India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరం సికింద్రాబాద్ మనోవికాస్ నగర్ NIEPID కేంద్ర విద్యా సంస్థ మేధో వైకల్యం ఉన్నవారి నుంచి డిప్లమా కోర్సులు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. SSC, ఇంటర్మీడియట్ చేసిన వారు అర్హులు కాగా.. డిప్లమా స్పెషల్ ఎడ్యుకేషన్, రిహాబిలిటేషన్ సంబంధించిన కోర్సులు ఉన్నాయి. కేంద్రం స్కాలర్షిప్ సైతం అందిస్తుంది. హాస్టల్ ఫెసిలిటీ సైతం ఉంది. మిగతా వివరాల కోసం18005726422 సంప్రదించండి.
మెగా ఫుడ్ పార్క్ ఖమ్మంలోని బుగ్గపాడులో వచ్చే నెలలో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ముడి వనరులు పుష్కలంగా లభించడం. ఇప్పటికే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో 203 ఎకరాల్లో జామ, మామిడి, జీడిమామిడి, కొబ్బరి, ఆయిల్పామ్, సపోటా, నిమ్మ, మొక్కజొన్న పంటలను సాగు చేసేలా రైతుల్ని అధికారులు ప్రోత్సహించారు. అంతేగాక ఫుడ్పార్క్కు రవాణా సదుపాయాలు చేరువుగా ఉండడం.
కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేశ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని సిర్పూర్ టి మార్చురీకి తరలించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా సోలిపూర్లో 41.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 36.5 మి.మీ, గద్వాల జిల్లా సాటేర్లలో 29.5 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో 22.0 మి.మీ, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయంలో రుసుము రూ.400 నుంచి 1000 పెంచగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులో సైతం సొంత జిల్లాలో కాకుండా దూరపు ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుకు రూ.1000 తీసుకొని దూరపు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మద్యం మత్తులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన లారీ డ్రైవర్ శనివారం సరుకులు దింపి తిరిగి వెళుతున్న క్రమంలో సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తాలో లారీ అదుపు తప్పింది. చౌరస్తాలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంకు వద్ద ఫౌంటేన్లోకి లారీని ఎక్కించాడు. పోలీసులు డ్రైవర్పై కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్ సమీపాన ఉన్న ఓ రెస్టారెంట్లో HYD బిర్యానీ రుచి చూసిన SRH క్రికెటర్ ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఉందని తెలియజేశారు. అంతేగాక తన భార్య జెస్సికాకు మొదటిసారిగా HYD బిర్యానీ రుచి చూపించినట్లుగా తెలుపుతూ.. HYD బిర్యానీ ఫర్ మై లవ్ అంటూ X వేదికగా ట్వీట్ చేశారు. కాగా నేడు SRH VS పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాదులో జరగనుంది.
HYD నగర పరిధి బంజారాహిల్స్ సమీపాన ఉన్న ఓ రెస్టారెంట్లో HYD బిర్యానీ రుచి చూసిన SRH క్రికెటర్ ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఉందని తెలియజేశారు. అంతేగాక తన భార్య జెస్సికాకు మొదటిసారిగా HYD బిర్యానీ రుచి చూపించినట్లుగా తెలుపుతూ.. HYD బిర్యానీ ఫర్ మై లవ్ అంటూ X వేదికగా ట్వీట్ చేశారు. కాగా నేడు SRH VS పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాదులో జరగనుంది.
నగరానికి చెందిన గంగస్థాన్లో నివాసం ఉంటున్న వినీత్, దీపికలకు చెందిన కూతురు స్నీటిక కరెంట్ షాక్తో మృతి చెందిన ఘటన కుటుంబంలో విషాదం మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. స్నీటిక వేసవి సెలవుల నిమిత్తం తన బంధువుల ఇంటికి వెళ్ళింది. అయితే అక్కడ తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కూలర్ను తాకడంతో కరెంట్ షాక్తో అక్కడికక్కడే చిన్నారి మృతి చెందింది.
తెలంగాణ రాష్ట్ర సౌతెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ X వేదికగా ఓ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు TS బదులుగా TG జోడించినట్లు తెలిపింది.ఇక నుంచి TSSPDCL కాదు..TGSPDCL అని పేర్కొంది. HYD,RR, VKB,MDCL మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన దాదాపు అన్ని సెక్షన్ల విద్యుత్ శాఖ అధికారులు X వేదికగా ప్రొఫైల్ ఫోటోను మార్చి ప్రజలకు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.