India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాదాద్రి ఆలయంలో నిత్య కళ్యాణం, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో భాస్కరరావు ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలో జూన్ 1 నుంచి నియమాలు కచ్చితంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్, చీర, లంగా వోణి వంటి దుస్తులు ధరించాలని చెప్పారు.
గ్రేటర్ HYD పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73,969 కుక్కలకు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 94,500 కుక్కలకు రాబిస్ టీకాలు వేసినట్లుగా అధికారులు తెలియజేశారు. కుక్కల నియంత్రణ కోసం ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కుక్కల బెడద ఉన్న ప్రతి ప్రాంతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, గత నెల రోజుల్లో 1,000 కుక్కలకు పైగా వ్యాక్సినేషన్ అందించినట్లు తెలిపారు.
గ్రేటర్ HYD పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73,969 కుక్కలకు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 94,500 కుక్కలకు రాబిస్ టీకాలు వేసినట్లుగా అధికారులు తెలియజేశారు. కుక్కల నియంత్రణ కోసం ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కుక్కల బెడద ఉన్న ప్రతి ప్రాంతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, గత నెల రోజుల్లో 1,000 కుక్కలకు పైగా వ్యాక్సినేషన్ అందించినట్లు తెలిపారు.
మనస్తాపం చెందిన ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లి మృతదేహంగా లభ్యమైంది. కొల్చారం ఎస్ఐ మహ్మద్గౌస్ తెలిపిన వివరాలు.. మెదక్ పట్టణం నవాబుపేటకు చెందిన మల్లయ్య, రాజమ్మ దంపతులకు ఒక్క కుమార్తె సుజాతను రాజయ్య అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈనెల 16న తల్లి రాజమ్మ, సుజాతలకు గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంజీరా నదిలో శవం లభ్యమైంది. భర్త రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదైందని ఎస్సై తెలిపారు.
మేడ్చల్ జిల్లా కొంపల్లి పరిధిలో భారతి బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన శివరామకృష్ణ, నాగరాజు, నరసింహరావును పోలీసులు అరెస్టు చేశారు. వీరు అమాయక ప్రజల నుంచి రూ.60 కోట్ల డబ్బు వసూలు చేసి మోసం చేయటంతో సైబరాబాద్ పోలీసులు రిమాండ్ చేసినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
హీరో జూనియర్ NTRను కలవాలనే కోరికతో ఓ అభిమాని పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్కు వచ్చాడు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు చెప్పుల్లేకుండా 300 కిలోమీటర్లు నడిచాడు. తనను చూసేందుకు ఎంతో శ్రమించి ఇంటికి వచ్చిన నాగేంద్రను కలిసిన ఎన్టీఆర్ అతడితో ఫొటో దిగాడు. అభిమాన హీరో కలవడంతో అతడు తెగ సంబరపడుతున్నాడు.
మేడ్చల్ జిల్లా కొంపల్లి పరిధిలో భారతి బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన శివరామకృష్ణ, నాగరాజు, నరసింహరావును పోలీసులు అరెస్టు చేశారు. వీరు అమాయక ప్రజల నుంచి రూ.60 కోట్ల డబ్బు వసూలు చేసి మోసం చేయటంతో సైబరాబాద్ పోలీసులు రిమాండ్ చేసినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆన్లైన్ బెట్టింగ్లతో యువత ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలకు తీరని మనోవ్యధకు మిగులుస్తోంది. ఈ విషపు క్రీడ గ్రామాల్లోకి పాకింది. గ్రామీణ యువకులు కూడా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లు కాస్తూ అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో నెలకు సుమారు 15 వరకు ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో సుమారు 22 శాతం మంది యువత ఆన్లైన్ గేమింగ్కు బానిసలవుతున్నట్లు ఇటీవల జరిగిన ఓ సర్వేలో తేలింది.
ఆత్మహత్యలకు నిజామాబాద్ మెడికల్ కళాశాల అడ్డాగా నిలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన జూనియర్ డాక్టర్లు తనువులు చాలిస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. అయితే మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇతర పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగానే తరచుగా ఇలాంటి ఘటనలు కళాశాలలో పునరావృతం అవుతున్నాయనే విమర్శలు తలెత్తుతున్నాయి.
భూమి పట్టాచేయాలని కుమారుడు తల్లిపై దాడి చేసిన ఘటన ఎల్కతుర్తి మండలంలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. పెంచికల్పేట్ గ్రామానికి చెందిన చిలుముల లక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమారుడు రఘుపతి ఈ నెల 17న తన భాగానికి వచ్చిన భూమి తోపాటు తల్లి దగ్గరున్న 20 గుంటలు కూడా తన పేరున పట్టా చేయాలని లక్ష్మిని తీవ్రంగా కొట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.