India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో BJP గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని ఆ పార్టీ MP అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. BJP ఈ ఎన్నికల్లో గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఖమ్మంలోనే స్థిర నివాసం ఏర్పరుచుకుని కార్యకర్తలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల్లో తన వంతు కృషి చేస్తానని అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మీడియా సహాయం మర్చిపోలేనిదని పేర్కొన్నారు.
ఉద్యోగులు, యువతను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని,ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృతనిశ్చయంతో యువత, నిరుద్యోగులు ఉన్నారని MLA జగదీష్ రెడ్డి అన్నారు. NLG-వరంగల్-ఖమ్మం MLC ఎన్నికలకు సంబంధించి సూర్యాపేటలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘పట్టుదలతో పని చేస్తే విజయం మనదే’ అని అన్నారు.
భార్యను వేధించిన కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్ష, రూ 2500 జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తీర్పునిచ్చారు. జైనథ్ మండలంలోని నీరాల గ్రామానికి చెందిన మహిళ తన భర్త దీక్షిత్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. నేడు పీసీఆర్ కోర్టులో పోలీసులు అతడిని హాజరుపర్చగా విచారణ అనంతరం అతడికి కోర్టు శిక్ష విధించినట్లు లైజన్ అధికారి గంగా సింగ్ తెలిపారు.
కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం వాసుదేవ్పూర్ గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షంలో ఇద్దరూ బైక్పై ప్రయాణిస్తూ వాసుదేవ్ పూర్ గేటు దగ్గర ఆగి ఉన్నారు. అంతలోనే పిడుగు పడి ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా.. మరోకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రికి తరలించారు. వీరు ఆమనగల్లు మండలం చెన్నారం గ్రామానికి చెందినవారుగా సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో విద్య అందించేందుకు నల్గొండ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మార్చి 2024 లో 10లో జిపిఏ 7.0 పైన జిపిఏ సాధించిన విద్యార్థులు జిల్లాలోని ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు సంబంధిత పత్రాలతో telanganaepass. cgg.gov.in అనే సైట్లో దరఖాస్తు ఈ నెల 30లోపు చేసుకోవాలన్నారు.
నల్గొండ క్లాక్ టవర్ అంటే తెలియని వారుండరు. ఇటీవల పట్టణంలో వర్షం కురవగా ఓ వ్యక్తి ఆ ఏరియాని క్యాప్చర్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఇంకేం.. క్షణాల్లోనే అది వైరల్గా మారింది. చిరు జల్లుల్లో క్లాక్ టవర్ అందాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. ఆ వ్యూ సూపర్ అంటూ నల్గొండ వాసులు కామెంట్లు చేస్తున్నారు. ఎలా ఉందో మీరూ చెప్పండి.
కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన ఘటన కుక్కనూరు మండలం దామచర్లలో చోటుచేసుకుంది. గుత్తి కోయ గ్రామానికి చెందిన 9 మంది గిరిజనులు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఓ వృద్ధురాలు, బాలుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు గిరిజనులకు మినరల్ వాటర్ అందించడంతో పాటు గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
పిడుగుపాటుతో రైతు మృతి చెందిన ఘటన తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన రుద్రారపు చంద్రయ్య గురువారం పొలం వద్ద పనిచేసుకుంటున్నాడు. వాతావరణ మార్పులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఈ క్రమంలోనే అతనిపై పిడుగు పడింది. దీంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.
రేపటి నుంచి పది రోజుల పాటు సినిమాల ప్రదర్శనలకు విరామం ఇవ్వాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాల సంఘం రాష్ట్ర ప్రతినిధులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 40కి పైగా థియేటర్లు ఉన్నాయి. నిర్వహణ వ్యయం పెరిగిందని థియేటర్ల అద్దె పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.
పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. MBNR, NGKL పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీచేసిన అభ్యర్థులలో టెన్షన్ మొదలైంది. ఓటర్ నాడి అంతు చిక్కకపోవడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన ఆయా పార్టీ అభ్యర్థులలో మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పైకి మేమే గెలుస్తామని గంభీరంగా చెబుతున్నప్పటికీ విజయంపై లోలోలప టెన్షన్ నెలకొంది.
Sorry, no posts matched your criteria.