Telangana

News May 17, 2024

HYD: 19 ఓట్ల లెక్కింపు కేంద్రాలు

image

లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. నగర పరిధిలోని 4 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 29 అసెంబ్లీ సెగ్మెంట్లకు 19 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.

News May 17, 2024

కొత్తగూడెం: యువతిపై అత్యాచార యత్నం 

image

సుజాతనగర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిపై ఈనెల 12న రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. పోలీసులు కథనం ప్రకారం.. ఇంట్లో ఉన్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. కులం పేరుతో దూషించాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై జుబేదా బేగం తెలిపారు.

News May 17, 2024

NGKL: అగ్ని వీర్ దరఖాస్తుల ఆహ్వానం

image

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయుగా చేరేందుకు ఆసక్తిగల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువ జన క్రీడల శాఖ అధికారి సీతారాం తెలిపారు. ఈనెల 22 నుంచి జూన్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. భారత వాయుసేనలో చేరాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు agnipathvayu. cdac.in వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు

News May 17, 2024

ఆదిలాబాద్: సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య

image

సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

News May 17, 2024

 38.55 లక్షల మొక్కలు నాటనున్నారు

image

నల్గొండ జిల్లాలో 2024 సంవత్సరంలో హరిత లక్ష్యం ఖరారైంది. జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 38.55 లక్షల మొక్కలు నాటనున్నారు. గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష్యం నిర్ణయించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 844 పల్లె నర్సరీలలో మొక్కలు పెంచే పనులను ప్రారంభించారు. గత 9 ఏళ్లలో గత ప్రభుత్వం 10 కోట్ల మొక్కలను నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాటారు.

News May 17, 2024

నిజామాబాద్‌కి ఇంజినీరింగ్ కాలేజ్?

image

ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. గతంలో 3 విధాల ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడని విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. మహిళా కళాశాలతో పాటు ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో చెప్పారు. ఈ తరుణంలో ఈ రెండు కళాశాలల ఏర్పాటుపై ఆశలు చిగురించినట్లయింది.

News May 17, 2024

ఐసెట్’కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

image

రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా, ఈసారి ఇప్పటివరకు 80,723 వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య శ్రీరామోజు నరసింహాచారి తెలిపారు. ఈ నెల 17 వరకు రూ.250 రుసుముతో దరఖాస్తుకు అవకాశం ఉండగా, రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 27 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

News May 17, 2024

MBNR: ఈనెల 30న.. కాబోయే వధువు మృతి

image

కాబోయే వధువు అనుమానాస్పదంగా మృతిచెందింది. స్థానికుల వివరాలు.. అమరచింతకు చెందిన ఓ యువతి(24) పెళ్లి ఈనెల 30న జరగాల్సి ఉంది. సాయంత్రం ఇంటికెళ్లిన సోదరుడు తలుపు కొట్టగా ఆమె తీయలేదు. దీంతో లోపలికి వెళ్లిన అతను ఆమె తల నుంచి రక్తం కారుతుండగా ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.అయితే ఉరేసుకునే క్రమంలో ఫ్యాన్ కొక్కెం ఊడి కిందపడటంతో గాయాలై మృతి చెందినట్లు భావిస్తున్నారు.

News May 17, 2024

మెదక్ జిల్లాలో వర్షపాతం వివరాలు..

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో(ఉదయం 8:30 గంటల వరకు) నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా రామాయంపేట 62.5మి.మి, కొండపాక 51.5, గజ్వేల్ 44.0, చీకోడు 38.8, హబ్సిపూర్ 37.8, మాసాయిపేట 36.3, లకుడారం 35.8, బేగంపేట 35.5, కొడకండ్ల 34.0, నారాయణరావుపేట 31.3, మిన్పూర్ 30.5, కాగజ్ మద్దూర్ 30.3, అల్లాదుర్గం, పాల్వంచ 30.0 మి.మి వర్షపాతం నమోదయింది.

News May 17, 2024

సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య

image

సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.