India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD సైబర్ టవర్స్ వద్ద సర్వీస్ రోడ్డు నిర్మిస్తుండటంతో SEP14 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ✓మాదాపూర్ కల్లు దుకాణం నుంచి JNTU, ముసాపేట వెళ్లే వారు 100 ఫీట్ జంక్షన్, పర్వత్నగర్ నుంచి కైతలాపుర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.
✓సైబర్ టవర్స్ వంతెన కింద నుంచి N-గార్డెన్ హోటల్ వద్ద లెఫ్ట్ టర్న్- N-కన్వెన్షన్- జైన్ఎంక్లేవ్ రైట్టర్న్- యశోద హాస్పిటల్ వైపు వెళ్లాలి.
తెలంగాణలోని పేద కళాకారులను తమ ప్రజాప్రభుత్వం అన్నివిధాలా అదుకొంటుందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శారద కథలు బలగం సినిమాలో నటించిన పేదకళాకారులు కొమురమ్మ, మొగిలయ్యలకు తన జీతం నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. పొన్నం సత్తయ్యగౌడ్ 14వ వర్ధంతి సందర్భంగా పలువురికి ఆయన స్మారక అవార్డులను మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణ రావు అందజేశారు.
తెలంగాణలోని పేద కళాకారులను తమ ప్రజాప్రభుత్వం అన్నివిధాలా అదుకొంటుందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శారద కథలు బలగం సినిమాలో నటించిన పేదకళాకారులు కొమురమ్మ, మొగిలయ్యలకు తన జీతం నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. పొన్నం సత్తయ్యగౌడ్ 14వ వర్ధంతి సందర్భంగా పలువురికి ఆయన స్మారక అవార్డులను మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణ రావు అందజేశారు.
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ శుక్రవారం పంచాయతీ విధులపై సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలలో ఓటరు జాబితా అభ్యంతరాలు, నమోదు, కార్యదర్శుల బదిలీ, రిలీవింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జనానికి ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుదలపై శ్రద్ధపెట్టాలని, వరద ప్రభావిత గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చి, సీసీ చార్జీల వంటి అంశాలను సమీక్షించాలన్నారు.
పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యాన్ని సాధించవచ్చని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం అన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల గ్రౌండ్, ఆట స్థలాన్ని, హాస్టల్ ను, తరగతి గదులను, కిచెన్, టాయిలెట్స్, స్టోర్ రూంలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆటలాడుతున్న విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించారు.
ఓటర్ జాబితాలో పేరు సవరణకు ఈనెల 21 వరకు అవకాశం కల్పించినట్లు వనపర్తి జిల్లా డిపిఓ సురేష్ కుమార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేపథ్యంలో ఆయన శుక్రవారం అమరచింత ఎంపీడీవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ఈనెల 19 వరకు ఓటర్లు తమ పేర్లను సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈనెల 19న అఖిలపక్ష పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి 28న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
రామంతపూర్ HYD పబ్లిక్ స్కూల్లో చదివిన 1987 బ్యాచ్ ఎస్.ద్వారకనాథ్ సుప్రీం కోర్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ (ASG)గా నియమితులయ్యారు. HYDలో చదివి సీనియర్ న్యాయమూర్తి స్థాయి నుంచి ASG స్థాయికి వెళ్లడం తమకు ఎంతో గర్వంగా ఉందని HPS బృందం, ద్వారకానాథ్ తెలియజేశారు. HYD పబ్లిక్ స్కూల్లో చదివిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ముఖ్య పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
రామంతపూర్ HYD పబ్లిక్ స్కూల్లో చదివిన 1987 బ్యాచ్ ఎస్.ద్వారకనాథ్ సుప్రీం కోర్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ (ASG)గా నియమితులయ్యారు. HYDలో చదివి సీనియర్ న్యాయమూర్తి స్థాయి నుంచి ASG స్థాయికి వెళ్లడం తమకు ఎంతో గర్వంగా ఉందని HPS బృందం, ద్వారకానాథ్ తెలియజేశారు. HYD పబ్లిక్ స్కూల్లో చదివిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ముఖ్య పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈనెల 16న గణేష్ నిమజ్జనం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా సోమవారం మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో మద్యం దుకాణాలు, బార్లు క్లోజ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంగళవారం యథావిధిగా షాపులు తెరుచుకుంటాయి.
ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ గేట్ల వద్ద ఇటీవల భారీ వర్షాలతో అలీసాగర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తారు. దీంతో వరదనీటితో పాటు చేపలు దిగువ ప్రాంతానికి వచ్చాయి. ఈ క్రమంలో నిజామాబాద్ పట్టణానికి చెందిన పలువురు యువకులు పెద్దఎత్తున అలీసాగర్ గేట్ల దిగువన నిలిచిన వరదనీటితో చేపలు పట్టేందుకు ఇలా చుట్టూ ఉన్న గోడపై కూర్చొని కాలక్షేపం చేశారు.
Sorry, no posts matched your criteria.