Telangana

News May 13, 2024

KNR: ఎన్నికలు.. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారు

image

లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి

News May 13, 2024

జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు పునః ప్రారంభం

image

ఉమ్మడి జిల్లాలో ఇంటర్ కళాశాలలు జూన్ 1వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్నాయి. వెంటనే మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీసీ, స్టడీ సర్టిఫికెట్, తాత్కాలిక టెన్త్ మార్కుల మోమో ఆధారంగా ప్రిన్సిపాల్స్ ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తారు. ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్లు నిర్ధారిస్తారు.

News May 13, 2024

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

image

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన కామారెడ్డిలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ప్రణీత్, రిషికేష్, శివాజీ బైక్‌పై తమ పొలం వైపు వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ వచ్చి ఢీకొంది. దీంతో ప్రణీత్ (12) అక్కడికక్కడే మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ నవీన్ పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News May 13, 2024

సిరిసిల్ల: మాక్ పోలింగ్ నిర్వహణ

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల & వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంలను, వివి ప్యాట్లను ప్లాట్లను సరిచూసుకున్నారు. మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ ప్రారంభం కానుంది.

News May 13, 2024

భువనగిరి, నల్గొండ MP అభ్యర్థులు ఓటేసేది ఇక్కడే

image

రఘువీర్ రెడ్డి (INC) నందికొండలోని విజయపూరి నార్త్, హిల్ కాలనీలో, BRS MP అభ్యర్థి కృష్ణారెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్లలో, బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డికి మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటేయనున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి (INC) శాలిగౌరారం మం. బాలిశెట్టి గూడెం, క్యామ మల్లేశ్ (BRS) ఇబ్రహీం పట్నం పరిధి శేరిగూడెం, బూర నర్సయ్య (BJP) ఇబ్రహీం పట్నం పరిధి పసుమాముల, జహంగీర్ (CPM) మునిపంపులలో ఓటుంది.

News May 13, 2024

సింగారం గ్రామంలో మొదలైన ఎన్నికల పోలింగ్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ మొదలైంది. శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ-లైన్లలో వేచి ఉన్నారు. ఎండల నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 13, 2024

గద్వాల: అక్కడి ప్రజలకు డబుల్‌ ధమాకా

image

APలోని కర్నూలు పట్టణంలో TGకి సంబంధించిన అలంపూర్ నియోజకవర్గ ఓటర్లు అటు కర్నూలు ఇటు అలంపూర్‌లోనూ ఓటు వినియోగించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే APకి చెందిన వివిధ పార్టీల నాయకులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఓటర్లను నేరుగా వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. సుమారు ఆరు వేల ఓటర్లు ఇలా ఉన్నట్లు సమాచారం. ఓటేసేందుకు సైతం ఓ గంల పెంచడం ఓటు వేసేందుకు కలిసివచ్చినట్లేనని అక్కడి ప్రజలు అంటున్నారు.

News May 13, 2024

GREAT.. ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు..!

image

సిద్దిపేట జిల్లా యువకుడు ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు. రాయపోలు మండలం వడ్డేపల్లికి చెందిన బచ్చు శ్రావణ్‌ కుమార్‌ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు. తాజా ఎంపీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సంకల్పంతో శనివారం స్వగ్రామానికి వచ్చారు. ‘ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చానని, అన్ని విధాల ఆలోచించి మంచి వారికి ఓటేస్తా’ అని శ్రావణ్ అంటున్నారు.

News May 13, 2024

KMM: ‘ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయోచ్చు’

image

కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయోచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయోచ్చని పేర్కొన్నారు.

News May 13, 2024

వరంగల్ జిల్లాలో 22.3 మి.మీ వర్షపాతం నమోదు

image

వరంగల్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం పడింది. గీసుగొండలో 61.9 మి.మీ, ఖానాపురంలో 61 మి.మీ, వరంగల్‌లో 59.8 మి.మీ, ఖిలా వరంగల్‌లో 43,5 మి.మీ, సంగెంలో 28.8 మి.మీ, దుగ్గొండిలో 25.3 మి.మీ, నర్సంపేటలో 10 మి.మీ వర్షం పడింది. జిల్లావ్యాప్తంగా సరాసరి 22.3 మి.మీ వర్షం కురిసింది. మొత్తంగా 292.3 మి.మీ వర్షం పడినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.