Telangana

News May 20, 2024

HYD: మరో అరగంటలో నగర వ్యాప్తంగా వర్షం!

image

HYD నగరంలోని ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, మలక్పేట, బేగంపేట, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, అమీర్పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో వర్షం కురుస్తుందని ’తెలంగాణ వెదర్ మెన్‘ తెలిపింది. మరో అరగంటలో నగరంలోని ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. GHMC అధికారులు సైతం ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.

News May 20, 2024

MBNR: సీఎం సొంత జిల్లాలో పంతం నెగ్గేనా .. !

image

ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఏ ఎన్నికల్లో లేనివిధంగా ఈసారి ఉమ్మడి జిల్లా పార్లమెంట్‌ స్థానాలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ ఫోకస్ పెట్టాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 14కు 12 MLAలను కాంగ్రెస్‌ గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందా.. సీఎం పంతం నెగ్గేనా..? అని జిల్లాలో చర్చ జోరందుకుంది.

News May 20, 2024

HYD: మరో అరగంటలో నగర వ్యాప్తంగా వర్షం!

image

HYD నగరంలోని ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, మలక్పేట, బేగంపేట, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, అమీర్పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో వర్షం కురుస్తుందని ’తెలంగాణ వెదర్ మెన్‘ తెలిపింది. మరో అరగంటలో నగరంలోని ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. GHMC అధికారులు సైతం ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.

News May 20, 2024

MBNR: “రుకమ్మపేట” ఈ పేరు విన్నారా!

image

మహబూబ్ నగర్ జిల్లా పాత పేరు పాలమూరు అని అందరికి తెలుసు. కానీ పూర్వం జిల్లా అసలు పేరు “రుకమ్మపేట” అవి పిలిచేవారు. పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది. 1890లో నిజాం రాజు మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్నగర్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఇదే పేరు కొనసాగుతోంది. రుకమ్మపేట, పాలమూరు, మహబుబ్ నగర్ వీటిలో మీకు ఏ పేరు నచ్చిందో కామెంట్ చేయండి.

News May 20, 2024

నల్గొండ: పట్టు దక్కేది ఎవరికో..

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…

News May 20, 2024

కూనవరం: ఊరేగింపులకు నో పర్మిషన్

image

ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవాలు జరపరాదని కూనవరం SI శ్రీనివాస్ సూచించారు. స్థానిక పోలీస్టేషన్లో సోమవారం పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయోద్దని, పెట్రోల్, డీజిల్ బాటిల్స్ అమ్మకాలు నిషేధం అన్నారు.

News May 20, 2024

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 20 మంది పై కేసు

image

నిజామాబాద్‌లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ సీఎస్ఐ చర్చ్ సమీపంలో వాహనాల తనిఖీలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 20 మంది పై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ వెల్లడించారు. సరైన పేపర్లు లేని వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News May 20, 2024

మెదక్: ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని దాదాపు అన్నిగ్రామాల్లో వర్షం కురవడంతో వ్యవసాయ పొలాల్లో రైతులు దుక్కులు దున్నే పనుల్లో బిజీగా కనిపించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజామున 33.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. ట్రాక్టర్లు,తాడేద్దులతో దుక్కిలు దున్నుతున్నారు.

News May 20, 2024

HYD: జూన్ 6 నుంచి నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ షిప్

image

47వ సీనియర్ నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ షిప్ జూన్ 6 నుంచి 8 వరకు HYD హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ ఛైర్మన్, స్టేట్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు వారు మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌లో 26 రాష్ట్రాల నుంచి దాదాపు 750 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు రానున్నారని తెలిపారు.

News May 20, 2024

HYD: జూన్ 6 నుంచి నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ షిప్

image

47వ సీనియర్ నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ షిప్ జూన్ 6 నుంచి 8 వరకు HYD హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ ఛైర్మన్, స్టేట్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు వారు మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌లో 26 రాష్ట్రాల నుంచి దాదాపు 750 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు రానున్నారని తెలిపారు.