు చెందిన షరీఫ్(17) MBNR సమీపంలోని వీరన్నపేటలో ఉన్న మేనమామ ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటుతుండగా.. తుంగభద్ర ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని మరణించాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News May 21, 2024

SRCL: వారికి తెలియకుండానే అకౌంట్‌లో డబ్బులు కొట్టేశారు!

image

వారికి తెలియకుండానే వారి ఖాతాలోని డబ్బులు మాయం చేశారు. ఈ ఘటన గంభీరావుపేటలో జరిగింది. గంభీరావుపేటకు చెందిన కోటయ్యగారి రాజేందర్‌రెడ్డి ఖాతా నుంచి ఈ నెల 15న రూ.45,000, 16 న దండ నరేశ్ ఖాతా నుంచి రూ.44,990, 17న లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఖాతా నుంచి రూ.50 వేలు, 18న కోటయ్యగారి లత ఖాతా నుంచి రూ.1.85లక్షలు కట్ అయ్యాయి. తమకు తెలియకుండా డబ్బులు పోయాయని బ్యాంకును సంప్రదించగా.. సైబర్ నేరగాళ్ల పనేనని తెలింది.

News May 21, 2024

NZB: మొదటి రోజు పరీక్షకు 92 మంది గైర్హాజరు

image

సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన టెట్ 2024 పరీక్షలు జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆర్మూర్ క్షత్రియ ఇంజినీరింగ్, NZB నాలెడ్స్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పరీక్షకు 170 మందికి 92 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 170 మందికి 156 మంది హాజరయినట్లు DEO దుర్గాప్రసాద్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21,585 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

News May 21, 2024

HYD: భర్తను వేధిస్తున్న భార్యపై కేసు నమోదు

image

భర్తను వేధిస్తూ టార్చర్ చేస్తున్న భార్యపై కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు.. APఅమలాపురం వాసి టెమూజియన్ కుముజకు రాజోలు వాసి లక్ష్మీగౌతమితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారు HYDఅల్వాల్‌లో వచ్చి ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు. భర్త మల్లారెడ్డి కాలేజీలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అత్తింటి ఆస్తుల కోసం ఆమె.. భర్త, అత్తమామలను వేధిస్తోంది. కత్తితో భర్తపై దాడి చేయగా కేసు నమోదైంది.

News May 21, 2024

HYD: భర్తను వేధిస్తున్న భార్యపై కేసు నమోదు

image

భర్తను వేధిస్తూ టార్చర్ చేస్తున్న భార్యపై కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు.. APఅమలాపురం వాసి టెమూజియన్ కుముజకు రాజోలు వాసి లక్ష్మీగౌతమితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారు HYDఅల్వాల్‌లో వచ్చి ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు. భర్త మల్లారెడ్డి కాలేజీలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అత్తింటి ఆస్తుల కోసం ఆమె.. భర్త, అత్తమామలను వేధిస్తోంది. కత్తితో భర్తపై దాడి చేయగా కేసు నమోదైంది.

News May 21, 2024

జనగామ: రోడ్డు ప్రమాదంలో తోబుట్టువులు మృతి

image

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బ్రదర్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరానికి చెందిన మేటీ రాములు- రాజేశ్వరి దంపతుల కుమారులు శ్రవణ్ (29), శివ (27) హైదరాబాద్‌లోని శుభకార్యానికి వెళ్లారు. వారు బైకుపై ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తున్న క్రమంలో యూటర్న్ తీసుకుంటుండగా.. ఇంతలో వేగంగా వచ్చిన బొలేరో వారి బైకును ఢీ కొంది. ఆ దీంతో బ్రదర్స్ అక్కడికక్కడే చనిపోయారు.

News May 21, 2024

నల్గొండ: అనుమానంతో భార్యను చంపాడు

image

భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాధడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందిన ఘటన తిప్పర్తి మండలం నూకలవారిగూడలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు తన భార్య జ్యోతిపై అనుమానం పెంచుకున్నాడు. జ్యోతి పొలంలో గేదెలు మేపుతుండగా అక్కడికి వెళ్లిన నాగరాజు కర్రతో దాడి చేయగా ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 21, 2024

MBNR: చెరువులో మహిళల మృతదేహాలు

image

కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం <<13279503>>చెరువులో <<>>మృతి చెందిన మహిళల వివరాలు తెలిశాయి. పోలీసుల వివరాలు ప్రకారం.. MBNR జిల్లా కోయిలకొండ మండలం అభంగపట్నంకు చెందిన జానకిగా గుర్తించారు. మరొకరు అరుణగా గుర్తించిన కుటుంబ సభ్యుల వివరాలుపై స్పష్టత రాలేదు. కర్నూలు బస్టాండు పరిసరాల్లో వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలను విచారించడంతో వీరి వివరాలు వెలుగు చూశాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

సిద్దిపేటలో గుర్తుతెలియని మృతదేహం

image

సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువులో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వ్యక్తి 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు, తెల్లటి షర్ట్, నలుపు రంగు పాయింట్ ధరించారని తెలిపారు.