Telangana

News May 20, 2024

ఖమ్మం- శ్రీకాకుళం సూపర్ లగ్జరీ సర్వీసు ప్రారంభం

image

ఖమ్మం-శ్రీకాకుళం మధ్య సూపర్ లగ్జరీ సర్వీసులు ప్రారంభించినట్లు DM యు.రాజ్యలక్ష్మి తెలిపారు. 9937 సర్వీస్ నెంబర్ గల బస్సు ఖమ్మంలో 6:15 బయలుదేరుతుందన్నారు. 9938 సర్వీస్ నెంబర్ గల బస్సు శ్రీకాకుళంలో 4:00 స్టార్ట్ అవుతుందని చెప్పారు. మరిన్ని వివరాలకు 99592 25990 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News May 20, 2024

KNR: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన HYD దోమలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బెజ్జంకి మండలం తోటపల్లె గ్రామానికి చెందిన అజయ్(26) బోయిన్‌పల్లి అంజయ్యనగర్‌లో ఉంటూ శ్రీకర ఆసుపత్రిలో అనస్థీషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాణిగంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న అజయ్ బైక్‌ను సరకు రవాణా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది.

News May 20, 2024

HYD: జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ

image

ఆస్తమా, ఉబ్బసం రోగుల కోసం ఏటా HYD ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈసారి జూన్ 8 నుంచి ప్రారంభమవనుందని బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8న ప్రవేశిస్తుందని,ఆ రోజు నుంచే ప్రసాదం పంపిణీ మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, అధికారులు సహకరించాలని, త్వరలో ఈ విషయమై సీఎంను కలవనున్నట్లు తెలిపారు.

News May 20, 2024

వరంగల్: నేటి పత్తి ధర వివరాలు

image

2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు పునః ప్రారంభం కాగా మార్కెట్ కు పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే ఈరోజు పెరిగింది. గతవారం రూ.6700 పలికిన పత్తి ధర.. ఈరోజు రూ.7040కి పెరిగింది. ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆశిస్తున్నారు.

News May 20, 2024

HYD: జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ 

image

ఆస్తమా, ఉబ్బసం రోగుల కోసం ఏటా HYD ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈసారి జూన్ 8 నుంచి ప్రారంభమవనుందని బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8న ప్రవేశిస్తుందని,ఆ రోజు నుంచే ప్రసాదం పంపిణీ మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, అధికారులు సహకరించాలని, త్వరలో ఈ విషయమై సీఎంను కలవనున్నట్లు తెలిపారు.

News May 20, 2024

పంట భీమా పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు

image

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంట భీమా పథకం అమలుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 5.79 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తుండగా ప్రతి ఏడాది ఏదో విధంగా పంటలు నష్టపోతున్నారు. ఈ సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పంట భీమా పథకం అమలు చేస్తోంది.

News May 20, 2024

గృహజ్యోతిపై భానుడి ప్రభావం

image

భానుడి ప్రభావం గృహజ్యోతి వినియోగదారులపై పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4,82,283 మంది ఉచిత కరెంట్ లబ్ధిదారులు ఉండగా ఏప్రిల్ నెలలో తీసిన లెక్కల ప్రకారం 4,73,314కి పడిపోయారు. ఒక్క నెలలోనే 8,969 మంది ఫథకాన్ని కోల్పోయారు. మేలో 4,60,864 మంది లబ్ధిదారులు మాత్రమే అర్హులయ్యారు. ఈ మూడు నెలల్లోనే 21,419 మంది పథకానికి దూరమయ్యారు. వాతవరణం చల్లబడడంతో ఈ నెలలో విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంది.

News May 20, 2024

మేడారం: రెండు రోజులు సమ్మక్క- సారాలమ్మ దర్శనాలు నిలిపివేత

image

తమ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేయనున్నారు. ఆదివారం గద్దెల వద్ద పూజారులు, వాటాదారులు సమావేశం నిర్వహించారు. వరంగల్‌లో తమకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే 2రోజులు దర్శనాల నిలిపివేతకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

News May 20, 2024

కొండగట్టు: పెద్ద జయంతి స్పెషల్.. చేయాల్సిన పనులు ఇవి!

image

ఈనెల 29 నుంచి పెద్దహనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేడుకలకు ఆలయ పరిసరాల్లో చేయాల్సిన పనులు.
– కొండపైన పుష్కరిణిలో నీటిని తొలగించి కొత్త నీటిని నింపాలి.
– మెట్లపక్కన జల్లు స్నానాల కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
-ఘాటురోడ్, బొజ్జపోతన్న సమీపంలో రహదారులకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి.
-కాలినడకన వచ్చే భక్తుల కోసం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి
-పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేయాల్సి ఉంటుంది.

News May 20, 2024

MDK: గ్రామాల్లో పడకేసిన పాలన.. ఆగిన పారిశుద్ధ్య పనులు

image

పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛతలో అలరారిన గ్రామాలు కళావిహీనంగా మారుతున్నాయి. కొన్ని నెలలుగా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లె పాలన పడకేసింది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా జరగడం లేదు. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్‌ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు కలిపి మొత్తం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1615 జీపీలు ఉన్నాయి. డ్రైనేజీలు, డంపింగ్‌ యార్డులు కంపు కొడుతుండగా మొక్కలు ఎండుతున్నాయి.