India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని నల్గొండ పమర్రి గూడ బైపాస్ వద్ద గల బుద్ధ గార్డెన్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కాకతీయ సామ్రాజ్యమైన ఓరుగల్లు కోటను శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు తిలకించారు. కళాఖండాలను, వాటి చరిత్రను పర్యాటకశాఖ గైడ్ రవి యాదవ్ వారికి వివరించారు. కళా తోరణాల మధ్యలో ఉన్న శిల్పకళా సంపదను చూసి అద్భుతం అని కొనియాడారు. కుష్మహల్, ఏకశిల కొండ, స్వయంభు దేవాలయం, శృంగారపు బావి, అనంతరం సౌండ్ అండ్ లైట్షో తిలకించారు.
తాంసి మండలం పొన్నారికి చెందిన అశిలీ పోచన్న అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోచన్న ఆదిలాబాద్ రైతు బజారులో కూరగాయాలు విక్రయిస్తుంటాడు. శుక్రవారం బల్బు వెలుగకపోవడంతో దాన్ని సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో కౌలు రైతు కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను వరంగల్ జిల్లాలోని MPDO ఆఫీసులలో ఇవ్వాలి. SHARE
నాగార్జునసాగర్లోని హిల్స్ కాలనీలో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాలు.. భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే అంతమొందించాడు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర, బెజవాడ బ్రహ్మం మామా అల్లుళ్లు. వీరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది. దీంతో అతడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దయింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం రేపు ఉదయం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారి కళ్యాణంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నేడు భద్రాద్రికి రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయినట్లు ఓ ప్రకటన జారీ అయ్యింది.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బియ్యం మేమిస్తున్నామంటే మేమిస్తున్నామని ఓరుగల్లు BJP, కాంగ్రెస్ నాయకుల మధ్య వార్ నెలకొంది. కేంద్రం 5KGలు, రాష్ట్ర ప్రభుత్వం 1KG మాత్రమే ఇస్తుందని BJPనేతలు అంటుంటే.. మొత్తం రాష్ట్రప్రభుత్వమే భరిస్తోందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని BJP నాయకులు ప్రశ్నిస్తున్నారు.
నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను కరీంనగర్ జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్లో ఇవ్వాలి. SHARE
జిల్లా వ్యాప్తంగా గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దాబాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదన్నారు. శుక్రవారం ADBలోని AR హెడ్ క్వార్టర్స్లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులున్నారు.
పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాలని వేధించిన వ్యక్తిపై మెదక్ రూరల్ PSలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. మెదక్ మండలానికి చెందిన విద్యార్థిని మక్తభూపతి పూర్ పాఠశాలలో పదో తరగతి చివరి పరీక్ష రాసి స్వగ్రామానికి వెళ్తోంది. ఈ క్రమంలో ఖాజిపల్లికి చెందిన అనిల్ కుమార్ తనను ప్రేమించాలంటూ వేధించాడు. అమ్మాయి తల్లి దండ్రులకు తెలపగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.