India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంగళవారం రాత్రి ఓ యువకుడిని <<13250620>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్కు చెందిన మల్యాల నరేశ్ ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై పలు సందర్భాల్లో పంచాయతీలు కూడా అయ్యాయి. అయినా మళ్లీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో యువతి సోదరుడు మంగళవారం రాత్రి నరేశ్ను ఆటోతో గుద్ది, బండతో మోదీ చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాతబస్తీలో అర్ధరాత్రి జరిగిన మర్డర్ను మరవక ముందే మరో దారుణం జరిగింది. బోరబండ PS పరిధిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కార్మికనగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న మైదానంలో రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్, జహీరాబాద్ MP స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్ల్లో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. మెదక్ లోక్సభ బీఆర్ఎస్ కంచుకోట అని, సిట్టింగ్ స్థానంలో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.
NLG-KMM-WGL MLC స్థానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా నడిచింది. ఉమ్మడి ఏపీలో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గెలిచారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి 2009 పోటీ చేసిన దిలీప్ కుమార్ మరోసారి విజయం సాధించారు. 2015, 21లోనూ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బోనకల్ మండలం ముష్టికుంట్ల- బోనకల్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కారు చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కారు మంటల్లో కాలిపోయింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఈనెల 15, 16న సౌత్ ఆఫ్రికాలోని ట్రిటోరియాలో జరిగే BRICS యూత్ ఇన్నోవేషన్ సమావేశాలకు భారత్ నుంచి మరికల్ మండల కేంద్రానికి చెందిన న్యాయవాది అయ్యప్పకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు, స్థిరమైన, సమ్మిళిత వృద్ధిపై బ్రిక్స్ దేశాలు చర్చిస్తాయి. బ్రిక్స్ యూత్ ఇన్నోవేషన్ సదస్సుకు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు న్యాయవాది అయ్యప్ప అన్నారు.
కాసేపట్లో విమానం ఎక్కాల్సిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందారు. కోస్గికి చెందిన పలువురు వ్యాపారులు కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లగా కాసేపట్లో విమానం ఎక్కాల్సి ఉంది. వారిలో ఒక్కరైన కూర వెంకటయ్య(75) అప్పటివరకు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. వెంకటయ్య తోటి బృందం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో కోస్గిలో విషాదం నెలకొంది.
రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. KNR జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఇప్పటికే DDలు చెల్లించిన వారందరికీ తిరిగి డబ్బులు వాపసు ఇవ్వనున్నారు. రెండో విడతలో యూనిట్ ధర రూ.1.75 లక్షలుగా ఉండటంతో లబ్ధిదారుల వాటాగా రూ.43,750 చెల్లించారు. ఈ విడతలో 3,404 యూనిట్ల కోసం DDలు చెల్లించగా 718 మందికి పంపిణీ చేశారు. మిగిలిన 2,686 మందికి డీడీల సొమ్ము తిరిగి చెల్లించనున్నారు.
NLG-KMM-WGL MLC స్థానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా నడిచింది. ఉమ్మడి ఏపీలో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గెలిచారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి 2009 పోటీ చేసిన దిలీప్ కుమార్ మరోసారి విజయం సాధించారు. 2015, 21లోనూ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.
మహబూబ్ నగర్లోని ఏనుగొండ సమీపంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ వై.సురేందర్ తెలిపారు. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈలో 10 తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఎంపీసీ, బైపీసీలో కలిపి 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని, ఈనెల 15 నుంచి కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.