India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ గేట్ల వద్ద ఇటీవల భారీ వర్షాలతో అలీసాగర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తారు. దీంతో వరదనీటితో పాటు చేపలు దిగువ ప్రాంతానికి వచ్చాయి. ఈ క్రమంలో నిజామాబాద్ పట్టణానికి చెందిన పలువురు యువకులు పెద్దఎత్తున అలీసాగర్ గేట్ల దిగువన నిలిచిన వరదనీటితో చేపలు పట్టేందుకు ఇలా చుట్టూ ఉన్న గోడపై కూర్చొని కాలక్షేపం చేశారు.
దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా సీతారాం ఏచూరి గుర్తింపు పొందారని, దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసుకున్న ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని అన్నారు.
తానూర్ మండలం బోసి గ్రామంలో వినాయక నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన కర్ర వినాయకునికి శుక్రవారం ఏడవ రోజు భక్తులు భారీ నైవేద్యాన్ని సమర్పించారు. 108 రకాల పిండి వంటలు, స్వీట్లను స్వామి వారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు పుష్కలంగా పండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.
✒గణేష్ ఉత్సవాలు..పలుచోట్ల అన్నదానం
✒తిరుమల శ్రీవారి సేవలో ఎంపీ అరుణ
✒వరద భాదితులకు జితేందర్ రెడ్డి రూ.కోటి విరాళం
✒28న జాతీయ లోక్ అదాలత్
✒కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు చెల్లించండి:AITUC
✒MBNR:ఇంటర్ అధికారిగా కౌసర్ జహన్
✒NRPT:నేలకొరిగిన వంద ఏళ్లనాటి వృక్షం
✒NGKL:అరుణాచలానికి ప్రత్యేక బస్సు
✒ప్రజాపాలన దినోత్సవ వేడుకలపై కలెక్టర్ల సమీక్ష
✒అరెస్టులు,నిర్బంధాలు BRSకు కొత్తేమీ కాదు:BRS
ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తే ఆరుగురు భారీ మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన వారిలో కల్లెపల్లి శ్రీశైలం, గుడిపాటి మధుసూదన్ రెడ్డి, పుష్పాల నర్సింహులు, బత్తుల నరేందర్ రెడ్డి, రుద్రాల నరసింహ రెడ్డి, మండలి జంగయ్య ఉన్నారు. గెలుపొందిన వారికి ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య వారికి శుభాకాంక్షలు తెలిపారు.
మంచి లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది. దీనిలోనే భాగంగా నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో ఆయిల్ పామ్ సాగు గమనియంగా పెరుగుతుంది. దీనిపై రైతులు కూడా మక్కువ చూపుతున్నారు. గతంలో ఆయిల్ ఫామ్ చెట్లు పెంచిన రైతులు అధిక లాభాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు అధికారులకు, పోలీసులకు అన్నివిధాలుగా సహకరించాలని కోరారు.
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ జితేందర్ తన వంతుగా సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం ఇచ్చారు. సుదర్శన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, ఏపీ సంజయ్ రెడ్డితో కలిసి సచివాలయంలో సీఎంకు చెక్కును అందజేశారు. ఇటీవల తెలంగాణలో సంభవించిన వరదలు తనను ఎంతగానో కలిచివేశాయని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు మేలు చేసేందుకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తాయని అన్నారు.
ఉమ్మడి జిల్లా సిపిఎం పార్టీలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. మరి జిల్లా సిపిఎం పార్టీలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకురాలు లక్ష్మీదేవమ్మ(70) మరణించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అనేక కార్మిక ఉద్యమాల్లో లక్ష్మీ దేవమ్మ చురుకుగా పాల్గొన్నారు. మహిళ ఉద్యమాల నిర్మాణంలోనూ లక్ష్మీ దేవమ్మ చురుకైన పాత్ర పోషించారు. లక్ష్మీ దేవమ్మ మృతి పట్ల సిపిఎం నాయకులు సంతాపం తెలిపారు.
అలంపురంలోని బాల బ్రహ్మేశ్వర ఆలయం లో ఉన్న ద్వారపాలకుల విగ్రహానికి ఈఓ పురేందర్ కుమార్ రంగులు వేయిస్తున్నారు. 60ఏళ్ల క్రితం కళ్ళే రంగస్వామి(కుంటి రంగస్వామి)అనే స్థానిక కళాకారుడు ఈ ద్వారపాలకుల విగ్రహాలను స్వయంగా చేశారు. మంచి రూపలావణ్యం కలిగిన విగ్రహాలను భక్తులు గుర్తించలేకపోతున్నారంటూ ఈవో వాటికి పేయింటింగ్ చేయించారు. ఇంతకాలానికి గుర్తించినందుకు ధన్యవాదాలంటూ కళ్లె వంశీయులు రంగ అన్నారు.
Sorry, no posts matched your criteria.