Telangana

News May 15, 2024

HYD: విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ HYDలో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మంత్రి లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

News May 15, 2024

HYD: విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ HYDలో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మంత్రి లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

News May 15, 2024

మెదక్ పార్లమెంట్‌పై జోరుగా బెట్టింగులు..!

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో మెదక్ ఎంపీ ఫలితాలపై జిల్లావ్యాప్తంగా బెట్టింగులు ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లు సమాచారం. BRS అభ్యర్థి గెలుస్తాడని ఆ పార్టీ నేతలు అంటుంటే, తమ అభ్యర్థికే భారీ మెజారిటీతో గెలుస్తాడని కాంగ్రెస్, BJP నాయకులు బెట్టింగ్‌కు సై అంటున్నారు. దీనికి తెర పడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

News May 15, 2024

సరికొత్త పంథాకు మంత్రి పొంగులేటి శ్రీకారం 

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయానికి బాధితులు వచ్చే అవసరం లేకుండా నియోజకవర్గ ప్రజలతో నేరుగా ఆయనే మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. తొలివిడత ఈనెల 17 నుంచి 20వ వరకు నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోని ఎంపిక చేసిన మండలాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు.

News May 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన

image

తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే జూన్ 1న కేరళను ఋతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

News May 15, 2024

MBNR: ఫీజు చెల్లింపునకు రేపే చివరి రోజు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లింపుకు ఇంటర్ బోర్డ్ మరో అవకాశం కల్పించింది. రేపటిలోగా రూ.1000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉంటే.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

News May 15, 2024

బాల్కొండలో 5.03శాతం పెరిగిన పోలింగ్

image

2019 ఎంపీ ఎలక్షన్‌తో పోల్చితే 2024లో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ 5.03 శాతం పెరిగింది. 2019లో 69.72 శాతం నమోదవగా 2024లో 74.75 శాతం ఓటింగ్ పోలైంది. కాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల వారీగా పెరిగిన పోలింగ్ పరిశీలిస్తే.. బాల్కొండ ముందుండగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం 1.21 శాతంతో చివరిలో ఉంది. ఈ మేరకు గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.

News May 15, 2024

నిర్మల్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన పోలింగ్

image

2019 ఎంపీ ఎలక్షన్‌తో పోల్చితే 2024లో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ 15.71 శాతం పెరిగింది. 2019లో 55.97 శాతం నమోదవగా 2024లో 71.68 శాతం ఓటింగ్ పోలైంది. కాగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల వారీగా పెరిగిన పోలింగ్ పరిశీలిస్తే.. నిర్మల్ ముందుండగా సిర్పూర్ అసెంబ్లీ స్థానం 2.01 శాతంతో చివరిలో ఉంది. ఈ మేరకు గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.

News May 15, 2024

HYD: సాలార్జంగ్ మ్యూజియంలో సమ్మర్ క్యాంప్

image

HYDలోని సాలార్జంగ్ మ్యూజియంలో సమ్మర్ ఆర్ట్ క్యాంపు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం యోగా, మధ్యాహ్నం ఆర్ట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడం కోసం క్యాంపులో పాల్గొనవచ్చని మ్యూజియం అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు వివిధ కళాకృతులను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

News May 15, 2024

HYD: సాలార్జంగ్ మ్యూజియంలో సమ్మర్ క్యాంప్

image

HYDలోని సాలార్జంగ్ మ్యూజియంలో సమ్మర్ ఆర్ట్ క్యాంపు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం యోగా, మధ్యాహ్నం ఆర్ట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడం కోసం క్యాంపులో పాల్గొనవచ్చని మ్యూజియం అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు వివిధ కళాకృతులను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.