India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగర శివారు శంషాబాద్ మండలం నానాజీపూర్లో ఓ ఇంటి నిర్మాణ అనుమతుల కోసం రూ.35వేలు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ సెక్రెటరీ రాధిక ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో 111 జీవో పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శులు అందినకాడికి దోచుకుంటున్నారని ఇదే నిదర్శనమని జనం ఆరోపిస్తున్నారు. శంషాబాద్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో ఇదే అదునుగా అనుమతుల పేరుతో రాధిక అవినీతికి పాల్పడిందని ఏసీబీ అధికారులు తెలిపారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…
పలువురు విద్యార్థులకు ఒకేరోజు టెట్, డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 30న KUకి సంబంధించిన డిగ్రీ Bsc, BA అలాగే అదే రోజు టెట్ పరీక్ష ఉంది. దీంతో డిగ్రీ పరీక్ష రాయలా? టెట్ పరీక్ష రాయలా?, రెండు రాసేదెలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్ష రాస్తే డిగ్రీ సప్లిమెంటరీకి విద్యార్థులకు మరో సంవత్సరం ఆగాల్సి వస్తుంది. టైం టేబుల్ మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవులకు జూటా హామీలు..ఇదీ రేవంత్ పాలన అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇవాళ దేవరకొండకు హరీశ్రావు వెళ్లి రవీంద్ర కుమార్ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవరకొండలో హరీశ్ మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే సప్లమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డ్ మరో అవకాశాన్ని కల్పించింది. రూ.2000 అపరాధ రుసుంతో రేపటి వరకు ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఫీజు చెల్లించని విద్యార్థులు ఉంటే వారి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉమ్మడి జిల్లాలో ఇంటర్ అధికారులు పేర్కొంటున్నారు.
నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. గతంలో ఈ స్థానం నుంచి గెలవకపోవడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, , కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లన్న గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తద్వారా గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఓరియంటల్ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఉస్మానియా లాంగ్వేజ్ సర్టిఫికెట్ కోర్స్, ప్రీ డిగ్రీ కోర్స్, బీఏ లాంగ్వేజెస్, ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఓరియంటల్ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఉస్మానియా లాంగ్వేజ్ సర్టిఫికెట్ కోర్స్, ప్రీ డిగ్రీ కోర్స్, బీఏ లాంగ్వేజెస్, ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చన్నారు.
షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్నగర్ మండలం మధురాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. మల్లేష్, రమాదేవి దంపతుల కూతురు సాక్షిని ప్రమాదవశాత్తు మృతి చెందింది. తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. ఈ సమయంలో ఇంటి ముందున్న ప్రహరీ గోడకు ఉన్న గేటు దిమ్మెను పట్టుకోగా అది బాలిక తలపై పడటంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. అప్పటివరకు ఆడుతున్న చిన్నారి ఒక్కసారిగా కళ్లముందే విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి, కారోబార్లు ఇద్దరు ACBకి పట్టుబడ్డ ఘటన శంషాబాద్ మం. నానాజీపూర్ గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. HYDకు చెందిన బర్కత్ అలికి ఉన్న 500 గజాల స్థలంలో కాంపౌండ్ వాల్తో పాటు, చిన్న రూమ్ వేసుకోవడానికి గ్రామపంచాయతీ కార్యదర్శి రాధికను సంప్రదించగా.. రూ.65 వేలు లంచం అడిగింది. చివరిగా రూ.30 వేలు ఇవ్వాలంది. నగదు ఇస్తుండగా ACB అధికారులు పట్టుకున్నారు.
Sorry, no posts matched your criteria.