India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
>ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
>ఉమ్మడి జిల్లాలో ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ
>ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
>ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
>సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
>జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై సర్వే
>ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
>భద్రాచలంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు
>పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం స్కూల్లో అల్పాహారం అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. గత అక్టోబర్లో ప్రారంభమైన పథకం ఏప్రిల్ వరకు కొనసాగింది. మెదక్ జిల్లాలో 904 పాఠశాలల్లో అమలు చేయాల్సి ఉండగా, గతేడాది కేవలం 35 పాఠశాలల్లోనే పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు కావస్తున్నా అల్పాహారం మాత్రం అందించడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమంలో భాగంగా రూ.500లకు LPG సిలిండర్ను అందజేస్తుందని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపికై సిలిండర్ పొందిన వారికి ఆధారిత ఆన్లైన్ బదిలీ (డీబీటీ) ద్వారా బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ చేస్తున్నట్లు తెలిపారు. ఖాతాలో డబ్బులు నాలుగు రోజుల్లో జమ కానట్లయితే 1967 లేదా 180042500333 నంబర్కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17న మంగళవారం జంట నగరాలు HYD, సికింద్రాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ రోజున సెలవు ఇస్తుండటంతో నవంబర్ 9 రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. అక్టోబర్లో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్కు రానున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే G.మధుసూదన్ రెడ్డి తెలిపారు. MLA మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల మృతి చెందగా.. 15న నిర్వహించే దశ దిన కర్మకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎస్పీ జానకి సీఎం రాకతో ఏర్పాట్లపై సమీక్షించారు.
నిర్మల్ జిల్లా కుభీర్ (M) అంతర్నిలో కనిపించకుండా పోయిన చిన్నారి వర్ష(7) అనుమానాస్పదంగా మృతిచెందింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఈనెల 9న బాలిక కనిపించకుండా పోవడంతో కుభీర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, నిన్న వర్ష ఇంటికి కూత వేటు దూరంలో చెత్తకుప్పలో చిన్నారి శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వర్షగా గుర్తించారు.
సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్పూర్లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్పూర్ చేరుతుంది.
సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్పూర్లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్పూర్ చేరుతుంది.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17న మంగళవారం జంట నగరాలు HYD, సికింద్రాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ రోజున సెలవు ఇస్తుండటంతో నవంబర్ 9 రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. అక్టోబర్లో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం వద్ద పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ సంజీవిని దవాఖానతో చిన్నారుల గుండెకు భరోసా అందించేందుకు ముందుకు వచ్చింది. 5ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో దవాఖాన నిర్మించారు. నేడు ఈ దవాఖానాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నారు.
Sorry, no posts matched your criteria.