Telangana

News May 20, 2024

బడి తెరిచిన వెంటనే బుక్స్ ఇవ్వాలని..

image

పాఠశాలలు తెరిచిలోగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు 6,84,274 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటికే 2 లక్షల వరకు సిద్ధమయ్యాయి. మిగతావి కూడా త్వరలో వస్తాయని అధికారులు చెబుతున్నారు. బడి తెరిచిన మొదటి రోజే వాటిని విద్యార్థులకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు.

News May 20, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

image

వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో నాట్య గురువు అంజలి శిష్య బృందం ఆధ్వర్యంలో ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తాండవ నృత్యకారి, మూషికవాహన, రుక్మిణి ప్రవేశం, బ్రహ్మంజలి, పలుకే బంగారమాయేనా, పుష్పాంజలి, అలివేలు మంగ, కులుకగ నడవరో, నమశ్సివాయతే, గోవర్థన గిరిధర, జతిస్వరం, కృష్ణ శబ్దం, గోవిందా గోవిందా తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.

News May 20, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

image

వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో నాట్య గురువు అంజలి శిష్య బృందం ఆధ్వర్యంలో ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తాండవ నృత్యకారి, మూషికవాహన, రుక్మిణి ప్రవేశం, బ్రహ్మంజలి, పలుకే బంగారమాయేనా, పుష్పాంజలి, అలివేలు మంగ, కులుకగ నడవరో, నమశ్సివాయతే, గోవర్థన గిరిధర, జతిస్వరం, కృష్ణ శబ్దం, గోవిందా గోవిందా తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.

News May 20, 2024

NZB: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం

image

లోక్‌సభ ఎన్నికలు పూర్తవ్వడంతో సర్పంచ్ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1056 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలు NZB- 530 (5300 వార్డులు) ఉండగా.. KMR-526 (4,642 వార్డులు) గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

News May 20, 2024

NLG: నేటి నుంచి టెట్ పరీక్షలు

image

టెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ టెట్ పరీక్షలు ఈనెల 20న ప్రారంభమై జూన్ 2 వరకు కొనసాగుతాయి. వివిధ తేదీల్లో రకరకాల సబ్జెక్టులకు సంబంధించి టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో ఆన్లైన్ పరీక్షకు నల్గొండలోని ఎస్పీఆర్ పాఠశాల ప్రాంగణంలో సెంటర్ ఉంది. ఇక్కడ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఒక్కో సెషన్కు సుమారుగా 180 మంది వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

News May 20, 2024

REWIND: ఓడిపోయిన రఘునందన్ రావు!

image

అసెంబ్లీ ఎన్నికలు BJP అభ్యర్థి రఘునందన్‌రావుకు కలిసి రావడం లేదనే చర్చ స్థానికంగా నడుస్తోంది. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోగా 2020 ఉప ఎన్నికల్లో మాత్రం గెలిచారు. 2023లో 44,366 ఓట్లు ఆయనకు పోలయ్యాయి. కాగా మెదక్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావు ఈసారి తప్పకుండా గెలుస్తారని BJP శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండగా ఆయన గెలుస్తారో లేదో వేచి చూడాలి.

News May 20, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిలు

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిలను నియమించింది. DVKకు మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పార్టీ కార్మిక విభాగం నాయకుడు రాంబాబు యాదవ్ , MLGకు భాస్కర్ రావు, రాజీవ్ సాగర్, మునుగోడుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాకేశ్ కుమార్, సాగర్‌కు నోముల భగత్, NKLకు చిరుమర్తి లింగయ్య, NLGకు కంచర్ల భూపాల్ రెడ్డిలను నియమించింది.

News May 20, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔MBNR,GDWL,NRPT జిల్లాలో పలు ప్రాంతాల్లో నేడు కరెంట్ కట్
✔సర్వం సిద్ధం.. నేటి నుంచి టెట్ పరీక్షలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక ఎమ్మెల్యేలు
✔కొనసాగుతున్న వేసవి క్రీడా శిక్షణ
✔తాడూరు: నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ వేడుకలు
✔GDWL: నేడు లాటరీ పద్ధతిన పోస్టులు ఎంపిక
✔కల్తీ విత్తనాలపై అధికారుల ఫోకస్

News May 20, 2024

WGL: నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఈ పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించగా ఈసారి ఆన్లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు. డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు సైతం పరీక్ష రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,949 మంది హాజరుకానున్నారు.

News May 20, 2024

MBNR: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం

image

లోక్‌సభ ఎన్నికలు పూర్తవ్వడంతో సర్పంచ్ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 1,719 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ లోపే వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలు MBNR-468 ఉండగా.. NGKL-461, GDWL-255, NRPT-280, WNP- 255 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.