Telangana

News September 8, 2025

HYD: ఈ విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం: కవిత

image

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, బీసీలను మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల కోసం బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రిజర్వేషన్లు కల్పించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బీసీ సంఘాలను కలుపుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు.

News September 8, 2025

మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలు నేరుగా ఎస్పీ దృష్టికి తెచ్చారు. పరిష్కారం చేసే వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి నేరుగా రావాలన్నారు.

News September 8, 2025

మెదక్: ఇన్స్ స్పైర్ ప్రదర్శనలు చేయాలి: డీఈఓ

image

ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ఇన్స్ స్పైర్ ప్రదర్శనలు చేయాలని జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్ సూచించారు. ఓ కళాశాలలో జిల్లాలోని అన్ని ప్రైవేట్, ఉన్నత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు ఇన్స్ స్పైర్ నామినేషన్లపై అవగాహన కల్పించారు. ఈనెల 15లోపు 5 నామినేషన్లు రావాలని తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.

News September 8, 2025

NZB: అల్లు కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు

image

సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం పరామర్శించారు.
హాస్యనటుడు పద్మశ్రీ డా.అల్లు రామ లింగయ్య సతీమణి అల్లు కనక రత్నమ్మ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. కనక రత్నమ్మ చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి, కుటుంబానికి ధైర్యం చెప్పారు.

News September 8, 2025

స్థానిక ఎన్నికల జాబితాపై అఖిలపక్ష సమావేశం

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 8, 2025

ధనూర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

image

టేక్మాల్ మండలంలోని ధనూర గ్రామంలో పలువురు లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

News September 8, 2025

హైదరాబాద్ ఇమేజికి.. డ్యామేజీ?

image

ఫార్మా రంగ ఉత్పత్తులలో హైదరాబాద్‌దే అగ్రస్థానం. దాదాపు 40% ఉత్పత్తులు సిటీలోనే తయారవుతున్నాయి. ఇటీవల ఓ ఫార్మా కంపెనీలో నిషేదిత డ్రగ్స్ తయారవుతున్న విషయం బయటికి రావడంతో తీవ్ర చర్చనీయాంశం అయింది. కిలోల కొద్దీ డ్రగ్స్ ఇక్కడే తయారవుతుండటం నగరవాసులను షాకింగ్‌కు గురిచేసింది. ఫార్మా కంపెనీ ముసుగులో కొందరు అక్రమార్కులు డ్రగ్స్ తయారు చేస్తుండటంతో సిటీ ఇమేజీ డ్యామేజీ అయ్యే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు.

News September 8, 2025

ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, బాధితులకు న్యాయం చేయాలన్నారు.

News September 8, 2025

HYD: మత సామరస్యం చాటిన క్రిస్టియన్ యువకుడు

image

HYD కాప్రా(M) జవహర్‌నగర్‌లో నిన్న <<17640679>>ముస్లిం యువకుడు<<>> సోహెల్ వేలం పాటలో గణపతి లడ్డూ దక్కించుకుని మత సామరస్యం చాటగా నేడు క్రిస్టియన్ యువకుడు డేవిడ్ అదే బాటలో నడిచాడు. స్థానిక శ్రీరాంనగర్‌లో అడ్డా బాయ్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను డేవిడ్ అనే క్రిస్టియన్ యువకుడు వేలం పాటలో రూ.40 వేలకు దక్కించుకున్నాడు. బొట్టు పెట్టుకుని, జై బోలో గణేశ్ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేశాడు.

News September 8, 2025

ఆదిలాబాద్: రైల్వే సమస్యలను పరిష్కరించాలి

image

ఆదిలాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్, ఫిట్ లైన్, ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్ కోరారు. ఈ మేరకు సోమవారం నాందేడ్ రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రదీప్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు జనగం సంతోష్, కార్యదర్శి సుభాష్, అమర్ జార్జ్ పాల్గొన్నారు.