Telangana

News May 18, 2024

నిజామాబాద్‌లో టఫ్ ఫైట్: జీవన్ రెడ్డి

image

నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో టఫ్ ఫైట్ ఉందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎవరైనా గెలిచే అవకాశం ఉందన్నారు. జగిత్యాల ప్రజల తీర్పును గౌరవిస్తానని చెప్పారు. కాగా ఇక్కడ బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ కామెంట్?

News May 18, 2024

ADB ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 9 మంది మృతి

image

ఉమ్మడి ADB జిల్లాలో వివిధ కారణాలతో శుక్రవారం 9 మంది మృతిచెందారు.
ADBలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి. మావల, కుంటాలలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి. ఇంద్రవెల్లిలో కడుపు నొప్పి భరించలేక యువతి సూసైడ్. వాంకిడిలో ఇష్టంలేని పెళ్లి చేశారని నవవరుడు సూసైడ్. ఆసిఫాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఖానాపూర్‌లో బైక్‌తో చెట్టును ఢీకొని వ్యక్తి మృతి. కాసిపేటలో ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.

News May 18, 2024

EAPCET ఫలితాల్లో HYD విద్యార్థుల సత్తా

image

TS EAPCET ఫలితాల్లో HYDకి చెందిన నలురుగు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేటగిరిలో అసిఫ్‌నగర్‌కు చెందిన రేపల సాయి వివేక్(5వ ర్యాంకు), నాచారంకు చెందిన మహమ్మద్ అజాన్ సాద్(6వ ర్యాంకు), పేట్‌బషీరాబాద్‌కు చెందిన భార్గవ్ సుమంత్(8వ ర్యాంకు), కుకట్‌పల్లికి చెందిన ఆదిత్య(9వ ర్యాంకు) సాధించారు. ఈ సందర్భంగా వీరిని కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.

News May 18, 2024

EAPCET ఫలితాల్లో HYD విద్యార్థుల సత్తా

image

TS EAPCET ఫలితాల్లో HYDకి చెందిన నలురుగు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేటగిరిలో అసిఫ్‌నగర్‌కు చెందిన రేపల సాయి వివేక్(5వ ర్యాంకు), నాచారంకు చెందిన మహమ్మద్ అజాన్ సాద్(6వ ర్యాంకు), పేట్‌బషీరాబాద్‌కు చెందిన భార్గవ్ సుమంత్(8వ ర్యాంకు), కుకట్‌పల్లికి చెందిన ఆదిత్య(9వ ర్యాంకు) సాధించారు. ఈ సందర్భంగా వీరిని కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.

News May 18, 2024

మెదక్ జిల్లాలో వడ్ల నిల్వకు జాగా ఏది..?

image

అకాల వర్షాలకు రైతులు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ధాన్యం దిగుబడులు పెరుగుతున్న పంట విక్రయించే సమయానికి అగచాట్లు పడాల్సి వస్తోంది. దిగుబడికి రైస్ మిల్లుల సామర్ధ్యానికి పొంతన లేక పోవడంతో తూకం వేసిన ధాన్యం నిలువలు పెరిగిపోయి ఎక్కడ నిల్వ ఉంచాలో అర్థం కాని పరిస్థితి ఉంది. జిల్లాలో 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ మేరకు మిల్లుల సామర్థ్యం లేదు.

News May 18, 2024

MBNR: ఎన్నికల వేళ ఆర్టీసీకి రాబడి

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ సొంత గ్రామాలకు వచ్చి ఓట్లు వేశారు. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ బస్సు డిపోలు ఈనెల 10 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు నడిపాయి. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి రోజుకు రూ.2.18 కోట్ల రాబడి సమకూరింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.1.89 కోట్ల రాబడి వచ్చేది.

News May 18, 2024

EAPCET ఫలితాల్లో HNK విద్యార్థినికి మూడో ర్యాంకు

image

తెలంగాణ EAPCET ఫలితాల్లో హనుమకొండ విద్యార్థిని ప్రతిభ కనబరిచారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేటగిరిలో రెడ్డికాలనీకి చెందిన గడ్డం శ్రీవర్షిణి 145.26 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. కాగా శ్రీవర్షిణి హనుమకొండలో పదో తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమెను కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.

News May 18, 2024

MBNR: పూణేలో పాలమూరు యువకుడి దారుణ హత్య

image

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం అన్నారెడ్డిపల్లి తండాకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. తండాకు చెందిన శ్రీనివాస్ (22) తల్లిదండ్రులతో పాటు పూణేలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి పని ఉందని చెప్పి బయటకు వెళ్లి దారుణ హత్యకు గురైనట్లు శుక్రవారం గుర్తించారు. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 18, 2024

చెన్నారావుపేట: పిల్ల కాలువలో మొసలి

image

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పాత మగ్దుంపురం శివారు వ్యవసాయ భూముల్లోని పిల్ల కాలువలో మొసలి ప్రత్యక్షమైంది. ఆ మొసలిని స్థానికులు చూసి భయాందోళన చెందారు. ఈ కాలువకు సమీపంలో కొన్ని ఇళ్లు ఉండటంతో స్థానికులు, రైతులు భయపడుతున్నారు. మొసలిని మరో చోటకు వెళ్లేలా చూడాలని అటవీ శాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

News May 18, 2024

హత్నూర: నీటి తొట్టెలో పడి 15 నెలల బాలిక మృతి

image

ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి ఒక బాలిక నీటి తొట్టెలో పడి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు నరేశ్ కుమార్తె హరి చందన (15 నెలలు) గత రాత్రి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఊపిరాడక అందులోనే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.