Telangana

News May 17, 2024

HYD: 39 కొత్త STPలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

image

మూసీ ప్రక్షాళనకు ముందడుగు పడింది. HYDలో రూ.4 వేల కోట్లతో 39 కొత్త STPలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మురుగు నీటి శుద్ధికి ఇప్పటికే 31 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP)లు నిర్మాణంలో ఉండగా.. మరో 39 ఎస్టీపీలకు సాంకేతిక కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR)లకు ఆమోదముద్ర వేసింది. వీటితో మూసీలోని ప్రతి నీటి చుక్కను శుద్ధి చేయనున్నారు.

News May 17, 2024

KMM: మల్లన్నను తప్పించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత ధర్నా

image

ఖమ్మం: స్మశానానికి పంపుతారా-శాసన మండలికి పంపుతారా అని 4.61 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసిన తీన్మార్ మల్లన్నను ఎన్నికల బరి నుంచి తొలగించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శుక్రవారం ఆయన కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు.

News May 17, 2024

NSPT: గిరిజన గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

నర్సంపేటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఎంపీసీ, బైపిసి కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతున్నారు. పదో తరగతి పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 23న నర్సంపేటలోని కళాశాలలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని ప్రాంతీయ సమన్వయ అధికారి వెంకన్న తెలిపారు.

News May 17, 2024

మెదక్: కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు.. ఈనె 30 LAST DATE

image

కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి పది ఫలితాల్లో 7.0 జీపీఏ ఆపైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోడానికి అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News May 17, 2024

నిర్మల్: రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు

image

హైదరాబాద్‌లోని శ్రీ నీలకంఠ విద్యాపీఠంలో ఈ నెల 16, 17తేదీల్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్రస్థాయి అభ్యాస వర్గలో జిల్లాకు చెందిన పలువురు సంఘ బాధ్యులు పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర, విద్య ఆధారంగా జాతి నిర్మాణం, దేశభక్తి, నూతన జాతీయ విద్యావిధానం, ఆదర్శ ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వంటి పలు అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తపస్ నాయకులు తెలిపారు.

News May 17, 2024

సూర్యాపేట: రూ.2 లక్షలు ఇచ్చాక తల్లికి తలకొరివి

image

నేరేడుచర్ల మండలం కందులవారి గూడెంలో ఆస్తి వివాదం విషయంలో <<13263429>>అంత్యక్రియలు ఆగిన<<>> విషయం తెలిసిందే. తల్లి అంత్యక్రియల ఖర్చును తాను భరించలేనని, డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని కొడుకు అన్నాడు. శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రెండు లక్షలు ఇప్పియడంతో ఆ పంచాయితీ కొలిక్కి వచ్చింది. తర్వాత ఆమె అంత్యక్రియల‌ను నిర్వ‌హించారు.

News May 17, 2024

KNR: పార్లమెంటు ఫలితాలపైనే స్థానిక ఆశలు!

image

పార్లమెంటు ఎన్నికల ఫలితాల పైనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల భవితవ్యం ఆధారపడి ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకోసం ఏ పార్టీ మద్దతు ఉంటే తమకు లాభం ఉంటుందనే విషయమై ఇప్పటికే అంచనాకు వచ్చి మొన్నటి ఎన్నికల్లో కొందరు పార్టీ మారారు. ఈ ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల మార్పు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

News May 17, 2024

MBNR: మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

HYDకార్మికనగర్‌లో వనపర్తి జిల్లాకు చెందిన <<13256242>>మేకప్ ఆర్టిస్ట్ <<>>చెన్నయ్య(తేజ) హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసుల వివరాలు.. యూసుఫ్‌గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్‌నగర్‌ వాసి సంపత్ యాదవ్(19)కు పరిచయముంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి సంపత్, చెన్నయ్య కలిసి నిమ్స్‌మే గ్రౌండ్‌లో అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఈసమయంలో సంపత్ తన వద్ద ఉన్న కత్తితో చెన్నయ్యను చంపాడు. సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News May 17, 2024

ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా అకాల వర్షానికి చాలా చోట్ల వడ్లు తడిసి పోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈదురుగాలుల ప్రభావానికి కొన్ని ప్రాంతాలల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. గాలి వానకు కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు కరెంట్ స్తంభాలపై పడగా. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

News May 17, 2024

ఖమ్మం: పట్టభద్రులూ.. సరిగా ఓటేయండి

image

2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.