India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల టికెట్ల కోసం ఆశావాహులు వెంపర్లాడుతున్నారు. పోటీలో ఉండే అభ్యర్థుల ఎంపికపై అధికారికంగా జాబితా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు మిగతా పార్టీల నుంచి పోటీచేసే ఆశావాహులు అభ్యర్థనలు పెట్టుకోగా బరిలో ఎవరు నిలుచుబోతున్నారనేది మీమాంసగా మారింది. ఆశావాహులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి తొలిరోజైన బుధవారం జిల్లాలో 21 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. NZB కార్పొరేషన్లో 12, ARMR మున్సిపాలిటీలో 5, భీంగల్లో 4 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. ఇందులో BJP తరఫున 6, కాంగ్రెస్ నుంచి 9, BRS తరఫున 4, BSP, స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కో నామినేషన్లు వేసినట్లు వివరించారు.

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున టీచర్స కాలనీలో 236గా ఉంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే ఇవాళ ఒక్కసారిగా గాలి నాణ్యత క్షిణించింది.

అత్యవసర సమయాల్లో ఏ సమస్యకు ఏ నంబర్లకు కాల్ చేయాలో మీ కోసం..
☞ 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ ☞ 102 గర్భిణులు& పిల్లల కోసం ☞ 1073 సిటీలో రోడ్డు ప్రమాదాలు జరిగితే ☞1912 విద్యుత్శాఖ ☞1098 చైల్డ్ లేబర్ ☞ 104 హెల్త్ అడ్వైజ్ తీసుకోవడానికి ☞14567 సీనియర్ సిటిజన్స్ సహాయార్థం ☞ 1098 చైల్డ్ లేబర్ ☞ 1033 నేషనల్ హైవేలపై ఎమర్జెన్సీ ఏర్పడితే ర్యాపిడ్ రెస్పాన్స్ ☞ 9440700906 షీ టీమ్స్ ☞ 9000113667 హైడ్రా
# SHARE IT

SRPT మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ల కోసం ఆశావహులు పోటెత్తారు. 48 వార్డులకు 600 దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వార్డుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులు ఉంటారని భావించినా, భారీగా అప్లికేషన్లు రావడంతో హైకమాండ్ విస్మయం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి ఉత్తమ్, సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీ అభ్యర్థుల వడపోత పూర్తి చేసిన తర్వాతే బీ-ఫామ్ అందజేయనున్నారు.

NLG కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్యను కాంగ్రెస్ ప్రకటించింది. తొలి మేయర్ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేశారు.
పేరు: బుర్రి చైతన్య
భర్త: శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్
కుమారులు: ఇద్దరు
తల్లిదండ్రులు: బండ సరోజ, అంజిరెడ్డి
పదవులు: 2011 నుంచి 2018 వరకు రామాలయం ఛైర్మన్గా, 2020 నుంచి 2025 వరకు 33వ వార్డు కౌన్సిలర్గా పనిచేశారు.

జిల్లా RTOలో చోటుచేసుకున్న అవినీతిపై ACBఅధికారులు రిపోర్ట్ సిద్ధం చేశారు. కార్యాలయంలో తిష్టవేసిన అధికారులు, సిబ్బంది ప్రైవేటు వ్యక్తులతో సాగిస్తున్న ‘నిలువు దోపిడీ’పై పక్కా ఆధారాలను సేకరించారు. ఇటీవల నిర్వహించిన దాడుల్లో బయటపడిన అక్రమాలపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 2,3రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న పరిస్థితులుంటే వెంటనే హైడ్రా కంట్రోల్ రూం నంబరు 90001 13667కు ఫోను చేసి సమాచారమివ్వాలని హైడ్రా కమిషనర్ నగర ప్రజలను కోరారు. ఎక్కడ అగ్ని ప్రమాదానికి అవకాశం ఉన్నా లొకేషన్తో పాటు వీడియోలు, ఫొటోలు పంపించాలన్నారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. నగరంలోని అందరి లక్ష్యం అగ్ని ప్రమాదాలను తగ్గించడమే కావాలని కోరారు.

మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని MBNR కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. బుధవారం ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనిదేవితో కలిసి కలెక్టర్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్లు స్వీకరించే ముందు అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జతచేయాలో చెక్ లిస్ట్ స్పష్టంగా అర్థమయ్యేలా ప్రదర్శించాలని సూచించారు.

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు నియమితులైన జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి కీలక సూచన చేశారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు లేదా సూచనలు ఉన్నవారు 95533 95000 నంబర్కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. అలాగే mngdirector-tgts@telangana.gov.in మెయిల్ ఐడీ ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.