India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్సభ పోరు ముగియగా మరో సమరానికి వరంగల్ సిద్ధమైంది. NLG-KMM-WGL MLC స్థానానికి ఈ నెల 27న బైపోల్ జరగనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న (INC), BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండింపెండెంట్గా అశోక్ పోటీ చేస్తున్నారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మ. 12:30 గంటల వరకు, 5, 6వ సెమిస్టర్ విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా.5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
SHARE IT..
రేగోడు మండలంలో వాట్సాప్ గ్రూపుల్లో లింకులు పంపిస్తూ డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు మెసేజ్లు చేస్తూ బ్యాంకు ఖాతాలోని డబ్బులు కొల్లగొడుతున్నారు. మండలానికి చెందిన మాజీ సర్పంచి కుమారుని ఫోన్ హ్యాక్ చేసి రూ. 63వేలు డ్రా చేశారు. సీఏస్సీ సర్వీస్ జాయినింగ్ గ్రూప్ పేరుతో ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తుల ఫోన్లను హ్యాక్ చేసి డబ్బులు డ్రా చేస్తున్నారు. పలువురి ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు స్వాహా చేశారు.
హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి ఓల్డ్ సిటీలోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడిని పరిశీలించారు. హత్యకు గురైంది చార్మినార్ ప్రాంతానికి చెందిన మక్సూద్ అలీగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకొన్న సౌత్ జోన్ DCP స్నేహ మెహ్రా ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు.
లోక్సభ పోరు ముగియగా మరో సమరానికి నల్గొండ సిద్ధమైంది. NLG-KMM-WGL MLC స్థానానికి ఈ నెల 27న బైపోల్ జరగనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న (INC), BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండింపెండెంట్గా అశోక్ పోటీ చేస్తున్నారు.
హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి ఓల్డ్ సిటీలోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడిని పరిశీలించారు. హత్యకు గురైంది చార్మినార్ ప్రాంతానికి చెందిన మక్సూద్ అలీగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకొన్న సౌత్ జోన్ DCP స్నేహ మెహ్రా ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు.
ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 16,50,175 మంది ఓటర్లు ఉండగా.. 12,21,563 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడ 74.03 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో నమోదైన 71.42 శాతంతో పోల్చుకుంటే దాదాపు రెండున్నరశాతం అధికమే. ఓటు వినియోగంలో పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉంది. మరి మీరు ఓటేశారా? కామెంట్.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అప్రమత్తమైన సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పట్టణంలోని మహేశ్వరి థియేటర్ ప్రాంగణంలో గల కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అకాల వర్షానికి రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా 32,16,115 మంది ఓటర్లు ఉండగా.. 23,15,233 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో 77.75% అత్యధికంగా ఓట్లు పోలవగా.. అత్యల్పంగా కరీంనగర్లో 60.51% పోలవడం గమనార్హం. మొత్తంగా 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 8,34,164 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటు వినియోగంలో పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉంది. మరి మీరు ఓటేశారా? కామెంట్.
2019 ఎన్నికలతో పోలిస్తే వరంగల్ లోక్సభ స్థానంలో 2024లో ఓటింగ్ శాతం పెరిగింది. అప్పుడు 63.65% నమోదు కాగా.. ఇప్పుడు 68.86% పోలింగ్ అయింది. మహబూబాబాద్లోనూ 2019లో కంటే ఈసారి 2.81% మంది అధికంగా పోలింగ్లో పాల్గొనడంతో 71.85% నమోదైంది. ఈ రెండు స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉండగా.. 70.22 శాతంతో 23,57,331 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మరి మీరు ఓటేశారా? కామెంట్.
Sorry, no posts matched your criteria.