Telangana

News May 15, 2024

HYDలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చికిత్స

image

TDP ఆంధ్రప్రదేశ్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న తాడిపత్రిలో జరిగిన గొడవల్లో పోలీసులు ప్రయోగించిన బాష్ప వాయువుతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా కుటుంబీకులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం HYD అబిడ్స్ కాంచన హాస్పిటల్ వద్దకు ఆయన్ను తరలించారు.

News May 15, 2024

ములుగు: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన వ్యక్తి

image

సైబర్ వలలో పడి ఓ వ్యక్తి నగదు పోగొట్టుకున్న ఘటన ములుగు పరిధిలో చోటుచేసుకుంది. సైబర్ నేరగాళ్లు బాధితుడి ఫోన్‌కు ఓ లింక్ పంపి అందులో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభం పొందవచ్చని నమ్మబలికాడు. అది నమ్మిన బాధితుడు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ. 1,98,000 పంపించాడు. తదుపరి ఆ లింకును ఓపెన్ చేసి చూడగా బ్లాక్ చేసి ఉంది. మొసపోయానని గ్రహించి ఆ వ్యక్తి వెంటనే సైబర్ సెల్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.

News May 15, 2024

HYDలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చికిత్స 

image

TDP ఆంధ్రప్రదేశ్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న తాడిపత్రిలో జరిగిన గొడవల్లో పోలీసులు ప్రయోగించిన బాష్ప వాయువుతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా కుటుంబీకులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం HYD అబిడ్స్ కాంచన హాస్పిటల్ వద్దకు ఆయన్ను తరలించారు. 

News May 15, 2024

NZB: గ్రూప్ -1, UPSC ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ

image

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌ను నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో, UPSC ప్రిలిమ్స్ ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌ను హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వెంకన్న తెలిపారు. అభ్యర్థులు www.tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News May 15, 2024

నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. బుధవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 123.0112 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉంది.

News May 15, 2024

HYD: BRS, కాంగ్రెస్ ఒక్కటే: కిషన్ రెడ్డి

image

BRS, కాంగ్రెస్ ఒక్కటే అని, ఆ పార్టీలకు ప్రత్యామ్నాయం BJPనే అని కేంద్ర మంత్రి, తెలంగాణ BJP చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. HYD నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన ఈరోజు మాట్లాడారు. ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయట్లేదని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించట్లేదని, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇవ్వట్లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలన్నారు.

News May 15, 2024

HYD: BRS, కాంగ్రెస్ ఒక్కటే: కిషన్ రెడ్డి

image

BRS, కాంగ్రెస్ ఒక్కటే అని, ఆ పార్టీలకు ప్రత్యామ్నాయం BJPనే అని కేంద్ర మంత్రి, తెలంగాణ BJP చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. HYD నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన ఈరోజు మాట్లాడారు. ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయట్లేదని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించట్లేదని, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇవ్వట్లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలన్నారు.

News May 15, 2024

MBNR, NGKL: లెక్కలేసుకుంటున్న అభ్యర్థులు

image

MBNR, NGKL లోక్‌సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. CM రేవంత్ సొంత  జిల్లా, అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లల్లో తమ ఎమ్మెల్యే అభ్యర్థులే గెలిచారని భారీ మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

News May 15, 2024

NZB: మహిళా ఉద్యోగిని తిట్టిన ఎమ్మల్యే.. ఉద్యోగానికి రాజీనామా

image

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న తనను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తిట్టి కేంద్రం నుంచి బయటకి పంపించేశారిని మహిళ మెప్మా ఆర్పీ ఉద్యోగి ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ తనకు అక్కడ డ్యూటీ వేశారని చెబుతున్న వినకుండా ఎమ్మెల్యే తనను అవమానించాడని పేర్కొన్నారు. దీంతో మనస్తాపం చేంది తన ఉద్యోగానికి రాజీనామా చేసి లెటర్‌ను మున్సిపల్ కమిషనర్‌కి అందజేశారు.

News May 15, 2024

ఖమ్మం: 2007 నుంచి కారు పార్టీదే గెలుపు

image

NLG-KMM-WGL MLC స్థానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా నడిచింది. ఉమ్మడి ఏపీలో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గెలిచారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి 2009 పోటీ చేసిన దిలీప్ కుమార్ మరోసారి విజయం సాధించారు. 2015, 21లోనూ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.