India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులు రూ.2,736.76 కోట్లు రుణాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా వివరాలిలా..
✓ NGKL – 1,47,500 మంది రైతులు తీసుకున్న రుణాలు రూ.935.40 కోట్లు.
✓ MBNR – 1,23,102 మంది రైతులు, రూ.735.82 కోట్లు.
✓ గద్వాల – 95,199 మంది రైతులు, రూ.367.72 కోట్లు.
✓ నారాయణపేట – 94,359 మంది రైతులు, రూ.357.62 కోట్లు.
✓ వనపర్తి – 88,948 మంది రైతులు, రూ.340.20 కోట్లు.
నాగార్జునసాగర్ చేపల టేస్టే వేరు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. సాగర్ వెనుక జలాలు, AMRP, ఏకేబీఆర్ ప్రాజెక్టులో లభించే చేపలు కొంచెం తియ్యగా, చప్పగా ప్రత్యేకంగా ఉండడంతో భోజన ప్రియులు ఈ చాపలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఈ చాపల కోసం బంగ్లాదేశ్ దేశ వ్యాపారస్తులు, అసోం వంటి రాష్ట్రాల వారు కొనుగోలు చేసుకుని వారి ప్రాంతాలకు తరలిస్తుండడంతో ఇక్కడి చేపలకు భలే గిరాకీ ఏర్పడింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అహ్మద్ నగర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లేశం, మంజుల దంపతుల కుమార్తె నీరుడి హిందూ అనే 5 సంవత్సరాల బాలిక ఇంట్లో గత రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే పాఠశాల సమీపంలో ఆడుకుంటున్న క్రమంలో పాము కాటు వేసి ఉంటుందని బంధువులు అనుమానిస్తున్నారు. పాము కాటు వల్లే హిందూ మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఉమ్మడి పాలమూరులో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. మధ్య ప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని వివరించింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నిజామాబాద్ లోక్సభ స్థానంలో టఫ్ ఫైట్ ఉందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎవరైనా గెలిచే అవకాశం ఉందన్నారు. జగిత్యాల ప్రజల తీర్పును గౌరవిస్తానని చెప్పారు. కాగా ఇక్కడ బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ కామెంట్?
ఉమ్మడి ADB జిల్లాలో వివిధ కారణాలతో శుక్రవారం 9 మంది మృతిచెందారు.
ADBలో విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి. మావల, కుంటాలలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి. ఇంద్రవెల్లిలో కడుపు నొప్పి భరించలేక యువతి సూసైడ్. వాంకిడిలో ఇష్టంలేని పెళ్లి చేశారని నవవరుడు సూసైడ్. ఆసిఫాబాద్లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఖానాపూర్లో బైక్తో చెట్టును ఢీకొని వ్యక్తి మృతి. కాసిపేటలో ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.
TS EAPCET ఫలితాల్లో HYDకి చెందిన నలురుగు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేటగిరిలో అసిఫ్నగర్కు చెందిన రేపల సాయి వివేక్(5వ ర్యాంకు), నాచారంకు చెందిన మహమ్మద్ అజాన్ సాద్(6వ ర్యాంకు), పేట్బషీరాబాద్కు చెందిన భార్గవ్ సుమంత్(8వ ర్యాంకు), కుకట్పల్లికి చెందిన ఆదిత్య(9వ ర్యాంకు) సాధించారు. ఈ సందర్భంగా వీరిని కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.
TS EAPCET ఫలితాల్లో HYDకి చెందిన నలురుగు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేటగిరిలో అసిఫ్నగర్కు చెందిన రేపల సాయి వివేక్(5వ ర్యాంకు), నాచారంకు చెందిన మహమ్మద్ అజాన్ సాద్(6వ ర్యాంకు), పేట్బషీరాబాద్కు చెందిన భార్గవ్ సుమంత్(8వ ర్యాంకు), కుకట్పల్లికి చెందిన ఆదిత్య(9వ ర్యాంకు) సాధించారు. ఈ సందర్భంగా వీరిని కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.
అకాల వర్షాలకు రైతులు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ధాన్యం దిగుబడులు పెరుగుతున్న పంట విక్రయించే సమయానికి అగచాట్లు పడాల్సి వస్తోంది. దిగుబడికి రైస్ మిల్లుల సామర్ధ్యానికి పొంతన లేక పోవడంతో తూకం వేసిన ధాన్యం నిలువలు పెరిగిపోయి ఎక్కడ నిల్వ ఉంచాలో అర్థం కాని పరిస్థితి ఉంది. జిల్లాలో 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ మేరకు మిల్లుల సామర్థ్యం లేదు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ సొంత గ్రామాలకు వచ్చి ఓట్లు వేశారు. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ బస్సు డిపోలు ఈనెల 10 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు నడిపాయి. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి రోజుకు రూ.2.18 కోట్ల రాబడి సమకూరింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.1.89 కోట్ల రాబడి వచ్చేది.
Sorry, no posts matched your criteria.