India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. మరో గంటలో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి. – SHARE IT
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. మరో గంటలో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
– SHARE IT
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 190 పోలింగ్ బూత్లో వంద సంవత్సరాల వయస్సు పైబడిన పోచం సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు వేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా తను ఓటు వేయకుండా ఉండలేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగియనుంది. 6 గంటల వరకు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి ఓటు వేసి అవకాశం కల్పిస్తారు. కావున ఇప్పటివరకు ఓటు వేయని వారు ఓటర్లు త్వరగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పదండి ఇంకా ఓటేసి మీ నాయకుడిని ఎన్నుకోండి.
HYD-ఉమ్మడి రంగారెడ్డిలో మరికాసేపట్లో పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు HYDలో 29.47%, మల్కాజిగిరిలో 37.69%, సికింద్రాబాద్ 34.58%, చేవెళ్ల 45.35%, కంటోన్మెంట్ బై పోల్లో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. మన రాజధాని పరువు పోయేలా అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైంది. పాతబస్తీలో ఏకంగా ఇంటి తలుపులు కొట్టి మరీ ఓట్ల వేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇక సమయం లేదు. హైదరాబాదీ ఇకనైనా బయటకురా. SHARE IT
HYD-ఉమ్మడి రంగారెడ్డిలో మరికాసేపట్లో పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు HYDలో 29.47%, మల్కాజిగిరిలో 37.69%, సికింద్రాబాద్ 34.58%, చేవెళ్ల 45.35%, కంటోన్మెంట్ బై పోల్లో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. మన రాజధాని పరువు పోయేలా అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైంది. పాతబస్తీలో ఏకంగా ఇంటి తలుపులు కొట్టి మరీ ఓట్ల వేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇక సమయం లేదు. హైదరాబాదీ ఇకనైనా బయటకురా. SHARE IT
లోక్ సభ ఎన్నికల్లో ఓటేయడానికి యూఎస్ నుంచి రావడం విశేషం. మెదక్ పట్టణానికి చెందిన మెంగని యామిని ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ఎంపీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవడానికి ఆమె తిరిగి వచ్చారు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన అనన్య ఎరుగు మొదటిసారిగా ఓటు వేయడం ఎంతో అనుభూతినిచ్చిందని చెప్పారు. ఇది మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో ప్రజాస్వామ్యం కల్పించిన బాధ్యతగా పేర్కొన్నారు.
ఏజెన్సీలో నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అధికారులు 4గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ములుగు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావం లేని ఖమ్మం సెగ్మెంట్లో 6గంటల వరకు పోలింగ్ సాగనుంది. క్యూలో ఉన్నవారు మాత్రం ఓటేయనున్నారు.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-60.58%, డోర్నకల్-64.51%, మహబూబాబాద్-58.71%, ములుగు-61.23%, నర్సంపేట-62.30%, పినపాక-60.68%, ఇల్లందు-61.40%గా ఉన్నాయి.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-63.00%, చెన్నూర్-58.65%, ధర్మపురి-60.23%, మంచిర్యాల-52.97%, మంథని-56.20%, పెద్దపల్లి-55.60%, రామగుండం-47.10 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 55.92% నమోదైంది.
Sorry, no posts matched your criteria.