Telangana

News May 13, 2024

పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (26.17%)

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-30.52%, చెన్నూర్-26.35, ధర్మపురి-28.11%, మంచిర్యాల-24.87%, మంథని-27.45%, పెద్దపల్లి-25.57%, రామగుండం-21.46శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

NZB పార్లమెంట్‌లో 11 గంటలకు 28.26% పోలింగ్

image

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 28.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ 28.77, నిజామాబాద్ అర్బన్ 23.04, ఆర్మూర్ 28.39, బోధన్ 29.46, బాల్కొండ 30.53, కోరుట్ల 29.10, జగిత్యాల 30.10 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.

News May 13, 2024

కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (26.14%)

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి.
చొప్పదండి-29.09%, హుస్నాబాద్-30.35%, హుజూరాబాద్-22.89%, కరీంనగరర్-20.78%, మానకొండూర్-24.96%, సిరిసిల్ల-27.80%, వేములవాడ-30.17శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

MBNRలో 26.99.. NGKLలో 27.74 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 11గం. వరకు MBNR పరిధిలో 26.99, నాగర్ కర్నూల్‌లో 27.74 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 26.12, వనపర్తి- 29.46, గద్వాల- 29.53, ఆలంపూర్- 30.46, అచ్చంపేట- 25.32, కల్వకుర్తి- 28.46, కొల్లాపూర్- 24.50⏵మహబూబ్‌నగర్-25.23, జడ్చర్ల-29.80, దేవరకద్ర-29.75, నారాయణపేట-24.32, మక్తల్-25.11, షాద్‌నగర్-25.69, కొడంగల్-29.32 శాతం నమోదైంది.

News May 13, 2024

HYD: ఉ.11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉ.11 గంటల వరకు HYDలో 10.70, మల్కాజిగిరిలో 15.05, సికింద్రాబాద్ 15.77, చేవెళ్ల 20.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 16.34 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ‌

News May 13, 2024

HYD: ఉ.11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉ.11 గంటల వరకు HYDలో 10.70, మల్కాజిగిరిలో 15.05, సికింద్రాబాద్ 15.77, చేవెళ్ల 20.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 16.34 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ‌

News May 13, 2024

ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (31.56%)

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఓవరాల్‌గా 31.56%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా.
ఖమ్మం – 26.38,
పాలేరు -32.52,
మధిర -39.87,
వైరా-32.90,
సత్తుపల్లి-35.08,
కొత్తగూడెం -29.60,
అశ్వారావుపేట- 32.01

News May 13, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కరీంనగర్ సీపీ

image

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందిని ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద సమస్యలు ఉన్నట్లయితే దృష్టికి తీసుకురావాలన్నారు. ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే అందుబాటులో ఉండే సమీప అధికారులకు తెలియజేయాలన్నారు.

News May 13, 2024

లింగంపేట్: చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు మృతి

image

చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో చోటుచేసుకుంది. లింగంపేట మండల కేంద్రంలో మత్తడి పోచమ్మ ఆలయానికి వెళ్లేదారిలో ఎల్లమ్మ గుడి వద్ద గల వేప చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియ రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 13, 2024

నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్‌జెండర్స్

image

పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నల్గొండలో ప్రశాంతంగా కొనసాగుతుంది. పట్టణంలోని బోయవాడ పోలింగ్ సెంటర్‌లో ట్రాన్స్ జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.