Telangana

News September 13, 2024

జనగామ: పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించాలి: కలెక్టర్

image

జనగామ కలెక్టర్ కార్యాలయంలో సీడీపీఓలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ లతో ఎస్ఎస్ఎఫ్పీ కార్య నిర్వహణపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లో టీచర్లు పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్ని గుర్తించి, ప్రతి 15 రోజులకోసారి సరైన పద్ధతిలో బరువులు, ఎత్తు కొలతలను తీసి ఆన్‌లైన్‌లో సరైన విధంగా నమోదు చేయాలన్నారు. సీడీపీఓలు రమాదేవి, మహేశ్ తదితరులున్నారు.

News September 13, 2024

ఖమ్మం జిల్లా అధికారులు, సిబ్బంది సేవలు ప్రశంసనీయం: సీపీ

image

ఖమ్మం జిల్లాలో వరదల సమయంలో సిబ్బంది ప్రజలకు అమూల్యమైన సేవలు అందించారని సి.పి సునీల్ దత్ తెలిపారు. పారిశుధ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులు మొదలైన వారు మానవతా దృక్పథంతో, కలసికట్టుగా విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించారని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు సిద్ధార్థ విక్రంసింగ్, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డిఆర్వో రాజేశ్వరి, మునిసిపల్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు.

News September 13, 2024

విద్యార్థులకు మంచి బోధన అందించాలి: మంత్రి రాజనర్సింహ

image

ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు ఉంటారని, వారిని తమ పిల్లలుగా భావించి బోధన చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అందోల్ నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో అన్నారు. త్వరలో హెల్త్ కార్డుల విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రఘోత్తంరెడ్డి, గుండు లక్ష్మణ్, మాణయ్య, బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News September 13, 2024

VKB: ఎయిడ్స్‌‌పై అవగాహన ఉండాలి

image

ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి ఐసీటీసీ కౌన్సిలర్ పార్వతాలు సూచించారు. శుక్రవారం మండల పరిధి దేవనూరులో వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సుఖ వ్యాధులతో ఎయిడ్స్ ప్రబలుతుందన్నారు. ఎయిడ్స్ బాధితుడితో మాట్లాడటం, కలిసి ఉండటం, భోజనం చేయడం వల్ల వ్యాధి సోకదన్నారు.

News September 13, 2024

నంది మేడారం: డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: ప్రభుత్వ విప్

image

పెద్దపల్లి జిల్లాలో ఈనెల 14న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ధర్మారం మండలం నంది మేడారం పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News September 13, 2024

ఖమ్మం: ‘ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు’

image

ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, డి.మధుసూదన్ నాయక్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు.

News September 13, 2024

ప్రణాళిక బద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలి: ఇంటర్ విద్యాధికారి

image

ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు తీసుకురావాలని మెదక్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి చెప్పారు. శుక్రవారం రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి సబ్జెక్టుపై విద్యార్థి పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ప్రశాంత వాతావరణంలో కళాశాల ఉండడం ఎంతో అభినందనీయమని చెప్పారు.

News September 13, 2024

CM రేవంత్ రెడ్డిని కలిసిన రామగుండం MLA

image

రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు HYDలోని CM రేవంత్ రెడ్డి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల రామగుండంలో 1,800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో CMకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రామగుండం మెడికల్ కాలేజీలో అదనంగా నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ విభాగాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి CM సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

News September 13, 2024

పిట్లం: తల్లి దండ్రులు మందలించారని సూసైడ్

image

తల్లి దండ్రులు మందలించారని మనస్తాపంతో కొడుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పిట్లం మండలం తిమ్మానగర్‌లో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజు వివరాలిలా.. తిమ్మనగర్ వాసి బొమ్మల నాందేవ్ (23) పనిచేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయంలో తల్లి దండ్రులు మందలించగా.. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News September 13, 2024

అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎమ్మెల్సీ

image

MHBD: బీఆర్ఎస్ ముఖ్య నేతల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రశ్నించే వారిపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుతూనే ఉంటామన్నారు.