India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4న ఫలితాల కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వివరాలు.. ★ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లు: సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ★ ఖానాపూర్, నిర్మల్, ముథోల్ అసెంబ్లీ ఓట్లు : ఆదిలాబాద్ సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ★ ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ ఓట్లు: TTDCలో
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో గత మార్చ్ నెలలో నిర్వహించిన పీజీ ఫలితాలు వెలువడినట్టు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. MBA, MCA, MSC, ఒకటవ, మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.satavahana.ac.inలో అందుబాటులో ఉంచామని, ఫలితాలను చూసుకోవాలని ఆయన సూచించారు.
చిట్యాల మండలం వెలిమినేడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రైపియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రతీ స్కానింగ్ సెంటర్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఫొటోలు తీయాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రైపియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రతీ స్కానింగ్ సెంటర్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఫొటోలు తీయాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. బుగ్గారం మం. గోపులాపూర్కు చెందిన బెస్త శ్రీనివాస్ (35), అతని తమ్ముడు మహేష్పై రాడ్లు, పైప్లతో గురువారం అర్ధరాత్రి 5గురు ముసుగు వేసుకుని వచ్చి రాడ్లు, పైప్లతో దాడి చేయగా బెస్త శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. భూ తగాదాల నేపథ్యంలోనే గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములవారి నిత్య కల్యాణ క్రతువును వీక్షించిన భక్తులు పరమానంద భరితులయ్యారు. రామయ్యకు అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. వైదిక పెద్దలు చేసిన ప్రవచనం ఆకట్టుకుంది. నిత్య కల్యాణం గురించి ప్రవచిస్తుండగా అనుగుణంగా వేడుకను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగల్యధారణ నిర్వహించి తలంబ్రాల వేడుక చేశారు.
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం మావల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. నిర్మల్ వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ షేక్ అజీమ్కు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ అతనిని ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
Sorry, no posts matched your criteria.