Telangana

News May 16, 2024

తంగళ్ళపల్లి: పిడుగుపాటుతో రైతు మృతి

image

పిడుగుపాటుతో రైతు మృతి చెందిన ఘటన తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన రుద్రారపు చంద్రయ్య గురువారం పొలం వద్ద పనిచేసుకుంటున్నాడు. వాతావరణ మార్పులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఈ క్రమంలోనే అతనిపై పిడుగు పడింది. దీంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.

News May 16, 2024

నల్గొండ: 10 రోజుల పాటు థియేటర్లు బంద్

image

రేపటి నుంచి పది రోజుల పాటు సినిమాల ప్రదర్శనలకు విరామం ఇవ్వాలని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాల సంఘం రాష్ట్ర ప్రతినిధులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 40కి పైగా థియేటర్లు ఉన్నాయి. నిర్వహణ వ్యయం పెరిగిందని థియేటర్ల అద్దె పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

News May 16, 2024

MBNR: ఈవీఎంలలో భవితవ్యం.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

image

పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. MBNR, NGKL పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీచేసిన అభ్యర్థులలో టెన్షన్ మొదలైంది. ఓటర్ నాడి అంతు చిక్కకపోవడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన ఆయా పార్టీ అభ్యర్థులలో మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పైకి మేమే గెలుస్తామని గంభీరంగా చెబుతున్నప్పటికీ విజయంపై లోలోలప టెన్షన్ నెలకొంది.

News May 16, 2024

జబర్దస్త్ ఫేం కార్తీక్‌కు మాతృ వియోగం

image

జబర్దస్త్ ఫేం కెవ్వు కార్తీక్ కు మాతృ వియోగం కల్గింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కార్తీక్ బుల్లి తెరపై వివిధ కార్యక్రమాల్లో నటిస్తున్నాడు. ఆయన తల్లి ఒడపల్లి కరుణ(56) గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. హైద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. బుధరావుపేటకు చెందిన పలువురు కరుణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

News May 16, 2024

ఖమ్మం: రేపటి నుంచి థియేటర్లు బంద్

image

రేపటి నుంచి పది రోజుల పాటు సినిమాల ప్రదర్శనలకు విరామం ఇవ్వాలని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాల సంఘం రాష్ట్ర ప్రతినిధులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30కి పైగా థియేటర్లు ఉండగా, ప్రస్తుతం ఖమ్మంలో 6 థియేటర్లు నడుస్తున్నాయి. నిర్వహణ వ్యయం పెరిగిందని, థియేటర్ల అద్దె పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

News May 16, 2024

UK పార్లమెంట్ బరిలో సిద్దిపేట జిల్లా వాసి

image

సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శనిగరం వాసి నాగరాజు ఉదయ్ UK పార్లమెంట్ బరిలో నిలిచారు. యూకేలోని లండన్ యూనివర్సిటీలో పాలనాశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన ఆయన అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ స్థానం నుంచి ఆయన పోటీ పడనున్నారు. నాగరాజు మాజీ ప్రధాని పీవీ నరసింగరావుకు బంధువు. కొహెడ మండల వాసి యూకే పార్లమెంట్ బరిలో నిలవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News May 16, 2024

కరీంనగర్‌: 18 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల (అటానమస్) డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి గురువారం తెలిపారు.

News May 16, 2024

నల్గొండలో భారీ మెజార్టీ: ఈటల

image

నల్గొండ ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈటల రాజేందర్ కీలక వాఖ్యల చేశారు. నల్గొండ స్థానంలో అత్యధిక మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. పట్టభద్రులు కూడా మోదీ వైపే చూస్తున్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ను గెలిపించాలని ఈటల కోరారు.

News May 16, 2024

HYD: GHMC తీరుపై సర్వత్రా విమర్శలు..!

image

GHMC తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. HYD బంజారాహిల్స్ రోడ్డులో హోర్డింగులు కార్లపై పడి ధ్వంసమైన ఫిర్యాదు 2016లో అందగా.. 2024 మే 15న రాత్రి స్పందించడం విమర్శలకు దారితీసింది. స్పందించిన కొద్దిసేపటికే X నుంచి మేసేజ్ డిలీట్ చేసింది. మరోవైపు GHMCకి ఫిర్యాదు చేసినా.. నెలల తరబడి సమస్యలకు పరిష్కారం చూపడం లేదని పలువురు ఆరోపించారు. మీరు ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్నారా కామెంట్ చేయండి?

News May 16, 2024

HYD: GHMC తీరుపై సర్వత్రా విమర్శలు..!

image

GHMC తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. HYD బంజారాహిల్స్ రోడ్డులో హోర్డింగులు కార్లపై పడి ధ్వంసమైన ఫిర్యాదు 2016లో అందగా.. 2024 మే 15న రాత్రి స్పందించడం విమర్శలకు దారితీసింది. స్పందించిన కొద్దిసేపటికే X నుంచి మేసేజ్ డిలీట్ చేసింది. మరోవైపు GHMCకి ఫిర్యాదు చేసినా.. నెలల తరబడి సమస్యలకు పరిష్కారం చూపడం లేదని పలువురు ఆరోపించారు. మీరు ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్నారా కామెంట్ చేయండి?