India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలో అధిక వడ్డీ ఆశ చూపి ప్రత్యేక స్కీముల పేరిట పెట్టుబడులను స్వీకరించి స్కాములతో ప్రజలను మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సీపీ తరుణ్ జోషీ ప్రజలను హెచ్చరించారు. పలు సంస్థలలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు, తక్కువ సమయంలో భారీగా లాభాలు పొందవచ్చని మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దన్నారు.
HYD నగరంలో అధిక వడ్డీ ఆశ చూపి ప్రత్యేక స్కీముల పేరిట పెట్టుబడులను స్వీకరించి స్కాములతో ప్రజలను మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సీపీ తరుణ్ జోషీ ప్రజలను హెచ్చరించారు. పలు సంస్థలలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు, తక్కువ సమయంలో భారీగా లాభాలు పొందవచ్చని మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దన్నారు.
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మొత్తం 3,12,930 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పటివరకు 1,95,350 పాఠ్యపుస్తకాలు రాగా.. ఇంకా1,16,580 రావాల్సి ఉంది. పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై వరుస నెంబర్లను ముద్రించారు. వీటి ఆధారంగా ఆయా పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయనున్నారు.
వానాకాలం పంటల కోసం రైతులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి కొయ్యలకు నిప్పు పెడుతుండడంతో అటు పర్యావరణంతోపాటు, రాబోయే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. వరి కొయ్యలు కాల్చిన ప్రదేశంలో భూమి నీటిని కోల్పోయే గుణంతోపాటు , సేంద్రియ పదార్థాన్ని కోల్పోతుంది. ప్రత్యామ్నాయంగా జీలుగా, పల్లి పెసర వంటివి సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 8,45,213 మంది ఉన్నారు. ఇందులో పార్లమెంట్ ఎన్నికల్లో 6,22,420 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి పోలింగ్ 73.64 శాతంగా నమోదైంది. అలాగే పురుష ఓటర్లు 8,04,875 మంది ఓటర్లున్నారు. వీరిలో 5,99,108 మంది ఓటు వేశారు. వీరి పోలింగ్ శాతం 74.43గా నమోదైంది. 2,05,767 మంది పురుష ఓటర్లు ఓటు వేయలేదు. మహిళలే తక్కువ ఓటేశారు.
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి తుమికి వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు మే 23న భద్రాచలం గిరిజన గురుకుల స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ గ్రూపులలో మిగిలిన సీట్లభర్తీకై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరంలో 3, 5, 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ తెలిపారు. 3వ తరగతిలో బాలురకు 7, బాలికలకు 4, 5వ తరగతిలో బాలురకు 4, బాలికలకు 2, 8వ తరగతిలో బాలురకు 3, బాలికలకు 2 సీట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జూన్ 6లోగా ధృవీకరణ పత్రాలు గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సౌతెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ X వేదికగా ఓ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు TS బదులుగా TG జోడించినట్లు తెలిపింది.ఇక నుంచి TSSPDCL కాదు.. TGSPDCL అని పేర్కొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలకు చెందిన దాదాపు అన్ని సెక్షన్ల విద్యుత్ శాఖ అధికారులు X వేదికగా ప్రొఫైల్ ఫోటోను మార్చి ప్రజలకు తెలియజేశారు.
దినాలకొచ్చిన..ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన KMR జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లిలో జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణ్ (35)ఈ నెల13న మృతుడి భార్య సాగరిక తాత మరణించాడని అంత్యక్రియలకు వచ్చారు. అంత్యక్రియల అనంతరం మృతుడు శుక్రవారం కాటేపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో బయటకు వెళ్లి వస్తానని చెప్పి చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. SI కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
@ జగిత్యాల రూరల్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. @ సుల్తానాబాద్ మండలంలో విద్యుత్ షాక్ తగిలి 2 గేదెలు మృతి. @ కొడిమ్యాల మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ చిగురు మామిడి మండలంలో హైనా దాడిలో దూడ మృతి. @ దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దన్న వేములవాడ డీఎస్పీ. @ ధర్మపురిలో వైభవంగా కొనసాగుతున్న లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు.
Sorry, no posts matched your criteria.