India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికంగా ఈవీఎం యంత్రాలను వినియోగించనున్నట్లుగా అధికారులు తెలియజేశారు. ఒక్కో EVM యంత్రంలో నోటా, 15 మంది అభ్యర్థులను మాత్రమే అమర్చగలిగే సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 2019 పార్లమెంట్ ఎన్నికలలో స్వతంత్రులకు 5,173 ఓట్లు వచ్చాయి. నోటాకు మాత్రం 5,653 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. ముందస్తు ఎత్తుగడలతో వివిధ పార్టీల నేతలు స్వతంత్రులను బరిలోకి దింపుతున్నారు. స్వతంత్రులు, నోటాకు వచ్చిన ఓట్లు గెలుపోటములపై కీలకంగా మారుతున్నాయి.
HYD పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 1991 పార్లమెంటు ఎన్నికల్లో 77.1 శాతం ఓటింగ్ నమోదయింది. ఆ సమయంలో 12,96,145 మంది ఓటర్లు ఉండగా 9,99,602 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD చరిత్రలో అదే ఫస్ట్ టైం. 1984లో 76.8, 1989లో 71.3, 1998లో 73.2, 2019లో 53.4 ఓటింగ్ శాతం నమోదయింది. 2024 ఎన్నికల్లో ఆ రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టిద్దాం. అందరం ఓటు వేద్దాం.
HYD పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 1991 పార్లమెంటు ఎన్నికల్లో 77.1 శాతం ఓటింగ్ నమోదయింది. ఆ సమయంలో 12,96,145 మంది ఓటర్లు ఉండగా 9,99,602 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD చరిత్రలో అదే ఫస్ట్ టైం. 1984లో 76.8, 1989లో 71.3, 1998లో 73.2, 2019లో 53.4 ఓటింగ్ శాతం నమోదయింది. 2024 ఎన్నికల్లో ఆ రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టిద్దాం. అందరం ఓటు వేద్దాం.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మిర్యాలగూడలో జరిగింది. ఎస్సై నరేష్ తెలిపిన ప్రకారం.. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మాలోతు వాగ్య తన ద్విచక్ర వాహనంపై కిరాణం సామాన్ల కోసం మిర్యాలగూడ వస్తున్నాడు. గూడూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతిడి భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏజెన్సీలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అధికంగా ఏజెన్సీలో ఉండటంతో ఇక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 తర్వాత ఓటర్లను లోనికి అనుమతించమన్నారు.
NZB జిల్లా కొటగిరికి చెందిన వెంకటమ్మ కూతురిని కోల్పోయిన అమ్మ అనే పిలుపునకు దూరం కాలేదు. ఆమె కూతురు పావని పుట్టుకతోనే దివ్యాంగురాలు. తన వైకల్యాన్ని లెక్కచేయకుండా పావని 18 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుంది. 2018లో పావని మృతి చెందింది. వెంకటమ్మ 70 ఏళ్ల వయస్సులో తన కూతురి ఆశాయాన్ని ముందుకు తీసుకెళ్తోంది. వారిని చదివిస్తూ ముగ్గురు అమ్మాయిలకు పెళ్లి చేశారు. ఇద్దరు యువకులు ఆర్మీలో చేర్పించింది.
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆదివారం మణుగూరులో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున ఎవరూ కూడా పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమికూడరాదని తెలిపారు.
జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్ వద్ద జాతీయ రహదారిపై కారు ఢీకొని లచ్చమ్మ(70) మృతి చెందింది. కాగా, స్టేషన్ ఘన్పూర్లో కారు-స్కూటీ ఢీకొని రమేశ్(55) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.