Telangana

News May 20, 2024

ఖమ్మం: ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని విద్యార్థిని సూసైడ్

image

ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఆదివారం జరిగింది. సీఐ శ్రీహరి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లగాని మేఘన(19) ఇంటర్ చదివింది. హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా శనివారం విడుదలైన ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదని మనస్తాపంలో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది.

News May 20, 2024

MBNR: గార్గేయపురం చెరువులో మహిళల మృతదేహాలు

image

కర్నూల్ మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు ఆదివారం వెలుగు చూశాయి. పోలీసుల వివరాలు ప్రకారం.. చెరువులో మృతదేహాలు ఉన్నాయని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని ముగ్గురు మహిళలను బయటకు తీశారు. ముందు హిజ్రాలుగా భావించినా, తర్వాత మృతులు మహిళలుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు MBNRకు చెందినవారుగా గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం మూడు పోలీసుల బృందాలను నియమించారు.

News May 20, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.1.41 కోట్లు కేటాయింపు

image

కేజీబీవీలకు సంబంధించి గత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలకు గాను నిధులు విడుదల చేస్తూ తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్షణ నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. ఛార్జీల విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రత్యేకాధికారులకు కాస్త ఉపశమనం లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీలకు రూ.1.41 కోట్లు కేటాయించారు. తాజాగా నిధులు విడుదల కావడంతో బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమమైందని ఎస్‌వోలు పేర్కొన్నారు.

News May 20, 2024

NLG: గూడ్స్ వాహన డ్రైవర్ దారుణహత్య

image

గూడ్స్ వాహన డ్రైవర్ దారుణహత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం చెట్టవారిగూడేనికి చెందిన రాజవర్ధన్(35) శనివారం గూడ్స్ వాహనం లోడుతో VJD నుంచి HYDకు వెళ్లాడు. HYDలో సామాను దింపి రాత్రి VJDకు బయల్దేరాడు. మార్గం మధ్యలో ఎరసానిగూడెం స్టేజీ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాజవర్ధన్‌ను అడ్డగించి హత్య చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసినట్లు ఎస్ఐ ఎన్.శ్రీను తెలిపారు

News May 20, 2024

కరీంనగర్: కొత్త రేషన్ కార్డులపై ఆశలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా1947 రేషన్ షాపులు ఉండగా 9,80,261 ఆహారభద్రత కార్డులు ఉండగా 28,24,897 మంది కుటుంబ సభ్యులు రాయితీతో కూడిన లబ్ధి పొందుతున్నారు.

News May 20, 2024

HYD: ఏప్రిల్ 24న పెళ్లి.. ఇంతలోనే విషాదం

image

పెళ్లయిన 25 రోజుల్లోనే నవ వధువు మృతిచెందిన ఘటన HYD తార్నాకలోని లాలాగూడ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట్ ఆర్యనగర్‌ వాసి మౌనిక(26)కు చిలుకానగర్ వాసి రమేశ్‌కు ఏప్రిల్ 24న పెళ్లయ్యింది. శనివారం పుట్టింటికి భర్తతో కలిసి మౌనిక వచ్చింది. రాత్రి భర్త వెళ్లిపోగా ఆమె అక్కడే ఉంది. ఆదివారం స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లిన మౌనిక బోర్ మోటార్ ఆన్ చేయగా కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది.

News May 20, 2024

సంగారెడ్డి: విద్యుద్ఘాతంతో మహిళ మృతి

image

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో విద్యుద్ఘాతంతో ఏర్పడే మ్యాతరి మంగమ్మ అనే మహిళ మృతి చెందింది. మ్యాతరి మంగమ్మ ఇంట్లో ఉండగా విద్యుత్ షాక్ తగిలింది. దాంతో మంగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 20, 2024

HYD: ఏప్రిల్ 24న పెళ్లి.. ఇంతలోనే విషాదం

image

పెళ్లయిన 25 రోజుల్లోనే నవ వధువు మృతిచెందిన ఘటన HYD తార్నాకలోని లాలాగూడ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట్ ఆర్యనగర్‌ వాసి మౌనిక(26)కు చిలుకానగర్ వాసి రమేశ్‌కు ఏప్రిల్ 24న పెళ్లయ్యింది. శనివారం పుట్టింటికి భర్తతో కలిసి మౌనిక వచ్చింది. రాత్రి భర్త వెళ్లిపోగా ఆమె అక్కడే ఉంది. ఆదివారం స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లిన మౌనిక బోర్ మోటార్ ఆన్ చేయగా కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది.

News May 20, 2024

WGL: ఆస్తి కోసం తాతను చంపిన మనవళ్లు!

image

ఆస్తి తగాదాల్లో తాతను మనవళ్లు హత్యచేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో జరిగింది. హసన్‌పర్తికి చెందిన జల్లి సారయ్య (80)తో అతని మనవళ్లు సాయికృష్ణ, శశికుమార్ పలుమార్లు ఆస్తి విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే వారిద్దరు సారయ్యపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వాకింగ్ స్టాండ్‌తో సారయ్య తలపై బలంగా కొట్టగా.. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 20, 2024

ఇచ్చోడలో భార్యను చంపిన భర్త

image

భార్యని భర్త హత్య చేసిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. ఇంద్రవెల్లి మండలం సత్వాజీగూడకు చెందిన రేణుక(28)కు, ఇచ్చోడ మండలం గాంధీనగర్‌కు చెందిన వెంకట్‌తో 2015లో వివాహమైంది. మద్యానికి బానిసైన వెంకట్ డబ్బుల కోసం శనివారం భార్యతో గొడవ పడ్డాడు. ఆమె నిరాకరించడంతో మద్యం మత్తులో ఆమె మెడకు తాడు బిగించి హత్య చేసి పరారైనట్లు CI భీమేశ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.