Telangana

News May 16, 2024

HYD: మరో రెండు గంటల్లో వర్షం పడే ఛాన్స్!

image

HYD నగరంలోని పలు చోట్ల మరో రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మెన్ తెలిపింది. క్యుములోనింబస్ మేఘాలు మేఘావృతమై ఉన్నట్లు తెలియజేసింది. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల బెల్ట్ ప్రాంతాల్లో చిరుజల్లులు ప్రారంభమైనట్లు పేర్కొంది. HYD నగరంలో నేడు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

News May 16, 2024

NLG: రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు 

image

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 17వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్.. 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 16, 2024

ఖమ్మం: గ్రూప్-1, సివిల్స్ గ్రాండ్ టెస్టులు

image

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో టీఎస్పీఎస్సీ గ్రూప్-1, సివిల్స్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షలపై అవగాహన పెంపొందించేలా ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. గ్రూప్-1 నమూనా పరీక్షలు 18, 20, 22, 24, 25, 27, 29, 31, జూన్ 1, 3 తేదీల్లో జరుగుతాయని వెల్లడించారు. అలాగే సివిల్స్ ఈనెల 23, 24, 27, 29, 31, జూన్ 1, మూడు తేదీల్లో జరుగుతాయన్నారు.

News May 16, 2024

MBNR: మొత్తం 5,575 పదో తరగతి ఫెయిల్

image

ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం 44,898 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 39,323 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,575 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 2,127 మంది అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 526 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరందరూ జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు.

News May 16, 2024

NZB: 4,78,734 మంది ఓటేయ్యాలేదు

image

ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీతో పాటు జిల్లా యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేసింది. అయినా ఎంపీ ఎన్నికల్లో చాలా మంది ఓటు వేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. NZB పరిధిలో 17,04,867 మంది ఓటర్లు ఉంటే 12,26,133 మంది వేయగా, 4,78,734 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. NZB అర్బన్‌లో ఓటింగ్‌ శాతం చూస్తే అత్యల్పంగా ఉంటుంది. ఈఎన్నికల్లో అర్బన్‌లో 3,04,317 మంది ఓటర్లుంటే 1,88,159 మందే ఓటేశారు.

News May 16, 2024

ములుగు: KF లైట్ బీరులో నీళ్లు

image

KF లైట్‌ బీర్‌లో నీళ్లున్నాయంటూ ఓ వినియోగదారుడు ఎక్సైజ్‌ అధికారికి ఫిర్యాదు చేశాడు. వివరాలిలా.. ఈ నెల 14న ములుగు మండలంలోని ఓ వైన్స్‌లో 6 బీర్లు కొనగా, వాటిలో 5 బీర్లలో ఆల్కహాల్‌కు బదులు నీళ్లున్నట్లు గుర్తించాడు. దీంతో ఎక్సైజ్‌ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈమేరకు బీర్‌ బాటిల్‌ను ల్యాబ్‌కు పంపిస్తామని, నిర్ధారణ అయితే వైన్‌షాపుపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినట్లు యువకుడు తెలిపాడు.

News May 16, 2024

ఆదిలాబాద్: సింగరేణి ఉద్యోగాలకు అప్లికేషన్స్ స్వీకరణ

image

సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్‌ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా మే 4వ తేదీ వరకే ఆఖరి గడువుగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు. పోలింగ్‌ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం పేర్కొంది.

News May 16, 2024

WNP: బ్రెయిన్‌డెడ్.. ఐదుగురి జీవితాల్లో వెలుగు..

image

శ్రీరంగాపురం మండలం కంబళాపురంలో ఓ తల్లి తాను చనిపోయి మరో <<13255727>>ఐదుగురి జీవితాల్లో వెలుగులు<<>> నింపింది. లక్ష్మీదేవమ్మ(42) ఈనెల 5న కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా మరో వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె నిమ్స్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌తో చనిపోయారు. ఈ క్రమంలో జీవన్‌దాన్ వైద్య బృందం ఆమె భర్త, కుటుంబీకులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి.

News May 16, 2024

HYD: ఐటీ ఉద్యోగులపైనే BJP ఆశలు!

image

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఐటీ ఉద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి, RJNR, మహేశ్వరం ఓటర్ల పైనే BJP ఆశలు పెట్టుకుంది. కాగా ఆయా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాకపోవడం BJP అభ్యర్థిని ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు VKB, పరిగి, తాండూరు, చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల ఓటర్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో BRS ఓట్లు డైవర్షన్ అయినట్లు చర్చ సాగుతోంది.

News May 16, 2024

HYD: ఐటీ ఉద్యోగులపైనే BJP ఆశలు!

image

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఐటీ ఉద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి, RJNR, మహేశ్వరం ఓటర్ల పైనే BJP ఆశలు పెట్టుకుంది. కాగా ఆయా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాకపోవడం BJP అభ్యర్థిని ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు VKB, పరిగి, తాండూరు, చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల ఓటర్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో BRS ఓట్లు డైవర్షన్ అయినట్లు చర్చ సాగుతోంది.