India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్కూల్ కాలేజీలో ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే100కు కాల్ చేయాలని షీటీం ఏఎస్ఐ షరీఫ్ ప్రభాకర్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఓ పాఠశాలలో షీ టీంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆడ పిల్లలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఒకసారి కేసు బుక్ అయితే జీవితంలో అనేక అవకాశాలను కోల్పోతారని విద్యార్థులకు తెలిపారు.
ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని రాజాపూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ అన్నారు. రాజాపూర్ మండల కేంద్రంలో శనివారం జాతీయ రహదారి 44పై బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియమ నిబంధనను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. లైసెన్స్ లేని వారికి ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు ఇవ్వకూడదన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలో పలు గణేష్ మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం తమదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2029-30 వరకు రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ను ఉత్పత్తి చేస్తామని, విద్యుత్ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. గత పాలకుల లాగా రాష్ట్ర సంపదను దోపిడీ చేసేందుకు సిద్ధంగా లేమని, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్న వాళ్లకు చంప దెబ్బ కొట్టేలా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
> MHBD: రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
> MLG: మద్యం మత్తులో ఇద్దరు యువకుల వీరంగం
> WGL: గంజాయిని పట్టుకున్న పోలీసులు
> MHBD: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్ట్
> BHPL: నిజాంపల్లిలో కరెంట్ షాక్తో యువకుడు మృతి
> HNK: ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
> HNK: రీల్స్ చేస్తూ హై-టెన్షన్ వైరు తాకి గాయాల పాలైన యువకుడు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,90,723 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,71,772, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.57,700, అన్నదానం రూ.61,251 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పూజలందుకుంటున్న గణనాథులు.
@ తంగళ్లపల్లి మండలంలో పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య.
@ గోదావరిఖనిలో తేలుకాటుతో వ్యక్తి మృతి.
@ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో విష జ్వరంతో బాలిక మృతి.
@ అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న సిరిసిల్ల కలెక్టర్.
బస్సులో పోగొట్టుకున్న బంగారు నగలతో కూడిన బ్యాగును కనుక్కొని బాధితురాలికి మంచిర్యాల పోలీసులు అందజేశారు. సీఐ బన్సీలాల్ వివరాలు.. జగిత్యాల నుంచి ఇందారంలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి మంచిర్యాలకు వచ్చిన సానియా అనే మహిళ బస్సు దిగే సమయంలో బ్యాగ్ మర్చిపోయింది. దీంతో పోలీసులను సంప్రదించగా వెంటనే బ్లూ కోల్డ్ సిబ్బంది సీసీ కెమెరాలను పరీక్షించి రైల్వే స్టేషన్లో బ్యాగును గుర్తించి బాధితురాలికి అందజేశారు.
✓NIMS ఆస్పత్రిలో SEP 22 నుంచి 28 వరకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
✓ఖైరతాబాద్ గణేష్ వద్దకు తరలిన జనం
✓బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న రాష్ట్ర DGP
✓SEP 17న గ్రేటర్ HYD పరిధిలో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
✓బోడుప్పల్: వక్ఫ్ బాధితులను కలిసిన ఎంపీ DK అరుణ
✓KPHB: గణపతి నిమజ్జనంలో ముస్లిం సోదరుల డాన్స్.
నల్గొండ జిల్లాలో సోమవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా SP శరత్ చంద్ర పవార్ తెలిపారు. అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ CC TV కెమెరాలతో పాటు ప్రత్యేకంగా CC కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేశామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.