Telangana

News May 13, 2024

598 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల: ఎస్పీలు

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. 349 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. సూర్యాపేట జిల్లాలో 229 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అక్కడ సజావుగా ఎన్నికలు జరిగేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. 

News May 13, 2024

హైదరాబాద్‌ పరువు తీయకండి.. ఇకనైనా ఓటేయండి!

image

ఏ ఎన్నికలైనా పోలింగ్ శాతంలో రాజధాని మాత్రం చివరిలో నిలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో HYDలో 44.84%, మల్కాజిగిరిలో 49.63%, సికింద్రాబాద్‌లో 46.50%, చేవెళ్లలో 53.25% నమోదు కావడం గమనార్హం. పోలింగ్ శాతం పెంచేలా EC అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్లే స్టోర్‌లో VOTER HELPLINE యాప్ తీసుకొచ్చారు. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసి మీ పోలింగ్ బూత్‌‌ ఎక్కడుందో తెలుసుకోండి. HYD పరువు తీయకండి. ఇకనైనా ఓటేయండి.

News May 13, 2024

హైదరాబాద్‌ పరువు తీయకండి.. ఇకనైనా ఓటేయండి!

image

ఏ ఎన్నికలైనా పోలింగ్ శాతంలో రాజధాని మాత్రం చివరిలో నిలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో HYDలో 44.84%, మల్కాజిగిరిలో 49.63%, సికింద్రాబాద్‌లో 46.50%, చేవెళ్లలో 53.25% నమోదు కావడం గమనార్హం. పోలింగ్ శాతం పెంచేలా EC అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్లే స్టోర్‌లో VOTER HELPLINE యాప్ తీసుకొచ్చారు. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసి మీ పోలింగ్ బూత్‌‌ ఎక్కడుందో తెలుసుకోండి. HYD పరువు తీయకండి. ఇకనైనా ఓటేయండి.

News May 13, 2024

MBNR: నేడే ఎంపీ ఎన్నికల ఓటింగ్.!

image

నేడు నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న MBNR, NGKL పార్లమెంట్ స్థానాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక మార్గాల ద్వారా ఓటు హక్కు వినియోగం, ప్రాముఖ్యతను ఎన్నికల సంఘం ఓటర్లకు అవగాహన కల్పించింది. కాగా.. నేడు ఉమ్మడి జిల్లాలో 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

ఖమ్మం జిల్లాలో 230 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: సీపీ సునీల్ దత్

image

పోలింగ్ కేంద్రాల పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. 230 సమస్యాత్మక కేంద్రాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటుచేసినట్లు వివరించారు.

News May 13, 2024

భీంపూర్: ఎన్నికల సిబ్బందికి పాము కాటు

image

భీంపూర్ మండలం అందర్ బంద్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ప్రఫుల్ రెడ్డికి పాము కాటేసింది. టాయిలెట్‌కు వెళ్ళినపుడు పాము కాటేయడంతో వెంటనే అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. జైనథ్ మండలం ముక్తాపూర్‌లో ఉపాధ్యాయుడిగా ప్రఫుల్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.

News May 13, 2024

ఓటింగ్ సమాచారం త్వరితగతిన అందించాలి: కలెక్టర్ రాహుల్

image

పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సమాచారం త్వరితగతిన అందించాలని సిబ్బందికి కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం సిబ్బందితో మాట్లాడుతూ..  పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం, ఓటర్ల హాజరు సమాచారం త్వరిత గతిన ఉన్నతస్థాయి అధికారులకు అందించాలని, ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటర్ల హాజరు, పోలింగ్ శాతం అందించి పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.

News May 13, 2024

సిద్దిపేట: ప్రజా సేవకులను ఎన్నుకోండి

image

భారత రాజ్యాంగం మనకు కల్పించిన అమూల్యమైన, అతి ముఖ్యమైన హక్కు “ఓటు”. కుల, మత విభేదాలు లేకుండా ధనిక పేద తేడాలేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కును కలిగి ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని నిజమైన ప్రజా సేవకులను నాయకులుగా ఎన్నుకోవాలి.

News May 13, 2024

MDK: కేంద్రాలకు రండి.. ఓటేయండి: కలెక్టర్లు

image

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ నేడు ఓటేసేందుకు రావాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌, సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి పిలుపునిచ్చారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్ల కోసం మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిర్భయంగా వచ్చి ఓటేయాలని, యువత చొరవ చూపి అందరూ ఓటేసేలా చూడాలన్నారు.

News May 13, 2024

సిరా చుక్క తయారయ్యేది మన HYDలోనే..!  

image

ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా వేలికి పెట్టుకునే సిరాని 1990 నుంచి HYDలోనూ తయారు చేయటం ప్రారంభించారు. ఉప్పల్‎లోని రాయుడు ల్యాబొరేటరీస్ అనే సంస్థ ఈ సిరాని తయారు చేస్తోంది. సుమారు 100 దేశాలకు ఈ సిరాని ఎగుమతి చేస్తోంది. దాదాపు 100 దేశాలకు ఈ సిరాను సరఫరా చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.