Telangana

News May 14, 2024

HYD: గడిచిన 24 గంటల్లో రూ.23,87,06,012 నగదు సీజ్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో HYDలో ఇప్పటివరకు రూ.23,87,06,012 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.26,06,11,049 విలువ గల ఇతర వస్తువులు, 28,150.805 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశామని, 380 మందిపై కేసులు నమోదు చేసి 383 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News May 14, 2024

జనగామ: నేడు ఉద్యోగులకు సెలవు

image

సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి మంగళవారం ప్రత్యేక సాధారణ సెలవుగా జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రకటించారు. బుధవారం యథావిధిగా విధులకు హాజరు కావాలని కోరారు.

News May 14, 2024

నారాయణఖేడ్: ఓటు హక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధుడు

image

నారాయణఖేడ్ పట్టణంలో శతాధిక వృద్ధుడు వీల్ చైర్ పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన మొహమ్మద్ ఖాదర్ సాబ్ (101) గర్ల్స్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 169 లో వీల్ చైర్ పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

News May 14, 2024

HYD: గడిచిన 24 గంటల్లో రూ.23,87,06,012 నగదు సీజ్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో HYDలో ఇప్పటివరకు రూ.23,87,06,012 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.26,06,11,049 విలువ గల ఇతర వస్తువులు, 28,150.805 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశామని, 380 మందిపై కేసులు నమోదు చేసి 383 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News May 14, 2024

NLG: 11 మంది నామినేషన్ ఉపసంహరణ

image

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బండారు నాగరాజు (యువతరం పార్టీ) స్వతంత్ర అభ్యర్థులు పోతుల ప్రార్థన, పోతుల యాదగిరి, సోమగాని నరేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారు నాగరాజు, దైద సోమ సుందరం, రత్నం ప్రవీణ్, కేడారి మేకల, రత్నం ప్రవీణ్, రేకల సైదులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

News May 14, 2024

ADB: ఓటు వేసి విదేశాలకు వెళ్లిన వైద్యులు

image

ఓటుహక్కు తెలిసినవారు పోలింగ్ సమయంలో ఎక్కడున్నా తమ గ్రామానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆదిలాబాద్‌కు చెందిన వైద్యులు ప్రవీణ్ అగర్వాల్ దంపతులు యూరప్‌లో ఉంటున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ కు వచ్చిన ఆయన ఓటువేయాలని సంకల్పంతో ఈనెల 13న ఓటు వేసిన తర్వాత యూరప్ కు వెళ్లాలని నిర్ధారించుకున్నాడు. దీంతో సోమవారం ప్రవీణ్ దంపతులు ఓటువేసి యూరప్‌కు బయలుదేరారు.

News May 14, 2024

KMM: 11 మంది నామినేషన్ ఉపసంహరణ

image

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బండారు నాగరాజు (యువతరం పార్టీ) స్వతంత్ర అభ్యర్థులు పోతుల ప్రార్థన, పోతుల యాదగిరి, సోమగాని నరేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారు నాగరాజు, దైద సోమ సుందరం, రత్నం ప్రవీణ్, కేడారి మేకల, రత్నం ప్రవీణ్, రేకల సైదులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

News May 14, 2024

నిజామాబాద్: మునుపెన్నడూ లేనివిధంగా ఓటింగ్ నమోదు

image

మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి రెండు గంటలకే సగటున 10.91 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అనంతరం కూడా అంతకంతకూ ఊపందుకుంది. ఉదయం 11 గంటల సమయానికి 28.26 శాతం జరిగిన ఓటింగ్, మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 45.67 శాతానికి, మధ్యాహ్నం 3గంటల సమయానికి 58.70 శాతానికి, సాయంత్రం 5 గంటల సమయానికి 67.96 శాతానికి చేరుకుంది.

News May 13, 2024

మెదక్ లోక్‌సభ సాయంత్రం 6 వరకు 73.63% పోలింగ్

image

మెదక్ లోక్ సభ పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు మొత్తం73.63%
పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా
గజ్వేల్- 73.15 %
సిద్దిపేట- 73.15 %
దుబ్బాక- 80.22 %
మెదక్- 79.61 శాతం
నర్సాపూర్- 83.73 శాతం
పటాన్ చెరువు -61 శాతం
గజ్వేల్-79.07 శాతం
సంగారెడ్డి- శాతం రావాల్సి ఉన్నది. సంగారెడ్డి రిపోర్టు వస్తే పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

News May 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. @ రాయికల్ మండలంలో అనుమానాస్పద స్థితిలో 20 గొర్రెలు మృతి. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్న యువకుడు. @ మెట్పల్లి పట్టణంలో ఒకరి ఓటును మరొకరు వేశారు. @ ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థులు. @ మెట్ పల్లి మండలంలో గుండెపోటుతో రేషన్ డీలర్ మృతి. @ ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్లు.