Telangana

News May 15, 2024

HYDను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఛాన్సే లేదు: సీఎం

image

జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత హైదరాబాద్‌ను బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని KTR ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. HYDను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఛాన్సే లేదని స్పష్టం చేశారు.

News May 15, 2024

గోవాలో గుండెపోటుతో మెదక్ జిల్లా వాసి మృతి

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన మస్కూరి కృష్ణ(45) గుండెపోటుతో మృతి చెందాడు. ఈనెల 13న స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లాడు. గోవాలో ఉండగా ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మస్కూరి కృష్ణ ప్రస్తుతం తూప్రాన్ పట్టణంలో గ్రానైట్ షాపు నిర్వహిస్తున్నారు. కృష్ణ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News May 15, 2024

NGKL: ఆ గ్రామంలో ఐదుగురే ఓటేశారు

image

ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం 2కిలోమీటర్లకు ఎక్కువ దూరం ఉన్న గ్రామాలకు పోలింగ్ కేంద్రాలను మంజూరు చేసింది. దీనితో నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ చెంచుపెంటలో నలుగురు పురుషులు, ఆరుగురు మహిళలు మొత్తం 10మంది ఓటర్లే ఉన్నారు. తాజా ఎంపీ పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News May 15, 2024

మెదక్: జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 30 వరకు తొలిదశ అడ్మిషన్లు కొనసాగుతాయన్నారు. ఎంపీసీ, బైపిసి, సీఈసీ, హెచ్ఈసి కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంగ్లీష్, తెలుగు మీడియంలో బోధన జరుగుతుందన్నారు.

News May 15, 2024

రాకేశ్ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పని చేయాలి: కేటీఆర్

image

వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలను పార్టీ కార్యకర్తలు పట్టభద్రులకు వివరించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

News May 15, 2024

సంగారెడ్డి: తార డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలు విద్యార్థుల నుండి దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చన్నారు. వివిధ కోర్సుల కొరకు దోస్ట్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

News May 15, 2024

మహబూబ్‌నగర్: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్ !

image

పాలమూరులో ఓటర్ల తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ బరిలో 31 మంది, నాగర్ కర్నూల్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. MBNRలో 7.12, NGKLలో 7.23 పోలింగ్ శాతం పెరిగింది. ఈ సమయంలో‌ ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో‌ టెన్షన్‌ పెంచింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 15, 2024

మంచిర్యాల: ప్రాణం తీసిన అక్రమ సంబంధం

image

మంగళవారం రాత్రి ఓ యువకుడిని <<13250620>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన మల్యాల నరేశ్ ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై పలు సందర్భాల్లో పంచాయతీలు కూడా అయ్యాయి. అయినా మళ్లీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో యువతి సోదరుడు మంగళవారం రాత్రి నరేశ్‌ను ఆటోతో గుద్ది, బండతో మోదీ చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 15, 2024

FLASH: హైదరాబాద్‌లో మరో మర్డర్

image

పాతబస్తీలో అర్ధరాత్రి జరిగిన మర్డర్‌ను మరవక ముందే మరో దారుణం జరిగింది. బోరబండ PS పరిధిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కార్మికనగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న మైదానంలో రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 15, 2024

మెదక్, జహీరాబాద్: ఎవరి ధీమా వారిదే !

image

మెదక్, జహీరాబాద్ MP స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్‌ల్లో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. మెదక్ లోక్‌సభ బీఆర్ఎస్ కంచుకోట అని, సిట్టింగ్ స్థానంలో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.