India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి 1.90 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో కొద్ది కాలం పాటు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. అదనంగా మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు జూన్ వరకు ఇబ్బంది ఉండదని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు.
లోక్సభ ఎన్నికల్లో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఎన్నికల కమిషన్ ఎన్ని స్వీప్ కార్యక్రమాలు నిర్వహించినా కొన్ని గ్రామాల్లో సరాసరిగా 75 శాతం కంటే అధికంగా పోలింగ్ నమోదు కాలేదు. కాని కామారెడ్డి జిల్లాలోని ఎనిమిది పోలింగ్ కేంద్రాల ఓటర్లు 90 శాతానికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలోనివి కావడం విశేషం.
పీయూ ప్రస్తుత వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ మూడేళ్ల పదవి కాలం ఈనెల 21తో ముగియనుంది. 2021 మే 21న పీయూ 6వ ఉపకులపతిగా రాష్ట్రంలో మరో 10 యూనివర్సిటీలకు కూడా అప్పుడే వీసీలు నియమితులయ్యారు. వీరి పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకాలకు కసరత్తు మొదలుపెట్టింది. పీయూ వీసీ పదవికి మొత్తం 152 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా విశ్రాంతి ఆచార్యులు ఉన్నారు.
MLC పట్టభద్రుల ఉపఎన్నికపై BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల MLC స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డిని BRS బరిలో దింపింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఉపఎన్నికలో పార్టీ కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించి నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.
ఓటు విలువను తెలియజేస్తూ చేపట్టిన SVEEP కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 2019 MP ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 3.26 శాతం ఓట్ల శాతం పెరిగినట్లు వెల్లడించారు.
హైదరాబాద్: 2019-44.75%, 2024-48.48% నమోదు.
సికింద్రాబాద్:2019-46.26%, 2024-49.04% నమోదు.
మల్కాజిగిరి:2019-49.63%, 2024- 50.78% నమోదు.
చేవెళ్ల: 2019-53.25% 2024-56.50% నమోదైంది.
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగిన శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల లెక్కలను అధికారులు ఎట్టకేలకు తేల్చారు. ఆదాయం కంటే ఖర్చే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు రూ. 2,37,30,121 ఖర్చు చేయగా, అన్ని మార్గాల ద్వారా రూ.1,89,61,124 ఆదాయం సమకూరింది. సెక్టార్ల ద్వారా సుమారు రూ.93 లక్షలు, పరోక్ష సేవల ద్వారా రూ.7 లక్షలు, పోస్టల్ ద్వారా అంతరాలయ సేవలకు రూ.90 వేలు వచ్చాయి.
ఓటు విలువను తెలియజేస్తూ చేపట్టిన SVEEP కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 2019 MP ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 3.26 శాతం ఓట్ల శాతం పెరిగినట్లు వెల్లడించారు.
హైదరాబాద్: 2019-44.75%, 2024-48.48% నమోదు.
సికింద్రాబాద్:2019-46.26%, 2024-49.04% నమోదు.
మల్కాజిగిరి:2019-49.63%, 2024- 50.78% నమోదు.
చేవెళ్ల: 2019-53.25% 2024-56.50% నమోదైంది.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. ఈ మేరకు హాజీపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
కొల్లాపూర్ మండలం ఎల్లూరు రేగుమాన్గడ్డ తీరంలో మంగళవారం నాటికి 807 అడుగుల మేర శ్రీశైలం తిరుగుజలాలు నిల్వ ఉన్నట్లు మిషన్ భగీరథ పథకం ఈఈ సుధాకర్ సింగ్ చెప్పారు. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్ట్ ద్వారా రేగుమాన్ గడ్డ తీరంలో నిల్వ ఉన్న శ్రీశైలం తిరుగుజలాలను పంపులతో ఎత్తిపోస్తున్నారన్నారు. తాగునీరు అందించే ఎల్లూరు జలాశయంలో 0.35 టీఎంసీల సామర్థ్యం మేర పూర్తి స్థాయిలో నీటితో నింపుతున్నారు.
లోక్సభ పోరు ముగియగా మరో సమరానికి ఖమ్మం సిద్ధమైంది. NLG-KMM-WGL MLC స్థానానికి ఈ నెల 27న బైపోల్ జరగనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న (INC), BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండింపెండెంట్గా అశోక్ పోటీ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.