Telangana

News May 13, 2024

జహీరాబాద్ పార్లమెంట్ లో 12.88 శాతం పోలింగ్ నమోదు

image

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం 9 గంటల వరకు 12.88 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 15.71 శాతం, జుక్కల్ లో 12.58 శాతం, ఎల్లారెడ్డి లో 14.17 శాతం, కామారెడ్డిలో 12.49 శాతం, నారాయణ ఖేడ్ లో 12.71 శాతం, ఆందోల్ లో 11.48 శాతం, జహీరాబాద్ నియోజవర్గంలో 11.84 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.

News May 13, 2024

MDK:ఎన్నికలు.. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారు

image

లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు ⏵శాంతి భద్రతల ఆటంకం ⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం ⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ ⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం ⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు ⏵అసత్య వార్తలు వ్యాప్తి

News May 13, 2024

ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న రిటర్నింగ్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు

image

ఓటింగ్ సరళిని కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఓటింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐ.డీ.ఓ.సీ)లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలిస్తున్నారు.

News May 13, 2024

సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ధర్మపురి అర్వింద్

image

భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్‌లో గల కాకతీయ స్కూల్ క్యాంపస్ పోలింగ్ బూత్‌లో ఆయన సతీమణి తో కలిసి ఓటు వేశారు. ఆయనతోపాటు స్థానిక కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

News May 13, 2024

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి

image

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటును వినియోగించుకున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

News May 13, 2024

HYD: ఓటేసిన బండ్ల గణేశ్ 

image

టాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు వచ్చారు. ఆయన సతీమణి కూతురు, కుమారుడితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బూత్ నంబర్ 248లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

News May 13, 2024

HYD: ఓటేసిన బండ్ల గణేశ్

image

టాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు వచ్చారు. ఆయన సతీమణి కూతురు, కుమారుడితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బూత్ నంబర్ 248లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News May 13, 2024

కరీంనగర్: దూరంగా యువత

image

ఎన్నికల్లో సాధారణంగా అభ్యర్థుల గెలుపోటములను యువ ఓటర్లు నిర్దేశించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 29.78లక్షల మంది ఓటర్లలో 23.50శాతం యువతే ఉన్నారు. 2014 KNR లోక్‌సభ స్థానంలో 72.23%, పెద్దపల్లిలో 71.68శాతంగా ఉంది. KNRలో 16,50,893 మంది ఓటర్లకు 11,46,467(69.45) మంది ఓటేశారు. పెద్దపల్లిలో 14,78,062 మందికి 9,67,801 మంది(65.48%) ఓటేశారు. అంటే రెండు చోట్లా 80%లోపే పోలింగ్ నమోదయింది.

News May 13, 2024

‘మద్నూర్‌‌లో ఉ.8 గంటల వరకు ఓట్లు నమోదు కాలేదు’

image

మద్నూర్ మండలంలోని మూడో వార్డులో ఈవీఎంలు మొరాయించాయి. ఉదయం 8 గంటల వరకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని అధికారుల తెలిపారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో టెక్నీషియన్ల సాయంతో వాటిని బాగు చేయించి ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు.

News May 13, 2024

ఓటు వేసిన కలెక్టర్ దాసరి హరిచందన

image

నల్లగొండ జిల్లా కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్ర ఈరోజు ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్ సమీపంలోని చెన్నకేశవ స్కూల్లో కలెక్టర్ ఓటు వేశారు. సామాన్య ప్రజలతో పాటు క్యూలైన్లో నిలబడి కలెక్టర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు.