India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్మల్ జిల్లా కుభీర్ (M) అంతర్నిలో కనిపించకుండా పోయిన చిన్నారి వర్ష(7) అనుమానాస్పదంగా మృతిచెందింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఈనెల 9న బాలిక కనిపించకుండా పోవడంతో కుభీర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, నిన్న వర్ష ఇంటికి కూత వేటు దూరంలో చెత్తకుప్పలో చిన్నారి శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వర్షగా గుర్తించారు.
సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్పూర్లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్పూర్ చేరుతుంది.
సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్పూర్లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్పూర్ చేరుతుంది.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17న మంగళవారం జంట నగరాలు HYD, సికింద్రాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ రోజున సెలవు ఇస్తుండటంతో నవంబర్ 9 రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. అక్టోబర్లో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం వద్ద పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ సంజీవిని దవాఖానతో చిన్నారుల గుండెకు భరోసా అందించేందుకు ముందుకు వచ్చింది. 5ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో దవాఖాన నిర్మించారు. నేడు ఈ దవాఖానాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నారు.
సూర్యాపేట జిల్లా యాతవకిళ్లలో ఆకతాయిలు అర్ధరాత్రి ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వారి వివరాలిలా.. ఓ వర్గానికి చెందిన వినాయకుడి వద్ద భజన కార్యక్రమాలు చేస్తున్నారు. వారు పూజా కార్యక్రమాలను చేయకుండా మరో వర్గం వారు అడ్డుకుంటున్నారు. ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ పట్టణంలోని శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ సమీపంలో గల శాఖరి కుంటలో కార్యదర్శి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు సులువుగా వెళ్లేందుకు రహదారిని చదును చేసి, విద్యుత్ దీపాలను అమర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయితీ కార్యనిర్వహణ అధికారి మహేశ్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలు జిల్లాలో తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టవివరాలను అందజేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో జిల్లాకు రూ.3కోట్ల నిధులను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట అంచనా తయారు చేయాలని ఆమె సూచించారు.
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడిగా నియమితులైన విషయం తెలిసిందే. కాగా, నేడు ఆయన నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని హార్టీకల్చర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉమ్మడి NZB మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు.
HYD సైబర్ టవర్స్ వద్ద సర్వీస్ రోడ్డు నిర్మిస్తుండటంతో SEP14 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ✓మాదాపూర్ కల్లు దుకాణం నుంచి JNTU, ముసాపేట వెళ్లే వారు 100 ఫీట్ జంక్షన్, పర్వత్నగర్ నుంచి కైతలాపుర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.
✓సైబర్ టవర్స్ వంతెన కింద నుంచి N-గార్డెన్ హోటల్ వద్ద లెఫ్ట్ టర్న్- N-కన్వెన్షన్- జైన్ఎంక్లేవ్ రైట్టర్న్- యశోద హాస్పిటల్ వైపు వెళ్లాలి.
Sorry, no posts matched your criteria.