India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామగుండం పట్టణంలో పలువురు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం వారి బాధ్యత అని వారు తెలిపారు. పోలింగ్ సెంటర్లో అన్ని సౌకర్యాలను కల్పించారని పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామంలో గుగులోత్ భద్రమ్మ ఓటు వేసేందుకు వెళ్లి కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో స్థానికులు 108కు ఫోన్ చేయగా.. గూడూరు ప్రాథమిక ఆసుపత్రికి అంబులెన్సులో తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని 108 సిబ్బంది తెలిపారు.
సికింద్రాబాద్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. మోండామార్కెట్లోని ఇస్లామీయ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2009 తర్వాత పద్మారావు తన ఓటు తానే వేసుకోవడం విశేషం. ఆయన నివాసం పక్కా సికింద్రాబాద్ అయినప్పటికీ.. మోండా మార్కెట్ సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తోంది. ప్రస్తుతం ఆయన MP అభ్యర్థిగా నిలవడంతో ఈ అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఓటేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అమూల్యమైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నేత కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అమూల్యమైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నేత కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-30.10%, డోర్నకల్-33.33%, మహబూబాబద్-30.95%, ములుగు-29.79%, నర్సంపేట-28.50%, పినపాక-32.00%, ఇల్లందు-30.30%గా ఉన్నాయి.
హార్ట్ ఎటాక్తో ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్ మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటు చేసుకుంది. పేరాయిగూడెం బూత్ నెంబర్ 165లో ఓటింగ్ విధులకు అధికారి గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు అతణ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఉప్పల్, మల్కాజిగిరి, జవహర్నగర్, షాద్నగర్ తదితర చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి ఓటర్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల పనితీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. తాము ఓటేసేందుకు వస్తే ఈవీఎంలు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఉప్పల్, మల్కాజిగిరి, జవహర్నగర్, షాద్నగర్ తదితర చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి ఓటర్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల పనితీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. తాము ఓటేసేందుకు వస్తే ఈవీఎంలు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెంలో గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. గ్రామ సమస్యలు పరిష్కరించలేదని.. ఓటు వేసేది లేదని వారు చెబుతున్నారు. సాగు, తాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు అవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.